కేటీఆర్ రోడ్ షో @సీతాఫల్ మండి , అడ్డగుట్ట డివిజన్ లు

నేటిధాత్రి హైదరాబాద్:

బి.ఆర్.ఎస్ పార్టీ సికింద్రాబాద్ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ గారికి మద్దతు గా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అడ్డగుట్ట , సీతాఫల్ మండి డివిజన్ ల లో జరిగిన రోడ్ షో లో పాల్గొని ప్రసంగించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్..

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లు సామల హేమ , లింగాని లక్ష్మీ ప్రసన్న , కంది శైలజ , రాసురి సునీత , బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం నాయకులు రామేశ్వర్ గౌడ్ , త్రినేత్ర గౌడ్ ,
కిషోర్ గౌడ్ , కిరణ్ గౌడ్…

పెద్ద ఎత్తున కేటీఆర్ , పద్మారావు గౌడ్ లకు ఘన స్వాగతం పలికిన బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు…

ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్ కామెంట్స్…

మా అన్న కేసీఆర్ గారు నన్ను పిలిచి ఎం.పి గా నిలబడు అని చెప్పి పంపిండు.అమిత్ షా , యోగి ఆదిత్యనాథ్ లాంటి వారు కార్పొరేటర్ ఎన్నికలప్పుడు వచ్చిన కూడా బి.ఆర్.ఎస్ పార్టీ కె పట్టం కట్టిండ్రు. పార్లమెంట్ లో సికింద్రాబాద్ నుండి అడుగుపెట్టబోతున్నాం.
నాడు గల్లీ లో గెలిసినం , నేడు ఢిల్లీ లో గెలుస్తాం.ప్రతి గడప గడప లోని అక్కచెల్లెలు , అన్నదమ్ములు నాకు బాగా తెలుసు. సికింద్రాబాద్ లో లక్ష మెజారిటి తో గెలిచి చరిత్ర సృష్టించబోతున్నాం.
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి లో 11 శాతం ముందంజలో ఉన్నాం.

 

బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్..
2014 లో బడే భాయ్ మోడీ గారు మస్త్ కథలు చెప్పిండు. రూ. 15 లక్షలు, ప్రతి ఒక్కరికి ఇళ్లు, ప్రతి ఇంటికి నల్లా, రైతుల ఆదాయం డబుల్, బుల్లెట్ ట్రైన్ అని పెద్ద పెద్ద బిల్డప్ లు ఇచ్చిండు. నల్లధనం ఏదయ్యా మోడీ అంటే…తెల్లమొఖం వేసిండు.కిషన్ రెడ్డి ఎంపీ, కేంద్రమంత్రై ఐదేళ్లు అయ్యింది. పైసా పని చేయలేదు.ఆయన చేసిందల్లా కుర్, కురే ప్యాకెట్లు పంచుడే.
హైదరాబాద్ లో వరదలు వస్తే రూపాయి ఇయ్యలే. మెట్రో కు పైసా ఇయ్యలే.
కానీ గుజరాత్ లో వరదలు వస్తే మాత్రం మోడీ ప్రత్యేక విమానం వేసుకొని పోయి వెయ్యికోట్లు ఇచ్చిండు.
గుజరాత్ వాళ్లే ప్రజలా ? హైదరాబాద్ వాళ్లు ప్రజలు కాదా? …అడ్డగుట్టకు, సీతా ఫాల్ మండి డివిజన్ , సికింద్రాబాద్ కు ఏం చేసినవో చెప్పి ఓటు అడిగే దమ్ముందా కిషన్ రెడ్డికి.
సిగ్గు లేకుండా ఐఐటీలు ఇచ్చినమని చెప్పుకుంటున్నారు. ఒక్క స్కూల్ కూడా ఇయ్యలేదు.
ఈ ప్రధాని మోడీ పప్పు, ఉప్పు, చింతపండు అన్ని పిరం చేసిన పిరమైన ప్రధాని. మోడీ వచ్చిన నాడు ముడి చమురు వంద డాలర్లకు బ్యారెల్.
ఇప్పుడు ముడి చమురు బ్యారెల్ కు 84 డాలర్లు.
మరి తగ్గాల్సిన ధరలు ఎందుకు తగ్గలేదు. రూ. 70 పెట్రోల్ రూ. 110 అయ్యింది.పెట్రోల్, డిజీల్ మీద రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా రూ. 30 లక్షల కోట్లు వసూలు చేసిండు.
ఈ పైసలతో జాతీయ రహదారులు కట్టినా అంటాడు. మరి టోల్ ఎందుకు వసూల్ చేస్తున్నావంటే చెప్పడు.
మన ముక్కుపిండి వసూలు చేసిన రూ. 30 లక్షల కోట్లలో రూ. 14 లక్షల కోట్లు అదానీ, అంబానీలకు రుణమాఫీ చేసిండు.
నేను చెప్పింది అబద్దమని కిషన్ రెడ్డి నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.
ఈసారి సిక్రిందాబాద్ శాసన సభ్యుడే సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు కావాలె. హైదరాబాద్ లో మీరు మాకు ఎక్కువ సీట్లు ఇచ్చారు. అందుకు మీకు రుణపడి ఉంటాం.
జిల్లాలో ఉన్న వాళ్లే మోసపోయారని మీరు బాధపడుతున్నారు.
బడేభాయ్ బడా మోసం. రేవంత్ రెడ్డిది కూడా బడా మోసమే.బస్సు ఫ్రీ, మహిళలకు రూ. 2500, వృద్ధులకు 4 వేలు, తులం బంగారం, స్కూటీలు ఇస్తా అన్నాడు.రేవంత్ రెడ్డి చెప్పి వాటిలో ఒక్కటైనా వచ్చిందా?..కాంగ్రెస్ వస్తే మంచిది కాదని ముందే చెప్పినం. వాళ్ల కాళ్లు మంచివి కావు.కాంగ్రెస్ వచ్చింది. రాష్ట్రంలో కరెంట్, నీటి కష్టాలు మొదలైనయ్.
కేసీఆర్ గారు సీఎం కాలేదని మీరు బాధపడుతున్నారు కదా?..10-12 సీట్లు మీరు మాకిస్తే మళ్లీ రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ గారు శాసిస్తారు.ఖైరతాబాద్ లో మన పార్టీ నుంచి గెలిసినోడు కాంగ్రెస్ లో జొర్రిండు.దానం నాగేందర్ అవకాశ వాద రాజకీయ నాయకుడు. ఆయన మళ్లీ బీజేపీలో చేరడని గ్యారంటీ ఏందీ? ..ఇప్పుడొచ్చి ఓటు వేయమని అడుగుతుండు. ఎందుకు ఓటేయాలె. ఉన్న ఫించన్ ఎగకొట్టినందుకా?..
తులం బంగారం కాదు… ఉన్న లక్ష కూడా ఇవ్వనందుకా? కరెంట్ కష్టాలు తెచ్చినందుకా? ఎందుకు వేయాలె.2014, 2019 లో బీజేపీని రాష్ట్రంలో ఓడించింది బీఆర్ఎస్ మాత్రమే.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ తీస్ మార్ ఖాన్లను ఓడించింది కూడా బీఆర్ఎస్ మాత్రమే.
ఒక్కటే ఓటు తో అటు బడాభాయ్, చోట భాయ్ కు బుద్ధి చెప్పాలె.కేసీఆర్ గారికి తమ్ముడి లాంటి నేత పద్మారావు గౌడ్ గారు.
ఎన్ని కష్టాలు వచ్చినా సరే పద్మారావు గౌడ్ గారు కేసీఆర్ గారితోనే ఉన్నారు.
ఒక్క సికింద్రాబాద్ నుంచే పజ్జన్నకు 60 వేల మెజార్టీ ఇవ్వలే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *