పౌష్టికాహారంతోనే సంపూర్ణమైన ఆరోగ్యం

అంగన్వాడీ సెక్టార్ సూపర్వైజర్ మాధవి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
పౌష్టికాహారంతోనే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించి, ఇంటింటా వెలుగులు నింపాలని అంగన్వాడీ సెక్టార్ సూపర్వైజర్ మాధవి అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని మెట్టుపల్లి గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి మాధవి గర్భిణీ స్త్రీలు, బాలింతలనుద్దేశించి మాట్లాడారు. నేటి కిషోర్ బాలికలే..రేపటి శక్తివంతమైన మహిళలుగా ఉండాలంటే..వాళ్లు రక్తహీనతకు గురికాకుండా సరైన పోషకాహారాలు..ఆకుకూరలు, పండ్లు, గుడ్లు ఎక్కువగా తీసుకోవాలన్నారు. గర్భిణీ స్త్రీలు కూడా సంపూర్ణ పోషకాహారం తీసుకోవాలని, అంగన్వాడీ కేంద్రంలో ప్రతిరోజు ఒక పూట భోజనం, అన్నం, పాలు, గుడ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తుందని వివరించారు. అలాగే పుట్టిన బిడ్డకు తల్లి ఇచ్చే ముర్రుపాలు అమృతంతో సమానమన్నారు. బాలింతలు పిల్లలను ఆరోగ్యవంతంగా పెంచుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం, అంగన్వాడీ టీచర్స్, తల్లులు, ఆయాలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!