KTR Silence Sparks Political Buzz
కేటీఆర్ సైలెంట్ మోడ్?
మౌనం మర్మమేంటి?
జగిత్యాల సభ విజయవంతం చేయాలని జన సమీకరణ విషయంలో గట్టిగా ప్రయత్నించిన కేటీఆర్ చివరికి సభకు హాజరు కాలేదు. సభ తర్వాత పరిమామాలపై స్పందించడం లేదు. అందుకే కేటీఆర్ మౌనం హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్ ఏడాదిన్నర తర్వాత నిర్వహించిన సభలో కేటీఆర్ మెరవకపోవడం, కనీసం ఆ సభ విజయవంతంపై సోషల్ మీడియాలో కూడా స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. నిన్నటి వరకు ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడిన ఆయన, గత కొద్దిరోజులుగా సైలెంట్ మోడ్లోకి వెళ్లడం వెనుక ఏదో జరుగుతోంది అనే చర్చ సాగుతోంది.
బీఆర్ఎస్ భవిష్యత్తు , పార్టీని ముందుకు తీసుకెళ్లే విధానంపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. ఒకరు దూకుడుగా వెళ్లాలని భావిస్తుంటే, మరొకరు వేచి చూసే ధోరణి అవలంబించాలని సూచిస్తున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు అగ్రనేతల మధ్య వ్యూహాత్మక భేదాలు తలెత్తడం వల్లే, ఒకరు యాక్టివ్గా ఉన్నప్పుడు మరొకరు మ్యూట్లోకి వెళ్తున్నారనే చర్చ రాజకీయ గల్లీల్లో జోరందుకుంది. ముఖ్యంగా క్షేత్రస్థాయి కార్యకర్తలు ఈ ముగ్గురూ కలిసికట్టుగా పోరాడాలని కోరుకుంటున్న తరుణంలో, ఇలాంటి మౌన వ్రతాలు ఇ్బందికరంగా మారాయి.
కేసీఆర్ గతంలో పాటించిన మౌన ముని వ్యూహాన్ని ఇప్పుడు కేటీఆర్ అమలు చేస్తున్నారా.. లేక నిజంగానే పార్టీలో నాయకత్వ బాధ్యతలు లేదా ప్రాధాన్యత విషయంలో ఏమైనా అలకలు ఉన్నాయా? అనేది తేలాల్సి ఉంది.
