
పాలకుర్తి నేటిధాత్రి
పాలకుర్తి మండల కేంద్రం లోని రాజీవ్ చౌరస్తాలో హైద్రాబాద్ లోని ట్యాoక్ బండ్ పై వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పిన సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ వారసులు, రజక సంఘం నాయకులు. ఈ సందర్బంగా తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదునూరి మదార్ మాట్లాడుతూ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం, పోరాడిన వీరనారి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండి పై ఏర్పాటు చేస్తామని తెలిపినా ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డికి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు జలగం కుమార్, ఐలమ్మ మనుమడు చిట్యాల రామచంద్రం, మండల అద్యక్షుడు చిట్యాల సమ్మయ్య, జిల్లా నాయకులు లొంక ఐలయ్య, మండల ఉపాధ్యక్షుడు గుమ్మడి రాజు, పాపయ్య, చిట్యాల శ్వేత, సంపత్, చిట్యాల ఎల్లయ్య, జ్యోతి, కొమురయ్య, చిలూరి సోమరాజు, చేలూరి అంజయ్య, చిట్యాల సాంబరాజు, గుమ్మడి రాజ, కొమురయ్య, మచ్చ సోమయ్య, గుడి కందుల రవి, తదితరులు పాల్గొన్నారు.