సీ ఎం రేవంత్ రెడ్డి వనపర్తి లో చదువుకున్నారు మంత్రి జుపల్లి ఎమ్మెల్యే తూడి
వనపర్తి నేటీదాత్రి .
గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయంలో కోటి రూపాయలతో నూతనంగా నిర్మించిన ఫస్ట్ ఫ్లోర్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి , తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి , జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు గ్రంథాలయ నూతన మొదటి అంతస్తును ప్రారంభించిన అనంతరం సరస్వతి దేవి చిత్రపటానికి పూజలు నిర్వహించార శాలువాలు, బొకేలకు ఖర్చు చేసే సంస్కృతికి స్వస్తి చెప్పి, ఆ డబ్బుతో పుస్తకాలు కొనుగోలు చేయాలని సూచించారు దినపత్రిక లు పేపర్లు చదవాలని కోరారు . ప్రతి నియోజకవర్గంలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రూ.10 లక్షలతో విలువైన పుస్తకాలను కొనుగోలు చేసి అందుబాటులో ఉంచుతామని చెప్పారు
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ వనపర్తికి “చదువుల పర్తి”గా ప్రత్యేక గుర్తింపు ఉందని .
వనపర్తిలో అన్ని రకాల ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయని, నవోదయ విద్యాలయాన్ని కూడా తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని చెప్పారు.సీఎం
రేవంత్ రెడ్డి వనపర్తిలోనే చదువుకున్నారని, విద్యాభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తున్నారని అన్నారు. పర్యాటక, సాంస్కృతిక శాఖల నుంచి చెరో కోటి రూపాయల నిధులు కేటాయించాలని మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు. లైబ్రరీ వద్ద హైమాస్ట్ లైట్లు తదితర సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ యువత అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఖాళీ సమయంలో పుస్తకాలు దినపత్రిక లు చదివే అలవాటు పెంపొందించుకోవాలని, గ్రంథాలయంలో అవసరమైన సౌకర్యాల కల్పనకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి
జిల్లా గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ రీయాజ్ జిల్లా చైర్మన్ గోవర్ధన్ సాగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి, కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు
