9న దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మెను విజయవంతం .

9న దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలి

సిఐటియు జిల్లా అధ్యక్షులు బందు సాయి

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆటో ప్రచార జాత కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఐటీయూ పార్టీ జిల్లా అధ్యక్షులు బందు సాయిలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఈనెల 9న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులంతా ఐక్యంగా పాల్గొనాలి,కార్మికులను బానిసత్వంలోకి నెట్టే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి.కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26,000/-లుగాని నిర్ణయించాలి.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయరాదు. ప్రభుత్వరంగ సంస్థల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చెయ్యాలి. అసంఘటితరంగ కార్మికులను యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్’ను ప్రవేశపెట్టాలి.
గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర బడ్జెట్ నిధుల కేటాయింపు పెంచాలి. ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించాలి.అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం లాంటి స్కీమ్ వర్కర్లకు చట్టపరమైన కనీస వేతనాలు చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్,సిఐటియు సహాయ కార్యదర్శి ఆకుదారి రమేష్ ,సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం దేవేందర్, జిల్లా నాయకులు వెలిశెట్టి రాజయ్య, సిఐటియు జిల్లా నాయకులు శేఖర్,రవికుమార్, రాజేందర్,శంకర్,లక్ష్మణ్,మహేందర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!