గొల్లపల్లినేటిదాత్రి :
గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన తిప్పర్తి సత్య చారి కాల్వ శ్రీరాంపూర్ వేద పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పని చేస్తూ ఎంతోమంది వేద విద్యార్థులకు స్మార్తం, జ్యోతిష్యం నేర్పిస్తూ ఎంతో కృషి చేసినందుకు వారి సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలుగు సంస్కృతి సాహితి సేవా ట్రస్ట్ వారు ప్రధానం చేసిన వేద విద్య సామ్రాట్ బిరుదు పొందిన సందర్భంగా వారిని గ్రామ కాంగ్రెస్ నాయకులు శాలువాతో ఘనంగా సత్కరించారు. వారు మాట్లాడుతూ వేద విద్యార్థులకు విద్యను బోధిస్తూ పురోహిత రంగంలో రాష్ట్రస్థాయిలో ఎదిగి ఈ అవార్డు అందుకోవడం మాకు మా Previously గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగేమ్ తిరుపతి, రమేష్,వెంకటేష్,రాజు,రాకేష్,శివ తదితరులు పాల్గొన్నారు.