Governor Secretary Congratulates DPRO
డీపీఆర్ఓకు గవర్నర్ ప్రెస్ సెక్రటరీ అభినందనలు
సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి)
రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఏడుకొండలను రాష్ట్ర గవర్నర్ ప్రెస్ సెక్రటరీ మామిండ్ల దశరథం అభినందించారు.మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త బాధ్యతల్లో విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
