polycet falithalu vidudala, పాలిసెట్‌ ఫలితాలు విడుదల

పాలిసెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్ర పాలీసెట్‌-2019 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. హైదరాబాద్‌ బిఆర్‌కే భవన్‌లోని స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ కార్యాలయంలో టెక్నికల్‌ బోర్డు కమిషనర్‌, చైర్మన్‌ నవీన్‌ మిట్టల్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ పాలిసెట్‌ ఫలితాలలో 92.53 శాతం ఉత్తీర్ణత సాధించారు. స్టేట్‌ మొదటి ర్యాంకు సిద్దిపేట జిల్లాకు చెందిన మంకాల సజనకు, రెండవ ర్యాంక్‌ సూర్యాపేట జిల్లాకు చెందిన ఆరురి సాత్విక్‌కు దక్కాయి. ఈ పాలిసెట్‌-2019 పరీక్షలో 1,06,295 మంది అభ్యర్థులు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోగా, 1,03,587 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 92.53శాతం, 95,850అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించగా, అందులో 61505 బాలురు పరీక్ష రాయగా, 55933మంది ఉత్తీర్ణత (90.94శాతం) సాధించారు. 42082 బాలికలకు 39917మంది ఉత్తీర్ణత (94.86శాతం) సాధించారు. మే మొదటి వారంలో కౌన్సిలింగ్‌, జూన్‌ మొదటి వారంలో తరగతులు ప్రారంభమవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *