నిజాంపేట , నేటి ధాత్రి
మెదక్ జిల్లా నిజాంపేట మండలం పరిధిలోని చల్మెడ గ్రామంలో ఏపీజీవీబీ బ్యాంకు మిత్ర ఆధ్వర్యంలో మైక్రో ఎటిఎం ద్వారా పాస్ బుక్ ప్రింటింగ్ సేవలు బుధవారం రోజున ప్రారంభించారు ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ మురళీకృష్ణ మాట్లాడుతూ గ్రామంలో బ్యాంకు సేవలు లభిస్తాయి అన్నారు అదేవిధంగా అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క సేవలు బ్యాంకు మిత్ర వద్ద సేవలు అందుతాయాన్ని వారు అన్నారు అలాగే పాస్ బుక్ ప్రింటింగ్ తీసుకోవచ్చునని అన్నారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, ఫీల్డ్ ఆఫీసర్ భాస్కర్, నిఖిల్ ,ఐరిక్స్ డిస్టిక్ మేనేజర్ శంకర్ ,ఛానల్ మేనేజర్ వెంకటేష్ ,బ్యాంకు మిత్రాలు మురళి, రవి, కొండల్ గౌడ్, గ్రామ ప్రజలు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు