ఎన్నికల ప్రచారంలో Z స్పీడుతో దూసుకెళ్తున్న బూర

భువనగిరి పార్లమెంట్ అభివృద్ధి నా లక్ష్యం: *డాక్టర్ బూర నర్సయ్య గౌడ్*

*పోచంపల్లి పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ*

*నేటిధాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా…*

భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పోచంపల్లి పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత బిజెపి ఎంపీ అభ్యర్థి *డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు*
అనంతరం వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

మోసపోతే గోసపడతాం
అభివృద్ధిని చూసి ఓటెయ్యండి
దొంగ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
రైతులకు డిసెంబర్ 9న 2లక్షల రుణమాఫీ ?
రైతులకు రైతుబంధు 15000 రూపాయలు?
పౌలు రైతులకు రైతుబంధు ?
ఆసరా పింఛన్లు 4000 రూపాయలు ?
18 సంవత్సరాలు నిండుగా మహిళలకు 2500 ?
విద్యార్దులకు స్కూటిలు ?
కల్యాణలక్ష్మి 1 లక్ష రూపాయలు తులం బంగారం?
ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షలు ?
ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నైన నన్ను కమలం పువ్వు గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు *పాశం భాస్కర్ గారు* రాష్ట్ర నాయకులు *గూడూరు నారాయణ రెడ్డి గారు* బిజెపి జిల్లా మరియు మండల గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *