ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి

సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డి.తిరుపతి

శాయంపేట నేటిధాత్రి:

ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిపిఎం హనుమకొండ జిల్లా కమిటీ సభ్యులుతిరుపతి డిమాండ్ చేశారు.శాయంపేట మండలం ప్రగతిసింగారం గ్రామంలో సిపిఎంశాఖ మహాసభ నిర్వహించారు ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడారు అధికారంలోకి వచ్చి సంవత్సరకాలం అవుతున్నప్పటికీ ప్రభుత్వ మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల దాటవేస్తుందని, రైతు రుణమాఫీ, రైతుబంధు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం పంపిణీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రకటనలతోనే పబ్బం గడుపుతుందని, హామీలే కాదు ఆచరణ లో నెరవేర్చాలని, కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజల ఆశలు నిరాశ చేయవద్దని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి మాట నిలుపుకోవాలని కోరారు. హామీల అమలులో కాలయాపన చేయొద్దని ప్రభుత్వ హామీల అమలు పై సిపిఎం ఆధ్వర్యంలో జరిగే పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

సిపిఎం శాఖ కార్యదర్శిగా చిలకల కొమరయ్య

భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ (సిపిఎం) శాయంపేట (ప్రగతి సింగారం) శాఖ కార్యదర్శిగా మాజీ సర్పంచ్ చిలకల కొమర య్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు తిరుపతి తెలిపారు. గత 40 ఏళ్ల నుంచి సిపిఎం పార్టీలో పనిచేస్తూ ప్రజల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించి, పార్టీలో నీతి నిజాయితీకి కట్టుబడుతూ, పార్టీ సిద్ధాంతానికి లోబడి పని చేస్తున్న కొమురయ్యను కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు తిరుపతి తెలిపారు. కమిటీ సభ్యులుగా మాదాసు తిరుపతి, బల్ల రవి, కొమురయ్య, ఎల్లయ్యను ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాజయ్య, సమ్మయ్య, వెంకటయ్య, మల్లయ్యలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!