మాట వినలేదు మన్నించండి!

మళ్లీ గెలిపించుకుంటాం పాలించండి!!

`కేసీఆర్‌ చల్లని పాలన మళ్ల తెచ్చుకుంటాం.

`ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిపించుకుంటాం.

`ప్రతి పల్లెలో జనం అంటున్న మాట.

`పల్లె పెడుతున్న కన్నీరుకు బీఆర్‌ఎస్‌ బాసట.

`అందుకే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ

`కేసీఆర్‌ కోసం తెలంగాణ ప్రజలు వేయి

కళ్లతో ఎదురు చూస్తున్నారంటున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన పల్లె కన్నీటి గాథలు..ఆయన మాటల్లోనే…

`అరవై ఏళ్ల గోసను ఏడాదిలో తెచ్చారు!

`లేని కరువు తెచ్చి రైతును గోసపెడుతున్నారు

`తెలంగాణను చిన్నాభిన్నం చేస్తున్నారు

`అన్నపూర్ణ ను ఆగం చేస్తున్నారు

`తెలంగాణ జీవితాలను అడివడివి చేస్తున్నారు

`తాగుదామనుకుంటే నీటి చుక్క లేకుండా చేస్తున్నారు

`చెరువులన్నీ ఎండబెడుతున్నారు

`పదేళ్లలో పల్లె పండుగ, సంపద నిండుగ చూసింది

`ఏడాదిలోనే కాంగ్రెస్‌ వచ్చి తెలంగాణను ఎడారి చేస్తోంది

`బతకలేక పోయే రోజుల దాపురిస్తున్నాయి

`అధికారం తప్ప ప్రజా సమస్యలు గాలికొదిలేశారు

`పద్నాలుగేళ్లు కొట్లాడి కేసీఆర్‌ తెలంగాణ తెచ్చాడు

`ఆరు నెలల్లో కరంటు కష్టాలు తీర్చాడు

`ఆరు నెలల్లోనే చెరువులన్నీ నింపి కరువును దూరం చేశాడు

`మూడేళ్లలో 46 వేల చెరువులు బాగు చేయించాడు

`ఇంటింటికీ మంచి నీళ్లిచ్చాడు

`పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఇచ్చాడు

`సాగువాటు సమయానికి సొమ్ము అందించారు

`రైతులను అప్పుల ఊబి నుంచి రక్షించాడు

`పదేళ్లలో కొత్త బోర్లు అవసరం లేకుండా చెశాడు

`ఇరవై నాలుగు గంటల ఉచిత కరంటు ఇచ్చి రైతులను ఆదుకున్నాడు

`మూడేళ్లలో కాళేశ్వరం కట్టి తెలంగాణను నీటి గోస లేకుండా చేశాడు

`మా సారును ఓడిరచి, మా వేలుతో మా కన్ను పొడుచుకున్నాం

`కాంగ్రెస్‌ ను నమ్మి కష్టాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నాము

`మళ్ల యాభై ఏళ్ళయినా కాంగ్రెస్‌ మొఖం చూడము

`బీఆర్‌ఎస్‌ ను మా గుండెల్లో పెట్టుకుంటాము

`పేదల ఆకలి తీర్చిన సారు రుణం తీర్చుకుంటాము

`రైతును రాజును చేసిన కేసీఆర్‌ పాలన మళ్ల తెచ్చుకుంటాము

`తెలంగాణలో ఏ పల్లెలో విన్నా ఇవే మాటలు

`ఏ రైతును కదిలించినా ఇవే ముచ్చట్లు

డెబ్బైఐదు సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏడాదిలోనే ప్రజలు తూర్పార పట్టడం ఇదే మొదటిసారి. ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత మూటగట్టున్న ప్రభుత్వం ఇదే. తెలంగాణ సాధకుడు, పాలకుడైన కేసిఆర్‌ ప్రభుత్వాన్ని కాదనుకొని, కాంగ్రెస్‌ మాయ మాటలు నమ్మి మోసపోయామని బాధ పడుతున్నారు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణను పదేళ్లలో ఊహించనంత అభివృద్ది చేసిన కేసిఆర్‌ను ఓడిరచి, ఇబ్బందులు పడుతున్నామని నేరుగానే చెబుతున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ప్రజలు అడుగడుగునా చుక్కలు చూపిస్తున్నారు. ఏడాదిలోనే ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. మా సారు మాకు కావాలి. మళ్ల మా సారేరావాలి. తెలంగాణజాతి పిత కేసిఆర్‌ పాలన కోరుకుంటున్నామంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ను తుక్కుతుక్కుగా ఓడిస్తామంటున్నారు. కేసిఆర్‌ను కాదనుకొని కాంగ్రెస్‌ను గెపించుకున్నందుకు పాపం చట్టుకున్నదంటున్నారు. ఏడాదిలోనే ఎంతో నష్టపోయామని ప్రజలు చెబుతున్నారు. ఈ బాధలు ఇంకా నాలుగేళ్లు భరించడం మా వల్ల కాదని కూడా ప్రజలు అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీని నమ్మి నిండా మునిగామని ప్రజలు చెప్పడంకూడా ఇదే తొలిసారి. ఏడాదిలోనే ఇంత ప్రజా వ్యతిరేకత ఏ ప్రభుత్వం మూట గట్టుకోలేదు. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలన్న ఆలోచన తప్ప, ప్రజలను మోసం చేయొద్దని కాంగ్రెస్‌ అనుకుంటే గెలిచేదే కాదు. కాంగ్రెస్‌ ఇచ్చిన వాగ్ధానాలలోనే మోసం స్పష్టంగా కనిపించింది. కాని ప్రజలను కాంగ్రెస్‌ మాయ చేసి ఓట్లేయించుకున్నది. గెలిచింది. కాని ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేయక, పదవుల కోసం అధికారంలోకి వచ్చామన్న భావనలో వున్నారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు. అందుకే ప్రజలు మా కేసిఆర్‌ మాకు మళ్లీ కావాలని ఊరు, వాడ, పల్లె, పిల్లా, జెల్లా అందరూ కోరుకుంటున్నారంటున్న బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో తెలంగాణ పల్లెలు పడుతున్న గోసలు పూసగుచ్చినట్లు వివరించారు.
ప్రజలు అదికారమిస్తే పాలించాల్సిన కాంగ్రెస్‌ పాలకులు, లంకెబిందెలు వున్నాయోమో అనుకున్నాం..అన్నప్పుడే ప్రజలు అర్ధం చేసుకున్నారు. పైగా కడుపు కట్టుకుంటే చాలు అంటూ చెప్పిన మాటల్లోని పరమార్ధం ప్రజలకు అర్ధమైంది. కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దల మదిలో ఆలోచనలు, చేష్టలు పూర్తిగా తెలిసిపోయాయి. అందుకే ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. పల్లెల్లో రైతులు, హైదరాబాద్‌లో ప్రజలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అరిగోసకు గురి చేస్తోంది. ఎక్కడ చూసినా విధ్వంసమే.. ఏ పనిచేసినా ప్రజలను ఇబ్బందిపెట్టే పనులే చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఒక్కసారి ప్లీజ్‌..ప్లీజ్‌ అంటూ ఏడాదిపాటు ప్రజలను వేడుకుంటూ, కాళ్లా వేళ్లాపడి, కేసిఆర్‌ ప్రభుత్వం మీద లేనిపోని నిందలు, అబద్దాలు చెప్పారు. ఎన్నికల ముందు అలవి కాని హమీలు ఇచ్చారు. పాలన చేతగా ఇప్పుడు చేతులెత్తేస్తున్నారు. ఇటీవల ఓ కాంగ్రెస్‌ నాయకుడు మీడియా సమక్షంలోనే అధికారులతో అప్పుడున్నది ఇదే అదికారులు..ఇప్పుడున్నది అదే అధికారులు..కరంటు రైతులకు నీళ్లెందుకు రావడం లేదని అడిగారంటే కాంగ్రెస్‌ పాలన ఎంత అద్వాహ్నంగా వుందో అర్దం చేసుకోవచ్చు. కాంగ్రెస్‌ పాలకుల చేత గాని తనం ఎంత దైన్యంగా వుందో తెలుసుకోవచ్చు. పాలన చేతగాక అధికారులను అంటే ఏమొస్తుంది. ప్రణాళిక లేకుండా, ప్రజలకు ఎలా మేలు చేయాలన్న ఆలోచన చేయకుండా అవగాహన లేని వాళ్లు పాలిస్తే ప్రజల జీవితాలు గందరగోళంలో పడతాయి. అభివృద్ది కుంటుపడుతుంది. ప్రగతి ఆగిపోతుంది. ప్రజల జీవితాలు అస్తవ్యమస్తమౌతాయి. కాంగ్రెస్‌ను నమ్మినందుకుపల్లె మళ్లీ కన్నీరు పెడుతోంది. గోస పడుతోంది. వలవల ఏడుస్తోంది. రైతు కన్నీరు మున్నీరౌతున్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా పంటలు ఎండిపోతున్నాయి. నీళ్లు లేవు. భూ గర్భ జలాలు పద్నాలుగు మీటర్ల లోతుకు అడుగంటిపోపయాయి. బోర్లలో నీటిచుక్కలేకుండాపోయింది. కేసిఆర్‌ పాలనలో పదేళ్లపాటు ఎల్లబోసిన బావులు కూడా మళ్లీ ఎండిపోయాయి. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రైతులు కొత్తగా బోర్లు వేసుకునే అవకాశం రాలేదు. ఆ అవసరం కూడా రాలేదు. కాని ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా బోరు బండ్లే కనిపిస్తున్నాయి. మళ్లీ రైతులు అప్పులు చేసి బోర్లు వేస్తున్నారు. చుక్క నీరు రాక నష్టపోతున్నారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం బాగు చేసిన చెరువులున్నాయి. వాటిని నింపాలన్న సోయిలేదు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్తగా కట్టించిన అనేక రిజర్వాయర్లుఉన్నాయి. వాటిని నింపడం లేదు. కాళేశ్వరాన్ని ఎండబెట్టారు. నీళ్ల చుక్క కాళేశ్వం నుంచి వాడితే కేసిఆర్‌కు మళ్లీ పేరొస్తుందని, తాము చెప్పిన మాటలు అబద్దాలౌతాయని రైతులకు నీళ్లివ్వడం లేదు. కాళేశ్వరంలో నీళ్లు నిలుపడం లేదు. దాంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలే కాదు, తెలంగాణ మొత్తం ఎండిపోతోంది. ఎడారిగా మారుతోంది. ఈ సారి నాలుగు దొయ్యలు పెట్టుకోవాలన్నా రైతు భయపడుతున్నాడు. ఏడాది క్రితం వరకు పదేళ్ల కాలంలో గుంట జాగ కూడా వదలకుండా ఉన్న భూమినంతా పొలం చేశారు. ఒకప్పుడు ఎందుకూ పనికి రాదన్న భూములను కూడా పొలాలు చేసి పారించారు. రైతులు బంగారు పంటలు పండిరచారు. చెలకలన్నీ పొలాలు చేసి సన్న బియ్యం పండిరచారు. అలా తెలంగాణ మొత్తం కాళేశ్వరం నీటి పారకంతో కోటిన్నర ఎకరాల మాగాణ అయ్యింది.. కాంగ్రెస్‌ రాగానే మళ్లీ ఎడారిగా మారిపోయింది. కాళేశ్వరం నీళ్లు నల్లగొండ జిల్లా కోదాడ చివరి ఆయకట్టు దాకా పారినసంగతి ప్రజలకు తెలుసు. రైతులకు తెలుసు. కాని కాంగ్రెస్‌నాయకులకు మాత్రం కనిపించలేదు. రైతులకు లేని పోని మాటలు చెప్పి మాయ చేశారు. నమ్మితేనే కదా మోసం చేయొచ్చన్నట్లు పాలిస్తున్నారు. ప్రజల సమస్యలు గాలికి వదిలేశరు. ఓవైపు అకాల వర్షాలతో తెలంగాణ అంతటా పంటలు ఆగమౌతున్నాయి. కుప్పలు కొట్టుకుపోతున్నాయి. మామిడి తోటలు రాలిపోతున్నాయి. అసలే అరకొర పంటలు చేతికొస్తుంటే, ఆ మాత్రం కూడా దక్కకుండా పోతుంటే పాలకులు చేష్టలుడిగి చూస్తున్నారు. రైతులను పరామర్శించడం లేదు. ఈ రోజు హెలీకాప్టర్‌ నాకు, రేపు నీకు అనుకుంటూ హెలీకాప్టర్‌తో తిరిగేందుకు కొట్లాటలు పెట్టుకుంటున్నారు. రైతుల గోసను గాలికి వదిలేశారు. ఏడాది వరకు పండగైన సాగు ఇప్పుడు దండుగౌతోంది. రైతు బంధు ఈ ఏడాదిన్నర కాలంలో ఎప్పుడూ సరిగ్గా అందింది లేదు. ఎంత మంది రైతులకు అందిదో, లేదో అర్దం కావడం లేదు. ఏ రైతును అడిగినా నాకు మాత్రం రైతు బంధు రాలేదనే అంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దలు మాత్రం నిత్యం అబద్దాలు చెబుతున్నారు. రైతుబంధు వేస్తున్నామని చెప్పి, మాయ మాటలు ఇంకా చెబుతూనే కాలం వెళ్లదీస్తున్నారు. రైతులను అడుగడుగునా ఆగం చేస్తూనే వున్నారు. దాంతో రైతు బంధు అందక, పంటలు పండక, సాగువాటు చేయాలంటే రైతుకు ధైర్యం చాలడం లేదు. కన్నీటి వ్యవసాయం చేయాల్సిన పరిస్దితి వస్తోందని గొడగొడ ఏడుస్తున్నాడు. ఇటు రైతు బంధు రావడం లేదు. అటు ఎక్కడా అప్పు పుట్టడం లేదు. మళ్లీ కాంగ్రెస్‌ పాత రోజులు తెచ్చిందని రైతులు గొడగొడ ఏడుస్తున్నారు. కేసిఆర్‌ పాలనలో పదేళ్లు పండగ చేసుకుంటే, ఇప్పుడు దండుగౌతుందని ఎక్కెక్కి ఏడుస్తున్నారు. ఇవన్నీ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కనిపించడం లేదు. రైతులకు సాగుకు సరిపడ నీళ్లియ్యాలన్న సోయి ఒక్కరిలో కూడా లేదు. కాంగ్రెస్‌ నాయకుల్లో కూడా ఎంతో మంది రైతులున్నారు. వాళ్లు కూడా తమ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఏడాదిలో ఇలా జరగడానికి పాలక పెద్దలే అని నిందిస్తున్నారు. ప్రజల్లోకి మళ్లీ ఎలా వెళ్లాలని ముఖాలు దాచుకుంటున్నారు. ప్రజలకు ముందుకు వెళ్లలేక ముఖం చాటేస్తున్నారు. రైతులకు ఎదురుపడితే ఎక్కడ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారో అని కళ్లాల దగ్గరికి కూడా వెళ్లలేకపోతున్నారు. కాంగ్రెస్‌ను కోరి తెచ్చుకుంటే కరువు వచ్చిందంటున్నారు. పాపం కాంగ్రెస్‌ పార్టీ అనుకుంటే శాపం చుట్టుకున్నది రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. మళ్లా కాంగ్రెస్‌కు జీవితంలో ఓట్లు వేయమని అంటున్నారు. మరో యాభై ఏళ్లయినా కాంగ్రెస్‌ ముఖం చూడమంటున్నారు. ఇక కలలో కూడా బిఆర్‌ఎస్‌ వదులుకోమంటున్నారు. కేసిఆర్‌ను మళ్ల ముఖ్యమంత్రిని చేసుకుంటామంటున్నారు. బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు స్వచ్చందంగా వచ్చి రైతులోకమంతా కేసిఆర్‌కు మద్దతు ప్రకటిస్తామంటున్నారు. పల్లెల్లో ఇండ్లలో ఎవ్వరం వుండం..అందరం కేసిర్‌ సభకే పోతామంటున్నారు. కేసిఆర్‌ మీద రైతులకు వున్న ప్రేమను చాటుకుంటామంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!