harithahaaraniki mokkalu siddam cheyali, హరితహారానికి మొక్కలు సిద్దం చేయాలి

హరితహారానికి మొక్కలు సిద్దం చేయాలి

హరితహారం కార్యక్రమ సమయానికి మొక్కలను అందించేందుకు సిద్ధంగా ఉంచాలని రాజన్న సిరిసిల్ల పురపాలక సంఘం కమిషనర్‌ డాక్టర్‌ కె.వి.రమణాచారి సూచించారు. శనివారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో సాయినగర్‌లో నిర్వహిస్తున్న నర్సరీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహార కార్యక్రమానికి మొక్కలను సిద్ధంగా ఉంచాలని అన్నారు. అదేవిధంగా సాయినగర్‌లోని వాటర్‌ట్యాంకులను సందర్శించి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ, ప్రజలకు స్వచ్చమైన నీటిని అందించేందుకు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. అనంతరం సినారె ఆధునాతన గ్రంథాలయ పనులను పర్యవేక్షించారు. ఈ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఏజెన్సీలకు సూచిస్తూ నాణ్యతాయుతంగా పనులు కొనసాగేలా చూసుకోవాలని ఇంజనీర్లను ఆదేశించారు. ఈ పర్యవేక్షణలో కార్యాలయ ఆయా విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *