గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు తెలుగు సంవత్సరాది ఉగాది క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు

భద్రాచలం ఆదివాసి గిరిజన మండలాలలోని గిరిజన గ్రామాలలోని ఇతర కార్యాలయాలలో గిరిజనులకు సేవలందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, గిరిజన సంక్షేమ ఆశ్రమ మరియు గిరిజన గురుకులంలో పనిచేయుచున్న హెడ్మాస్టర్లు, మహిళా ఉపాధ్యాయులు, మరియు ఉపాధ్యాయులకు, 

భద్రాచలం నేటి ధాత్రి

తెలుపుతున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఉగాది పండుగ అందరి జీవితాల్లో వెలుగు నింపాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, సుఖశాంతులు కలగాలని, ఉగాది రోజు షడ్ రుచులచే మిలితం చేసిన ఉగాది పచ్చడిని అందరూ సేవించి, ఎటువంటి వ్యాధులు దరి చేరకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని, ముఖ్యంగా గిరిజన విద్యార్థిని, విద్యార్థులు మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకొని, గురువుల పట్ల భక్తి భావంతో ఉండి చక్కగా చదువుకొని మీ యొక్క తల్లిదండ్రుల నమ్మకాన్ని వామ్మో చేయకుండా పదవ తరగతి లో మంచి మార్కులతో పాస్ అవ్వాలని దీవిస్తూ మరి ఒకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు.
అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయము భద్రాచలం నుండి జారీ చేయడమైనది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *