అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన.

Indiramma MLA Nayini Indiramma MLA Nayini

అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే,మేయర్

#ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని…

#31 డివిజన్ లో పర్యటించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హన్మకొండ, నేటిధాత్రి :

 

 

 

 

పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి లో భాగంగా నేడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు,నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు,గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి చాహత్ బాజ్ పాయ్ గార్లతో కలిసి 31 వ డివిజన్ హంటర్ రోడ్డులో వాసవి కాలనీ మరియు గాయత్రి కాలనీ లలో రూ.88.73 లక్షలతో నూతన అంతర్గత రోడ్లు నిర్మాణ పనులకు. శంకుస్థాపన చేశారు.తొలుత ఎస్సీ కాలనీలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల చేతుల్లో అభివృద్ధికి నోచుకోని అన్ని ప్రాంతాలను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.గతంలో కూడా ఎన్నికల ముందు,ఎన్నికల తరువాత పర్యటించిన క్రమంలో నా దృష్టికి వచ్చిన అంతర్గత రోడ్లు,సైడ్ డ్రైనేజీ,విద్యుత్తు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అధికార యంత్రాంగం కలిసికట్టుగా ముందుకు వెళ్తుందని అన్నారు.ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులు సకాలంలో పనులను ప్రారంభించుకోవాలని సూచించారు.గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అట్టడుగు వర్గాలకు అండగా ఉండాలని అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజు యాదవ్,డివిజన్ అధ్యక్షుడు సురేందర్,నాయకులు సత్తు రమేష్,కృష్ణ,తాళ్లపల్లి రాజు,బింగి రమేష్ యాదవ్,మామిండ్ల సురేష్ మరియు మునిసిపల్ అధికారులు స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!