-కాంగ్రెస్కు మళ్ళీ ఉద్యమ రోజుల రుచి చూపిస్తాం.
-ప్రజల పక్షాన మరో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుడతాం.
-కాంగ్రెస్ యాభై ఏళ్లైనా లేవకుండా చూస్తాం.
-కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన చీకటి రోజులను తరిమేస్తాం.
తెలంగాణకు మళ్ళీ కేసిఆర్ నాయకత్వంలో వెలుగులు తెస్తాం అంటున్న ‘‘రైతు రుణ విముక్తి కమిషన్’’ చైర్మన్ నాగుర్ల వెంకన్న నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో బిఆర్ఎస్ రజతోత్సవ సభతో తెలంగాణలో మరో సారు బిఆర్ఎస్ కుంభమేళా ఎలా వుంటుందో చూపిస్తామంటూ చెబుతున్న విషయాలు ఆయన మాటల్లోనే..
-పదేళ్లలో అపర భగీరథుడు కేసిఆర్ పారించిన నీటి పరవళ్లే కాదు, రజతోత్సవ సభలో జన ప్రవాహం కూడా చూపిస్తాం.
-దెబ్బకు తెలంగాణలో కాంగ్రెస్తో కమ్మిన గ్రహణం వీడిపోతుంది.
-కాంగ్రెస్ తెచ్చిన అమావాస్య చీకట్లు తరిమి నిండు పున్నమి లాంటి కేసిఆర్ పాలన మళ్లీ తెస్తాం.
-ప్రజా కంటక కాంగ్రెస్ కు తగిన బుద్ది చెబుతాం.
-ఉద్యమ కాలంలో ద్రోహులను తరిమినట్లు మళ్ళీ తరిమేస్తాం.
-తెలంగాణలో మళ్ళీ బిఆర్ఎస్ పాలన తెస్తాం.
-రజతోత్సవ సభ సాక్షిగా ఉద్యమానికి పునరంకితమౌతాం.
-తెలంగాణ ప్రతి పల్లెల నుంచి లక్షల మంది వస్తారు.
-కాంగ్రెస్, బిజేపి గుండెలు అదిరి, బెదిరిపోతాయి.
-పచ్చగా వున్న తెలంగాణను కాంగ్రెస్ విద్వంసం చేస్తోంది.
-పదేళ్లు కేఆర్ పాలనలో చల్లగా వున్న ప్రజలను కాంగ్రెస్ పీడిస్తోంది.
-పథకాలు అమలు చేయలేక చతికిలపడి తెలంగాణను గోసపెడుతోంది.
-ప్రజల్లో ఆగ్రహం రోజు రోజుకూ పెరిగి కట్టలు తెంచుకునేలా వుంది.
-దేవుడటువంటి కేసిఆర్ పాలనపై విషం చిమ్మి అధికారంలోకి వచ్చి జనానికి నరకం చూపిస్తున్నారు.
-అసమర్థుల చేతుల్లో పాలన పెట్టి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ ప్రజలకు మాయ మాటలు చెప్పి గద్దె మీద కూర్చున్నవారిలో తెలంగాణ వాదులు లేరు. తెలంగాణ కోసం కొట్లాడిన వారు కాదు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు. తెలంగాణ ఉద్యమం ఈ తరం వీరుడు, పట్టు వదలని విక్రమార్కులు, తెలంగాణ కల నిజం చేసిన పోరాట యోధుడు చేసిన కృషిలో భాగస్వామ్యమైన వారు కాదు. అలాంటి వారికి తెలంగాణ ఆత్మ ఎలా తెలుస్తుంది. తెలంగాణ అస్థిత్వం గురించి ఏం తెలుస్తుంది. తెలంగాణ ఆత్మ గైరవం వారిలో ఎలా వుంటుంది. పదవుల కోసం ఆశపడే వారికి తెలంగాణ ప్రజల మీద మమకారమెలా వుంటుంది. అందుకే గత ఎన్నికల్లో ప్రజలకు మాయ మాటలు చెప్పి, లేని పోని సృష్టించి, మసిబూసి మారేడు కాయ చేశారు. అత్తెసరు మెజార్టీతో అదికారంలోకి వచ్చారు. నిజాయితీతో, నిబద్దతతో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ అనుకోలేదు. ఎలాగైనా అధికారంలోకి రావాలనుకున్నారు. 60 ఏళ్లుగా తెలంగాణను ఎలా మోసం చేయొచ్చో తెలిసిన కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం సర్వం అబద్దాలు చెప్పింది. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించింది. ఒక్క ఛాన్స్ ప్లీజ్..ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఊరూరు తిరిగి, మనిషి మనిషిని వేడుకొని సానుభూతితో అధికారంలోకి వచ్చారు. అమాయకమైన తెలంగాణ ప్రజలు నమ్మి కాంగ్రెస్ను గెలిపించారు. అధికారంలోకి వచ్చిన పట్టుమని పది రోజులు కాకముందే ప్రజలను మోసం చేస్తూ వచ్చారు. ఇచ్చిన హమీలు తుంగలో తొక్కారు. ఆరు గ్యారెంటీలలో వున్న పదమూడుకే దిక్కులేదని చెప్పడానికి 420 హమీల రచనలోనే కాంగ్రెస్ అంతరార్ధం చెప్పారు. కాని ప్రజలు ఊహించలేదు. అప్పటికీ తెలంగాణ తెచ్చి, తెలంగాణను కోడి తన పిల్లలను రెక్కల కింద దాచుకున్నంత భద్రంగా రాష్ట్రాన్ని కాపాడుతుంటే కాంగ్రెస్ వచ్చిన గద్దలాగా తన్నుకుపోతుందని చెప్పారు. కొన్ని సార్లు మంచికన్నా, చెడు వినసొంపుగా వుంటుంది. నిజం కన్నా అబద్దమే నమ్మేలా చేస్తుంది. అదే జరిగింది. పాపమని ఎన్నుకున్న పాపానికి ప్రజలను గోస పెడుతున్నారు. అందుకే మళ్లీ బిఆర్ఎస్ తన ఉద్యమ కాలానికి వెళ్లి, కాంగ్రెస్కు మరోసారి బుద్ది చెబితే తప్ప మరో యాభై ఏళ్లు దాని నీడ కనిపించదు. ఉనికి వుండదు. అందుకు బిఆర్ఎస్ శ్రేణులంతా కంకణబద్దులైన వుండాలని కోరుతూ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ రైతు రుణ విముక్తి కమీషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, తెలంగాణకు మళ్లీ కేసిఆర్ నాయత్వంలో వెలుగులు తెస్తామంటూ రజతోత్సవ సభ విశేషాలను పంచుకుంటూ చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే…
పద్నాలుగేళ్ల క్రితం గోస పడుతున్న తెలంగాణను చూసి చలించిన తెలంగాణ పిత కేసిఆర్ జై తెలంగాణ అని నినదించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. తెలంగాణ సమాజ సాక్షిగా నిలదీశారు. ప్రజలను కదలించారు. తెలంగాణ యావత్ సమాజాన్ని దండుగా కదిలించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశంత ఎత్తుగా నిలబెట్టారు. తెలంగాణ సాధించారు. తెచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణచేశారు. గొప్ప తెలంగాణను ఆవిష్కరించారు. ఒకప్పుడు ఒట్టిపోయిన ఆవు వంటి తెలంగాణను మళ్లీ కల్పతరువు చేశారు. తెలంగాణలో కరువును తరిమికొట్టారు. తెలంగాణ రైతుకు కష్టం దరి చేరకుండా కళ్లల్లో పెట్టుకొని చూసుకున్నారు. అన్ని వర్గాల ప్రజలను గుండెల్లో పెట్టుకొని కేసిఆర్ గొప్పగా పాలించారు. పదేళ్లతో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం చేశరు. ఒకప్పుడు ఆకలికేడ్చిన తెలంగాణను అన్న పూర్ణ చేశాడు. తెలంగాణకు నీళ్లివడం అసాధ్యమే కాదు, ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పి సమైక్యపాలకులు తెలంగాణకు తీరని అన్యాయంచేశారు. తెలంగాణ అంతా నీరెలా పారదో చూపిస్తాను..తెలంగాణ అంతా సస్యశ్యామలం చేస్తాను. తెలంగాణలో ఒక్క గుంట కూడా పడావు పడకుండా సాగుయోగ్యం చేస్తానని శఫథం పూనిన కేసిఆర్ కోటిన్నర ఎకరాల మాగాణగా మార్చారు. రైతుల ఇంట్లో పసిడి రాసులు కురిసేలా చేశారు. అంత గొప్పగా తీర్చిదిద్దబడిని తెలంగాణను కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలల్లోనే ప్రజలకు మూచ్చెమటలు పట్టిస్తున్నారు. చెరువులను ఎండబెడుతున్నారు. తెలంగాణలో నీటి జాడలుపోయి, కరువు చాయలు తెచ్చారు. అందుకే కాంగ్రెస్ అంటేనే కరువు..కరువు అంటేనే కాంగ్రెస్ అని ఎప్పుడో పెద్దలు చెప్పారు. అయితే తెలంగాణ విషయంలో ప్రకృతి తెచ్చిన కరువు ఎప్పుడూ లేదు. సమైక్య రాష్ట్రంలోనైనా, ఇప్పుడు తెలంగానలోనైన కాంగ్రెస్ పాలకులు తెచ్చిన కరువు. ప్రజలు చల్లగా వుండడం కాంగ్రెస్కు నచ్చదు. ప్రజలు సంతోషంగా వుండడాన్ని కాంగ్రెస్ చూడలేదు. అందుకే మాయ మాటలు చెప్పింది. ప్రజలను నిండా ముంచింది. ఇక ఈ అరాచం ఇంకా సాగనివ్వము. కాంగ్రెస్ పార్టీని తెచ్చిన చీకట్లను మళ్లీ తరిమేస్తాం..60 ఏళ్లపాటు తెలంగాణను చీకట్లోకి నెట్టి కాంగ్రెస్ పాపం మూటగట్టుకున్నది. తెలంగాణ తెచ్చిన కేసిఆర్ మూడు నెలల్లో తెలంగాణ అంతటా కాంతులు విరజిమ్మేలా చేశారు. తెలంగాణ ప్రగతికి కరంటుతోనే శ్రీకారం చుట్టారు. ఒకప్పుడు ఎప్పుడు కరంటు వస్తుందో..ఎప్పుడుపోతుందో తెలియని కాలం నుంచి, కనురెప్ప పాటు కూడా కరంటు పోని రోజలు కేసిఆర్ తెచ్చారు. ఆ కాంతిని చూసి ఓర్వలేని కాంగ్రెస్ మళ్లీ చీకట్లు తెచ్చింది. కరంటు కష్టాలు తెచ్చిపెట్టింది. రైతులను గోస పెడుతోంది. సామాన్య ప్రజల ఉసురుపోసుకుంటోంది. అందుకే ఈ బిఆర్ఎస్ రజతోత్సవ సభలో అపర భగీరధుడు కేసిఆర్ తెలంగాణలో పారించిన నీళ్ల పరవళ్ల లాంటి జన ప్రవాహం చూపిస్తాం..కాంగ్రెస్ గుండెల్లో నిద్రపోతాం. దెబ్బకు తెలంగాణపై కాంగ్రెస్ కమ్మిన దుష్టగ్రహణం వీడిపోతుంది. తెలంగాణ ప్రజలకు వెలుగు పంచే కాలం ముందున్న భరోసా కల్పించినట్లౌవుంది. రజతోత్సవ సభకు పుట్టల నుంచి చీమలు దండుగా వచ్చినట్లు తెలంగాణ పెల్లల నుంచి లక్షలాది మంది వస్తారు. కాంగ్రెస్ గుండెలు దడదడలాడేలా చేస్తారు. తెలంగాణలో బిఆర్ఎస్ కుంభమేలా చూస్తారు. ప్రజా కంటక కాంగ్రెస్ను వచ్చే స్ధానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతాం. ఉద్యమ కాలంలో తెలంగాణ ద్రోహులను తరిమినట్లు, మళ్లీ తెలంగాణకు నష్టం చేస్తున్న వారిని తరిమేస్తాం. తెలంగాణలో మళ్లీ ఇరవై ఐదేళ్ల పాటు సాగే సుస్ధిరమైన బిఆర్ఎస్పాలన తెస్తాం..ప్రజలకు రెట్టించిన ఉత్సాహంతో సేవ చేస్తాం. తెలంగాణను వజ్రపు తెలంగాణ తయారుచేస్తాం. రజతోత్సవ సభ సాక్షిగా తెలంగాణలో బిఆర్ఎస్ నేతృత్వంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుడాతం…తెలంగాణ అభివృద్దికి పునరంకితమౌతాం. కాంగ్రెస్, బిజేపి గుండెలు అదిరిపోయేలా సభను నిర్వహిస్తాం. ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు బిఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్తామా? అని ఎదురుచూస్తున్నారు. ఆ రోజు కోసం నిరీక్షిస్తున్నారు. అయితే ప్రజలు ఎప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోతుందా? అని ఎదురుచూస్తున్నారు. ఆరు గ్యారెంటీలలో ఒకే ఒక్కటి ఉచిత బస్సు పదకం అమలు చేస్తున్నారు. దాంతో ఆర్టీసీ పూర్తిగా దివాళా తీస్తోంది. ఉచిత బస్సు పధకానికి బిఆర్ఎస్ వ్యతిరేకం కాదు. కాని దాని వల్ల నష్టపోయిన వర్గాలకు న్యాయం జరగాలని కోరుతున్నాం. పైగా బస్సుల సంఖ్య పెంచకుండా బస్సులను తగ్గించి నడపడం వల్ల సమస్యలు ఎదురౌతున్నాయి. ఇక మిగతా పథకాలన్నీ మర్చిపోయారు. రైతు భరోసాకు దిక్కులేదు. పంటకు పదిహేను వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. అసలు మా ప్రభుత్వంలో ఇచ్చిన రైతుబంధు పదివేలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలేదు. ఒక్కొ మంత్రి ఒక్కొరకమైన ప్రకటన చేస్తుంటారు. రైతు భరోసాకు ఎప్పుడో మంగళం పాడారు. కాని పదే పదే లేనిపోని ముచ్చట్లు చెబుతున్నారు. ప్రజలను ఇంకా ఎంతో కాలం మాయ మాటలు చెప్పి నమ్మించలేరు. రుణమాఫీ చేశామని చెప్పి మాయ చేశారు. కల్యాణలక్ష్మి పథకంలో లక్షరూపాయలకు తోడు తులం బంగారం ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఆ పధకం అమలు చేసింది లేదు. అమలు చేస్తారన్న నమ్మకం వారికేలేదు. ప్రజలకు కూడా లేదు. ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బిఆర్ఎస్ సునామీలో కాంగ్రెస్కు ఒక్కసీటు కూడా రాదు. అంతగా ప్రజా వ్యతిరేకత పెరిగింది. బిఆర్ఎస్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. అదే తరుణంలో వచ్చిన రజతోత్సవాలు తెలంగాణలో బిఆర్ఎస్ మరోసారి ఎదురులేని, తిరుగులేని శక్తిగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు.