స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెపుతారు..

People speak their minds in local body elections People speak their minds in local body elections

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెపుతారు

రాష్ట్ర బడ్జెట్ పై యంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ఫైర్.

హైదారాబాద్,వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆర్బాటంగా శాసనసభలో ఆర్బాటంగా మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరువై ఐదు కోట్ల రూపాయల తో బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరు, వివిధ వర్గాలకు కెటాయించిన నిదులు మాటలు బారెడు – చేతలు చారెడుగా ఉన్నాయని ఈ బడ్జెట్ గత బిఆర్ఎస్ అంకెల గారడీ బడ్జెట్ గా, పాత సీసాలో కొత్త సారాయి లాగా ఉందని రాష్ట్ర బడ్జెట్ పై యంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ఫైరయ్యారు.దీంతో రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు పాలక కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తారని అందుకు తగిన మూల్యం చెల్లించటానికి కాంగ్రెస్ పాలకులు సిద్దంగా ఉండాలని రవి హెచ్చరించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఉదాహరణకు జనాభా లో 50 శాతం ఉన్న మహిళా, శిశు సంక్షేమానికి కేవలం రూపాయలు 2,862 కోట్లు, ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం చేసిన జనకుల గణనలో నూటికి 56 శాతం ఉన్న బిసిల అభివృద్ధి సంక్షేమానికి రూ. 11.405 కోట్లు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 42 శాతం బిసి రిజర్వేషన్ కు ఈ నిదులు ఎలా సరిపోతాయని అన్నారు.షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్ తెగలకు కలిపి చూస్తే రూపాయలు 57,401 కోట్లు కెటాయించి వాటిని ఎలా ఖర్చు పెడుతారో చెప్పలేదని కాగితాల మీద కెటాయింపు తప్ప మరేమీ కాదన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో యువజన రంగానికి నిదులు కెటాయింపులేదని అందులో పారిశ్రామిక రంగానికి రూపాయలు 3, 527 కోట్లు ఇచ్చారని వీటితో పరిశ్రమలు స్థాపన,ఉద్యోగం కల్పన ఎలా సాధ్యమని అలాగే
క్రీడారంగానికి కేవలం రూ.465 కోట్లతో ఎలా నైపుణ్యం పెరుగుతుందని, ప్రోత్సాహం ఎలా సాధ్యమని అడిగారు.ఆరోగ్య శ్రీ బకాయిపకు కెటాయించిన బడ్జెట్ రూ.12,393 కోట్లు అయితే మరి రానున్న సంవత్సరం వైద్య రంగం ఎలా ముందుకు పోతుందని దీంతో
ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగా మారుతొందని అన్నారు.విద్యా రంగానికి బడ్జెట్ లో 20 శాతం నిదులు కెటాయించకుండా కేవలం రూ.23,108 కోట్లు కెటాయించటం వలన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి లు, మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, గురుకుల విద్యాలయాల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల అభివృద్ధికి ఈ బడ్జెట్ ఏ మాత్రం సరిపోతుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.మొత్తంగా విద్య, వైద్య కార్పోరేట్ శక్తులకు ఉపయోగ పడుతుందని అన్నారు.
రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీల అమలుకు ఈ బడ్జెట్ కెటాయింపులో పైస కెటాయింపు లేకపోవడం తన ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలను తుంగలో తొక్కి కప్పదాటు చర్యలకు దిగుతున్న తీరు ప్రజలు సహించరని యంసిపిఐ(యు) హెచ్చరిస్తుందని ఆయన పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో బిసి లకు, మహిళలకు, నిరుద్యోగ యువతకు, విద్య, వైద్య, ఆరు గ్యారంటీల అమలు కు బడ్జెట్ ను సవరించాలని హైదరాబాద్ బాగ్ లింగంపల్లి ఓంకార్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశ నుండి యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి
డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!