మృతుని కుటుంబసభ్యులకు భీమా డబ్బులు అందజేత

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి:

దుగ్గొండి మండలంలో దేశాయిపల్లి గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర పురుషుల పొదుపు సంఘం సభ్యుడు కోట మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా అతని భార్య నామిని పద్మకు సంఘ అధ్యక్షులు కందికొండ రవీందర్ అధ్యక్షతన దుగ్గొండి సమితి అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ చేతులమీదుగా సామూహిక నిధి పథకం రూ.60 వేలు,అభయనిది పథకం రూ.10 వేలు శుక్రవారం సంఘ కార్యాలయంలో అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తుత్తురు రవీందర్,సంఘ పాలకవర్గ సభ్యులు భూతం లింగమూర్తి,పిండి రఘు, బుట్టి రాజు,బూస రమేష్, కాటబత్తిని ప్రకాష్ తో పాటు ఘణకులు నల్లబెల్లి సుమన్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!