BJP Leaders Extend Financial Aid
వానాకాల సాగుపై రైతులకు అవగాహన
పరకాల,నేటిధాత్రి
వ్యవసాయ కళాశాల,వరంగల్ జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని మల్లక్కపేట గ్రామంలో శుక్రవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఎన్.కిషోర్ కుమార్ వరిలో కొత్త రకాల సాగు,యూరియా వినియోగం తగ్గింపు,పంట వ్యర్థాలను కాల్చకుండా భూమిలో కలియదున్నడం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ్ కుమార్ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాముఖ్యత,భూసార పరీక్షల అవసరాన్ని వివరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థి చరణ్ రాజ్,వ్యవసాయ విస్తరణ అధికారి,గ్రామ సర్పంచ్,రైతులు పాల్గొన్నారు.
