*ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే*
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రం లోని రైతు వేదికలో నిర్వ హించిన కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన 38 మంది లబ్ధిదారులకు 11,26,000/- రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్య నారాయణరావు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేద,మధ్యత రగతి కుటుంబాలకు ఆప ద్బాంధవంగా నిలుస్తోంద న్నారు.అనారోగ్య సమస్య లతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుం బాలకు ప్రభుత్వం అండగా నిలిచి సహాయం అందించడం జరుగుతుంది.
పార్టీలకతీతం గా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు లను అందజేశారు.గత బిఆర్.ఎస్ ప్రభుత్వం కేవలం బిఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలకే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.ప్రజల కష్టసు ఖాల్లో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుం దని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నా మని,ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్ర తినిధులు, మండల అధికా రులు కాంగ్రెస్ పార్టీ నాయ కులు,కార్యకర్తలు లబ్ధిదా రులు పాల్గొన్నారు.
