మృతుని కుటుంబానికి భీమా డబ్బులు అందజేత.
సంఘం అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో గల
చంద్ర పురుషుల సంఘం సభ్యుడు అజ్మీర సారయ్య ఇటీవల కొమురయ్య అనారోగ్యంతో మృతి చెందాడు.కాగా మృతుని కుటుంబ సభ్యులకు సంఘం అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన దుగ్గొండి పురుషుల సమితి అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ చేతుల మీదుగా బుదవారం పాలకవర్గం సమావేశంలో భీమా డబ్బులను అందజేశారు. సాముహిక నిది పథకం నుండి రూ.70 వేలు,అభయనిధి పథకం నుండి రూ.10 వేలు మొత్తం రూ. 80 వేలు మృతుని భార్య శ్యామలకు అందజేసినట్లు అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు బానోతు రమేష్, పాలకవర్గ సభ్యులు వడ్డేపల్లి మృత్యుంజయుడు, భాషబోయిన రాజు,సలపాల ప్రభాకర్, ఉప్పుల రాజు,మామిడి ఐలయ్య, భాషబోయిన చరణ్ రాజ్,పాక రాజయ్య,బానోతు సాంబయ్య,సయ్యద్ బషీర్, సంఘ ఘణకులు ఏడెల్లి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.