ఉమ్మడి పౌరచట్టంతో అందరికీ సమన్యాయం

`ఓటు బ్యాంకు రాజకీయాల్లో చిక్కుకున్న చట్టం

`రెండు రాష్ట్రాల్లో యూసీసీ అమలు

`యూసీసీ అమలయితే మహిళలకు న్యాయం

`పురుషాధిక్య సమాజం చెరలో యూసీసీ చట్టం

`ఓట్లకోసం వ్యతిరేకిస్తున్న విపక్షాలు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

దేశంలోని పౌరులందరికి మతంతో సంబంధం లేకుండా ఉమ్మడి పౌరచట్టం తీసుకు రావాలన్న ప్రస్తుత ఎన్‌.డి.ఎ. ప్రభుత్వ యత్నాలు ఇప్పటివరకు సఫలీకృతం కాలేదు. ఇందుకు విభిన్న కారణాలున్నాయి. ప్రస్తుతం ఎన్‌డీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న భారతీయ జనతాపార్టీ 1998 మరియు 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొంది. 2019లో నవంబర్‌లో నారాయణ్‌ లాల్‌ పంచారియా అనే సభ్యుడు ప్రైవేటు బిల్లుకింద దీన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు విపక్ష సభ్యులనుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో, ఇందులో కొన్ని సవరణలకోసం బిల్లును ఉపసం హరించక తప్పలేదు. 2020 మార్చిలో కిరోడి లాల్‌ మీనా రెండోసారి ఈ బిల్లును తీసుకు వచ్చినా, పార్లమెంట్‌లో ప్రవేశపెట్టలేదు. ఇదేసమయంలో ఉమ్మడి పౌర చట్టం (యూసీసీ)కి ఒక ఉన్నతస్థాయి కమిటీని లేదా జ్యుడిషియల్‌ కమిషన్‌ను నియమించి, మూడు నెలల్లోగా ముసాయిదారూపొందించేలా, కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని ఢల్లీి హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. 2021ఏప్రిల్‌లో ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టుకు బదిలీచేయాలన్న అభ్యర్థన మళ్లీ ఇదే కోర్టులో దాఖ లైంది. అయితే అటువంటి కమిటీ రూపొందించిన ముసాయిదాను వెబ్‌సైట్‌లో వుంచి దీనిపై విస్తృత చర్చ జరిగేందుకు వీలుగా 60రోజుల సమయం ఇచ్చేలా చూడాలని కూడా ఈ పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు. ఇదిలావుండగా 2024 లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా బీజేపీ ఉమ్మడి పౌరసత్వ చట్టాన్ని చేర్చింది. ఈ ఎన్నికల్లో 2/3వ వంతు మెజారిటీ రాకపోవడంతో దీ న్ని అమలు చేయలేకపోయింది. ఇదే సమయంలో విపక్షాలు యూసీసీని అమల్లోకి తేవడానికి ఎంతమాత్రం అంగీకరించడంలేదు. వీటితోపాటు అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా దీన్ని వ్యతిరేకి స్తున్నాయి. ది నాగాలాండ్‌ ట్రాన్ప్‌పరెన్సీ, పబ్లిక్‌ రైట్స్‌ అడ్వకెసీ అండ్‌ డైరెక్ట్‌ యాక్షన్‌ సంస్థ కూడా యూసీసీ అమలును వ్యతిరేకించింది. ముఖ్యంగా స్థానిక గిరిజన తెగల సంప్రదాయాలకు ఇది విఘాతం కలిగిస్తుంది కనుక అమలు చేయకపోవడమే మంచిదని పేర్కొంది. మేఘాలయ కు చెందిన హైన్యూట్రెప్‌ యూత్‌ కౌన్సిల్‌ కూడా ఈ చట్టం అమలు చేయకూడదని లా కమిషన్‌ కు విజ్ఞప్తి చేస్తామని ప్రకటించింది. 

ఎందుకింత వ్యతిరేకత?

ప్రస్తుతం దేశంలో వివిధ వర్గాలకు వేర్వేరు చట్టాలు అమలవుతున్నాయి. వీటిల్లో ఒకదానికొకటి ఎంతమాత్రం సంబంధం లేదు. ఒకవేళ యూసీసీ అమల్లోకి వస్తే హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టం, ఇండియన్‌ క్రిస్టియన్‌ మ్యారేజ్‌ యాక్ట్‌, ఇండియన్‌ డైవోర్స్‌ యాక్ట్‌, పార్సీ మ్యారేజ్‌ అండ్‌ డైవోర్స్‌ యాక్ట్‌లతో పాటు, కేవలం మతగ్రంథాల ఆధారంగా అమలు చేసే షరియా చట్టాలు (ఇస్లామిక్‌ చట్టాలు) రద్దవుతాయి. యుసీసీలో ప్రధానంగా బహుభార్యాత్వం రద్దు, కొడుకు, కుమార్తెకు వంశపారంపర్య ఆస్తులపై సమానహక్కు, లింగవివక్షకు తావులేకుండా, మతంతో సంబంధంలేకుండా ఈ చట్టంలో నిబంధనలను పొందుపరచారు. దాతృత్వం, దైవత్వం, సంరక్షణ, పిల్లల బాధ్యతను పంచుకోవడం వంటి అనేక వర్తమానకాలానికి అనుగుణమైన నిబంధనలను ఈ చట్టంలో చేర్చారు. అయితే దేశంలో 21వ శతాబ్దంలో ఈ చట్టం అత్యంత వివాదాస్పదంగా మారడానికి ప్రధాన కారణం, ‘సెక్యులరిజం’కు సంబంధించినంతవరకు భిన్నాభిప్రా యాలు వ్యక్తం కావడమే. దేశంలోని వివిధ మతాలు, కులాలకు, వర్గాలు అనుసరించే సంప్రదాయాలు, కట్టుబాట్లలోని వైవిధ్యతే ఈ చట్టం అమలుకు ప్రధాన అడ్డంకిగా మారింది. 

సెక్యులర్‌ మరియు రాజ్యం

భారత్‌ ఒక సెక్యులర్‌ దేశం. ఇక్కడ సెక్యులర్‌ అంటే, మతం, రాజ్యం వేర్వేరు అని అర్థం. దేశంలోని అన్ని మతాలు చట్టముందు సమానమేనన్నది మనదేశ ‘సెక్యులరిజం’ నిర్వచనం. కోర్టులుమతాలను అనుసరించి ఆయా పౌరుల కేసులను విచారిస్తున్నాయి. హిందూ మహిళలకు అనువర్తించే చట్టాలు లింగ సమానత్వం మరియు సెక్యులర్‌పరంగా షరియా చట్టం కింద ముస్లిం వ హిళలకంటే ఆధునిక రీతిలో వుండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే మహిళా హక్కుల సంఘాలు ఉమ్మడి పౌరసత్వం చట్టం మహిళల భద్రత, హక్కులపై ఆధారపడి వుండాలని కోరుతున్నా యి. రాజ్యాంగంలోని 44వ అధికరణం దేశ సమైక్యత, సార్వ భౌమత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి వివిధ వర్గాల్లో అమల్లో ఉన్న చట్టాలను తొలగించి, మహిళలకు సమానత్వం కలిగించేవిగా వుండాలని పేర్కొంటున్నది. ఇందుకోసం ముస్లింల వ్యక్తిగత చట్టాల్లో సంస్కరణలు తీసు కొని రావాలని కోరుతున్న మానవహక్కుల సంఘాలు, ఈ 44వ అధికరణాన్ని ఉదాహరణగా చూపుతున్నాయి. అయితే షరియా చట్టాన్ని ఆమోదిస్తున్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. తమనుతాము సెక్యులర్‌గా చెప్పుకునే పార్టీలు, కొన్ని మతవర్గాలు కేవలం తమ ఉనికి కోసం మాత్రమే యూసీసీని వ్యతిరేకిస్తున్నాయి. 

రెండు రాష్ట్రాల్లో ఉమ్మడి పౌర చట్టం

ప్రస్తుతం మనదేశంలో గోవా రాష్ట్రంలో ఉమ్మడి సివిల్‌కోడ్‌ అమల్లో వుంది. ఈ కోడ్‌, పోర్చుగీసుపౌరచట్టాలకు అనుగుణంగా వుండటం గమనార్హం. 2024లో ఉత్తరాఖండ్‌ ఉమ్మడి పౌర చట్టా న్ని ఆమోదించింది. ఆవిధంగా ఉమ్మడి సివిల్‌కోడ్‌ను అమలుచేసే తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ నిలిచింది. మనదేశంలో ప్రస్తుతం గోవా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు ఉమ్మడి పౌరసత్వ చట్టాన్ని అమ లు చేస్తున్నాయి. నిజానికి 2015లోనే సుప్రీకోర్టు ఉమ్మడి పౌర చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం వున్నదని స్పష్టం చేసింది. విచిత్రమేమంటే 2018లో లా కమిషన్‌, ఉమ్మడి పౌర చట్టాన్ని ఇప్పటికప్పుడు అమలు చేయాల్సిన అవసరం లేదని తన 185 పేజీల కన్సల్టెన్సీ పేపర్‌లో స్పష్టంచేసింది. ఇదే సమయంలో దేశంలో కొనసాగుతున్న బహుళత్వాన్ని సెక్యులరిజం నిరాకరించజాలదని కూడా స్పష్టం చేసింది. 

ఏది పురోగమనం…ఏది తిరోగమనం?

ఇక యూసీసీని వ్యతిరేకించేవారు,మతం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని వాదిస్తున్నారు. పురోగతి పేరుతో బీజేపీ ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నదనేదివారి ప్రధాన ఆరోపణ. అయితే సర్వమత సమానత్వం, మహిళలకు సమానహక్కుల కల్పన ఉమ్మడి పౌర చట్టంద్వారా సాధ్యమవుతుందని బీజేపీ వాదిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి పౌరచట్టం కంటే, లింగవివక్షకు సంబంధించిన చట్టాలను సవరిస్తే సరిపోతుందనేది న్యాయనిపుణులు చెబుతున్న మాట. గృహహింస చట్టం`2005 అన్ని వర్గాల మహిళలకు వర్తిస్తుంది కదా అంటూ ఉదాహరణగా చూపుతున్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కృష్ణమురారి ఉమ్మడి పౌర చట్టం అవసరమని అభిప్రాయపడ్డారు. అయితే దీన్ని అమల్లోకి తెచ్చేముందు విస్తృత ప్రాతిపదికన చర్చలు జరగాలని స్పష్టం చేశారు. ఇదిలావుండగా 2024, ఫిబ్రవరి 7న ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ‘‘ యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ ఆఫ్‌ ఉత్తరాఖండ్‌ యాక్ట్‌`2024’’ పేరుతో బిల్లును ఆమోదించింది. ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ థామీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇదొక చారిత్రక ఘట్టంగా పేర్కొన్నారు. అయితే ఈ చట్టం నుంచి గిరిజనులకు మినహాయింపునివ్వడం గమనార్హం.

షాబానో కేసు

నిజానికి హిందూ కోడ్‌ బిల్లు ఆమోదం తర్వాత దేశంలో చట్టాలు రెండు విధాలుగా అమలువు తూ వస్తున్నాయి. మొదటిది భారత పౌరులకు కాగా రెండవది సంస్కరణలకు నోచుకోని ముస్లించట్టాలు. దీని తర్వాత 1985వరకు సెక్యులర్‌ వాదులు, మతపెద్దల మధ్య తరచుగా వచ్చే విభే దాలు, సంఘర్షణలు తగ్గిపోయాయనే చెప్పాలి. 1985లో షాబాను అనే 73ఏళ్ల మహిళ తన భర్త నుంచి భరణం కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 40ఏళ్లు కాపురం చేసిన తర్వాత ఆమె భర్త మహమ్మద్‌ అహ్మద్‌ ఖాన్‌ ఆమెకు మూడుసార్లు తలాఖ్‌ చెప్పి విడాకులివ్వడమే కాదు ఆమెకు భరణం ఇవ్వడానికి నిరాకరించాడు. ముస్లిం షరియా చట్టం ప్రకారం ఇది సమ్మతమేనని స్వయంగా లాయర్‌ ఆయిన ఆయన వాదించారు. 1980లో స్థానిక కోర్టు ఆమెకు భరణం ఇవ్వాలని తీర్పు చెప్పడంతో, ఖాన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు అఖిల భారత నేరన్యాయ చట్టం ప్రకారం మతాలకు అతీతంగా ఆమె భర ణం పొందడానికి అర్హు రాలేనని స్పష్టం చేసింది. అప్పుడే ఉమ్మడి పౌర చట్టాన్ని అమల్లోకి తేవాలని కోర్టు పేర్కొంది. ఇదే క్రిమినల్‌ చట్టం కింద 1979, 1980ల్లో మరో ఇద్దరు ముస్లిం మహిళలు భరణం పొందడం గమనార్హం. 1995లో సరళా ముద్గల్‌ మరియు ఇతరులు వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో కూడా సుప్రీంకోర్టు వ్యక్తిగత చట్టాలను దుర్వినియోగం చేయరాదని తీర్పు చెప్పింది. 2000లో లిల్లీ థామస్‌ కేసులో కూడా కోర్టు ఇదేమాదిరి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 2017లో సైరాబాను వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో తలాక్‌`ఇ`బిద్దత్‌ ఒక నిరంకుశ విధానమంటూ స్పష్టం చేసింది. ఇదిలా వుండగా షాబానో కేసు మాత్రందేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తర్వాత అఖిల భారత ముస్లిం బోర్డు తమ చట్టాలను సమర్థించడమే కాకుండా, ఛాందసవాదులకు మద్దతుగా నిలిచింది. మైనారిటీలపై హిందువుల ఆధిపత్యం కోసమే ప్రభుత్వం ఈవిధంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించింది. అంతేకాదు క్రిమినల్‌ లాను ముస్లిం మత పెద్దలు తమ సాంస్కృతిక గుర్తింపును దెబ్బతీసేదిగా పరిగణించడం మొదలుపెట్టారు. ఉమ్మడి పౌర సత్వ చట్టం తీసుకురావాలని న్యాయవ్యవస్థ కోరుతున్నదంటే కేవలం హిందువుల చట్టాలను అందరిపై రుద్దే ఉద్దేశమేనంటూ వారు ఆరోపించారు. ఇక అప్పటినుంచి ముస్లిం బోర్డు తమ చట్టాలకు స్వేచ్ఛను ఇవ్వాలంటూ ఆందోళన మొదలుపెట్టింది. ఈ సమస్య ను అప్పట్లో మీడియా కూడా అతిగా ఫోకస్‌ చేసింది. 

మడమ తిప్పిన కాంగ్రెస్‌

ఈ నేపథ్యంలోనే పార్లమెంట్‌లో ఒక ముస్లిం స్వతంత్ర సభ్యుడు ముస్లిం చట్టాల పరిరక్షణ బిల్లును ప్రవేశపెట్టగా, కాంగ్రెస్‌ మద్దతు తెలిపింది. అయితే లెఫ్ట్‌ పార్టీలు, ముస్లింలలో ఉదారవాదు లు దీన్ని వ్యతిరేకించారు.తర్వాత 1986లో ‘ముస్లిం ఉమెన్‌ (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ రైట్స్‌ అండ్‌ డైవోర్స్‌)చట్టాన్ని పార్లమెంట్‌ ఆమోదించింది. ఆవిధంగా క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని 125వ సెక్షన్‌ ముస్లిం మహిళలకు కూడా వర్తింపజేశారు. ఆ తర్వాత మనదేశంలో రాజకీయ పార్టీలు రెండుగా చీలిపోయాయి. కాంగ్రెస్‌, ముస్లిం చాందసవాదులు ఒకవైపు, హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు మరోవైపుగా చీలిపోయారు. ముస్లిం మహిళల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా స్త్రీవాద ఉద్యమాలు దెబ్బతినడం ఓ విచిత్ర పరిణామం!

నిరంకుశత్వం లేదా ప్రజాస్వామ్యం ఒక పరిమితి దాటి వుండకూడదు. ప్రస్తుతం మితిమీరిన ప్రజాస్వామ్యం కారణంగా ప్రజాహిత చట్టాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు కాకుండా పోతు న్నాయి. విశాలహితం కోసం ప్రభుత్వం కఠినంగా వ్యవహరించే అవకాశం ప్రజాస్వామ్యం కల్పించాలి. ఉమ్మడి పౌర చట్టానికి ఇన్ని అడ్డంకులు కలిగించడం ద్వారా దేశ జనాభాలో సగం వున్న మహిళలు ఇంకా తీవ్ర వివక్షకు గురికావలసి వస్తోంది. ముఖ్యంగా మతం, సంప్రదాయాల చ ట్రంలో ఇరుక్కుపోయిన వర్గాల మహిళల జీవితాల్లో ఉషోదయ వెలుగులు ఎప్పుడు ప్రసరిస్తా యనేది ప్రశ్నార్థకమే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!