జూరాల ప్రాజెక్టు పై అసత్య ఆరోపణలు తగవు.

BRS leaders BRS leaders

“జూరాల ప్రాజెక్టు పై అసత్య ఆరోపణలు తగవు’

బీఆర్ఎస్ నాయకుల దొంగ ఏడుపు మానుకోవాలి.

ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ కుట్రలు

ఎమ్మెల్యేలు జి.మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి

 

 

 

 

జూరాల ప్రాజెక్ట్ గురించి పని పాట లేని బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు, రేపే ప్రాజెక్టు కూలిపోతుందాన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ను పార్టీ ప్రతిష్టను దెబ్బ చేసేందుకు, BRS పార్టీకి చెందిన నమస్తే తెలంగాణ పత్రిక తప్పుడు రాతలు రాసిందన్నారు. జూరాల ప్రాజెక్టు నిర్మాణంను కాంగ్రెస్ హయంలో 1981లో ప్రారంభిస్తే.. 1995లో ప్రాజెక్ట్ పూర్తి అయ్యిందన్నారు.
62 గేట్లతో నిర్మించిన ప్రాజెక్టు జూరాల ఇప్పటికీ చెక్కు చెదరలేదన్నారు. బీఆర్ఎస్ నాయకులకు మాట్లాడటానికి సబ్జెక్ట్ లేక, జూరాల గేట్ల అంశాన్ని గోరంతది కొండంత చేసి చూపిస్తున్నారన్నారు.
పని పాటా లేకుండా ఖాళీ తిరుగుతున్న కేటీఆర్ వాస్తవాలకు సంబంధం లేకుండా, ఏదీ దొరికితే దాన్ని ట్విట్టర్ లో పెట్టి శునకానందం పొందుతున్నారన్నారు.
జూరాల పైన మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. జూరాల ప్రాజెక్టు గేట్లు తుప్పు పట్టినట్లు 2019లో బయటపడ్డ, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.
2021లో గేట్ల నుంచి పెద్ద ఎత్తున నీళ్లు లీక్ అయిన అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
గేట్లకు మరమ్మతులు చేపట్టాలని అధికారులు 2018లో రూ.19 కోట్ల అంచనాలతో అధికారులు నివేదికను ప్రభుత్వానికి పంపించారు, అయిన అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు.
అధికారుల నుంచి ఒత్తిడి తీవ్రంగా పెరగడంతో 2022లో రూ.11 కోట్లతో టెండర్లు అప్పటి ప్రభుత్వం పిలిచి, చేతులు దులుపుకుందన్నారు.
గత రెండేళ్ల నుంచి కృష్ణా ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయి. ఇప్పటికిప్పుడు జూరాల గేట్ల కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, 10 లక్షల క్యూసెక్ ల వరద నీరు వచ్చినా గేట్ల కు ఏమీ కాదని ఇంజనీర్లు తెలియజేశారు. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలన్నారు.
ప్రస్తుతం ప్రాజెక్ట్ కు లక్ష క్యూసెక్ ల వరద మాత్రమే వస్తోంది.. జూరాల పైన బీఆర్ఎస్ నాయకులు దొంగ ఏడుపులు ఆపాలన్నారు. 10 ఏళ్ల పాటు జూరాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు దొంగ ఏడ్పులు ఏడుస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు దావత్ చేసుకోవడానికి వెళ్లి, జూరాల వద్ద షో చేశారు. ప్రాజెక్ట్ వద్ద అసలు మోటర్లే బిగించలేదు, పైగా కరెంటు బిల్లు వస్తుందన్న కారణంతో కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లు ప్రారంభించడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించడం  తగదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!