ఘనంగా సన్నబియ్యం పంపిణి కార్యక్రమం
గంగారం, నేటిధాత్రి :
తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్ షాప్ లో సన్న బియ్యం పథకం కొత్తగూడ గంగారం మండలాల్లో ఘనంగా ప్రారంభం చేశారు.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రేషన్ షాపులో సన్నబియ్యం ఇస్తామన్న హామీని నెరవేర్చిందని.. సన్న చిన్న కారు నిరుపేదలు ప్రతి ఒక్కరూ ఈరోజు నుంచి సన్న బియ్యం తింటారని రేషన్ షాప్ లో సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి ధనసరి సీతక్క కి రెండు మండలాల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు….
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతారు తెరుచుకొని డీలర్ షాపులు
గంగారం మండలంలోని మర్రిగూడ గ్రామ పంచాయతీలోని రేషన్ డీలర్ షాపు మంగళవారం రోజు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపు సన్న బియ్యం ఏప్రిల్ ఒకటవ తారీకున ఇవ్వాలని స్పష్టమైన హామీలు ఉన్నప్పటికీ మండలంలో అన్ని గ్రామాలు రేషన్ షాపులో సన్న బియ్యం వచ్చినప్పటికీ.. మర్రిగూడెం అంధువుల గూడెం మరికొన్ని గ్రామాల్లో రేషన్ షాపులు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించలేదు దీంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు నిరుత్సాహపడ్డారు…