ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పని సరి…
జహీరాబాద్ నేటి ధాత్రి:
పటేల్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన మోగడంపల్లి పీ.ఆర్. టి.యు అధ్యక్షులు, ఎంపీపీఎస్ తొట్టి తండా ప్రధానోపాధ్యాయులు చంద్రుడు రాథోడ్ గారి పదవి విరమణ అభినందన సభకు ఈరోజు శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వృత్తి నిబద్ధతకు మారుపేరు గారని, ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పని సరని అన్నారు చంద్రు రాథోడ్ ఎన్నో సేవలు అందించారని, ఎంతో మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దిన ఘనత వారికి దక్కుతుందన్నారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు హీరు రాథోడ్, కేషు ,సంజు,భీమ్,గులాబ్ సింగ్,రాం శెట్టి, దేవిధాస్,చందర్ స్వామి,కిషన్,శంకర్ చౌహాన్,నరేష్,నాయకులు పాల్గొన్నారు.