సందర్శించిన ఎం.ఈ.ఓ.
బి.బాలాజీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో సెల్ఫ్ డిఫెన్స్ కొరకు బాలికలకు ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న కరాటే శిక్షణ తరగతులు చుంచుపల్లిమండలం రుద్రంపూర్ లోని జడ్పీహెచ్ఎస్ .స్కూల్ లో మాజీ అంతర్జాతీయ కరాటే క్రీడాకారుడు ప్రముఖ కుంగ్ ఫు – కరాటే మాస్టర్ పీ.కాశీ హుస్సేన్ శిక్షకుడిగా వ్యవహరిస్తూ కొనసాగుతున్న కరాటే శిక్షణ తరగతులను చుంచుపల్లి మండలం ఎం.ఈ. ఓ. బి. బాలాజీ సందర్శించారు
బాలికలు కరాటేలో నేర్చుకుంటున్న మెలకువలను పరిశీలించారు బాలికలు శిక్షణలో తీసుకోవలసిన పలు జాగ్రత్తలు వారికి వివరించారు
ఈ సందర్భంగా ఎం.ఈ.ఓ శ్రీ బాలాజీ మాట్లాడుతూ
పిల్లలందరూ కూడా
ఈ శిక్షణ లో పాల్గొనాలని ఈ కరాటే విద్య ఆత్మరక్షణకు ,ఆరోగ్యానికి ఏకగ్రతకు , మరియు
సమాజంలో బాలికల పట్ల జరుగుతున్న దాడుల నుండి తమని తాము రక్షించుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన సూచించారు
ఈ కార్యక్రమంలో రుద్రంపూర్ జడ్.పి.హెచ్.ఎస్ ఇంచార్జ్ జె లక్ష్మి , కరాటే శిక్షకుడు పి. కాశీహుస్సేన్ ఉపాధ్యాయులు పీఈటీలు తదితరులు పాల్గొన్నారు