సీఎం సహాయక నిధి..పేదలకు వరం’
కల్వకుర్తి/నేటి ధాత్రి:
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో కల్వకుర్తి పట్టణానికి చెందిన 27 మంది లబ్దిదారులకు రూ. 9లక్షల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను మంగళవారం కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీమ్ముల శ్రీకాంత్ రెడ్డి లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాల శ్రీనివాస్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ లు గోరటి శ్రీనివాసులు, చిన్న, హన్మనాయక్, రవి,చిత్తరి శ్రీను, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి,రేష్మ, నాయకులు పుస్తకాల రాహుల్, మిరియాల దామోదర్ రెడ్డి,పాండు రంగా రెడ్డి, శంకర్ నాయక్,కేశవులు, ప్రవీణ్,విక్కీ భాయ్, పడకంటి వెంకటేష్, దున్న సురేష్, శ్రీశైలం,పరశురాం శివ,లబ్ది దారులు తదితరులు పాల్గొన్నారు.