శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలోని ఎస్సై జక్కుల పరమేశ్వర్ ఆధ్వర్యంలో బహుజన స్టూడెంట్ యూని యన్ నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం జరి గింది.అనంతరం ఎస్సై పరమేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు పరిష్క రించడంలో విద్యార్థి సంఘాలు పాత్ర అవసరమని అన్నారు. విద్యార్థులను చెడు వ్యస నాలకు బానిస కాకుండా మంచి మార్గంలో తీసుకెళ్లేం దుకు విద్యార్థి సంఘాలు కృషి చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా అడ్వకేట్ నాగుల పవన్ కళ్యాణ్, బి ఎస్ యు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మంద సురేష్, మండల అధ్యక్షులు పెంబర్తి భరత్, పరకాల రాజకుమార్ మండల ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.