ఓటీటీకి.. తెలుగు సీట్ ఎడ్జ్ సూపర్ నేచురల్ థ్రిల్లర్
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందకు చాలా రోజుల తర్వాత ఓ స్ట్రెయిట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ సిద్దమవుతోంది.
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందకు చాలా రోజుల తర్వాత ఓ స్ట్రెయిట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ (Viraatapalem) సిద్దమవుతోంది. మిస్ ఫర్ఫెక్ట్ సిరీస్ ఫేమ్ అభిజ్ఞ వూతలూరు (Abhignya Vuthaluru) లీడ్ రోల్లో, చరణ్ లక్కరాజు (Charan Lakkaraju) ప్రధాన పాత్రలో నటించగా కృష్ణ పోలూరు (Poluru Krishna) దర్శకత్వం వహించారు. గతంలో శ్రీ రామ్, శివబాలాజీలతో రెక్కీ (Recce) అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ను రూపొందించి మంచి విజయం దక్కించుకున్న సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్పై శ్రీరామ్ మలి ప్రయత్నంగా ఈ సిరీస్ను నిర్మించారు.
1980లలో ఓ మారుమూల గ్రామం విరాటపాలెం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఊరికి ఉన్న శాపం వళ్ల అక్కడ ప్రతి వధువు తమ పెళ్లి రోజునే మరణిస్తుంటారు. దీంతో దశాబ్దంగా ఆ ఐర్లో పెళ్లిళ్లు అనేవి లేకుండా పోయి ప్రతి ఒక్కరూ తీవ్ర భయాందోళనలతో జీవిస్తుంటారు. ఈక్రమంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆ గ్రామానికి రావడం, అక్కడి శాపం గురించి తెలుసుకోవడం, ఆ రహస్యాన్ని ఛేదించడం అనే ఉత్కంఠభరితమైన కథనంతో అందరినీ ఆకట్టుకునేలా ఈ సిరీస్ ఉండబోతోంది.
మూఢనమ్మకాలతో కొట్టుమిట్టాడే ప్రాంతంలో భయం అనేది సమాజాన్ని ఎలా నియంత్రించగలదో, ధైర్యం అనేది దశాబ్దాల నిశ్శబ్దాన్ని ఎలా భంగపరచగలదో ఓ శక్తివంతమైన సందేశంతో ఈ సిరీస్ను మలిచారు. ఈ నేపథ్యంలోగ్రామంలో ఉండే రహస్యాలు, దాన్ని ఛేదించేలా ఇంట్రెస్టింగ్గా సాగే ఇన్వెస్టిగేషన్ కథకు అదిరిపోయే సూపర్నేచురల్ థ్రిల్లర్ అంశాలను మేళవించి చూసే ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇవ్వనున్నారు. ఇప్పుడీ సిరీస్ జూన్ 27 నుండి ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండగా త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణ పోలూరు, నిర్మాత శ్రీరామ్, నటి అభిజ్ఞలు మాట్లాడుతూ.. ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ సిరీస్లో ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. ప్రతి వధువు తన పెళ్లి రోజున మరణిస్తుంది. దాంలో అది ఆ విలేజ్లో భయంగా, భయం నిశ్శబ్దంగా మారిపోతుంది. అలాంటి గ్రామంలోని ఆ నిశ్శబ్దాన్ని ఛేదించడమే ఈ సిరీస్ కథ అని అన్నారు. రియల్ లొకేషన్స్, గ్రామీణ వ్యక్తులతో చిత్రీకరించామని, ప్రేక్షకులు ఈ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ (Viraatapalem) సిరీస్ను ఎప్పుడెప్పుడు వీక్షిస్తారా? అని ఆత్రుతతో ఎదురుచూస్తున్నామని అన్నారు.