హన్మకొండ, నేటిధాత్రి:
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా నేటిధాత్రి పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ నీ ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నేటిధాత్రి పత్రిక నీ ప్రశంసించారు, నేటిధాత్రి పత్రిక కి మంచి గుర్తింపు ఉందని చాలా వరకు ప్రజల సమస్యల మీద వార్తలు రాస్తూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా నేటిధాత్రి పత్రిక బృందం పోరాడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వంలో పత్రిక విలేకరులకు మంచి గౌరవం ఉంటుందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కాజీపేట ఏసిపి డేవిడ్ రాజ్ సీఐ రాజు ట్రాఫిక్ సీఐ సుజాత మరియు కాంగ్రెస్ జిల్లా నాయకులు నేటిధాత్రి పత్రిక విలేకరులు కుమార్ మరియు మధు పాల్గొన్నారు.