Bore Motor Restart Brings Relief to Villagers
పాడైపోయిన బోరు మోటర్ పున ప్రారంభం….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామంలో గత కొన్ని నెలలుగా బోరు మోటర్ పనిచేయకపోవడంతో. గ్రామంలోని ప్రజలు నీటి కొరతతో ఇబ్బందులు గురవుతుండగా స్థానిక సర్పంచ్ గడ్డం రచన మధుకర్. ఆధ్వర్యంలో ఇంద్రమ్మ కాలనీ గ్రామంలోని పోచమ్మ ఆలయం వద్ద 15 నెలలుగా పాడైపోయిన బోరు మోటర్ ను పున ప్రారంభించి గ్రామ ప్రజలకు నీటి సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. కొన్ని రోజులుగా గ్రామంలో నీటి బోరు పనిచేయకపోవడంతో గ్రామంలోని ప్రజలు నీ రు లేక ఇబ్బందులు గురవుతుండగా. సంబంధిత అధికారులతో మాట్లాడి నీటి కష్టాలు లేకుండా ప్రజలకు మళ్లీ బోరు బాగు చేయించి ప్రజలకు నీటి కష్టాలు తొలగించే విధంగా బోరును పున ప్రారంభించామని ఈ సందర్భంగా తెలియజేశారుఇట్టి కార్యక్రమంలో. ఉపసర్పంచ్ కొండ శ్రీకాంత్. వార్డు సభ్యులు వడ్డేపల్లి రమ. ముందాటి శారద. నాయకులు రచ్చ మల్ల సుదర్శన్. గాలి వీరేశం. అలువాలప్రశాంత్.దిండిగాల లక్ష్మి.నాగిళ్ల.సత్యవతి.రాచర్ల వాణి. పుష్పలత గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
