సన్న బియ్యం పంపిణీ.

సన్న బియ్యం పంపిణీ. 

నిజాంపేట, నేటి ధాత్రి

 

మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు ఆధ్వర్యంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని, ఈపథకం ద్వారా రైతుల కష్టానికి గౌరవాన్ని కల్పించడంతో పాటు, పేద ప్రజలకు పోషకాహారాన్ని అందించడమే ఈపథకం యొక్క ఉద్దేశమన్నారు. ఈ పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మా గౌడ్ ,రహీం, రజిని, పోచవ్వ, బాలవ్వ తదితరులు పాల్గొన్నారు

రేషన్ దుకాణాలకు సన్న బియ్యం పంపిణ చెయాలి. 

రేషన్ దుకాణాలకు సన్న బియ్యం పంపిణ చెయాలి. 

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి .

వనపర్తి నేటిదాత్రి :

 

శుక్రవారం, హైదరాబాద్ సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్న బియ్యం సరఫరాపై తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు దొడ్డు బియ్యం తినడం ఆపేశారని, దీన్ని గమనించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న సోనామసూరీ బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేసే కార్యక్రమం చేపట్టామన్నారు. సన్న బియ్యం సరఫరా పంపిణీ విజయవంతం అవుతుందని, 84 శాతం జనాభా ఆహార భద్రతకు సుస్థిరత ఏర్పడిందన్నారు.
రేషన్ దుకాణాలకు సన్న బియ్యం సరఫరా రవాణాను వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. రవాణా కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి, సన్న బియ్యం రవాణాపై కలెక్టర్ లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు,కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులు నిరు పేదలతో కలిసి ప్రభుత్వం సరఫరా చేస్తోన్న సన్న బియ్యంతో భోజనం చేయాలని మంత్రి సూచించారు అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా ప్రారంభించామని, దీనికి కృషి చేసిన అధికారులకు,సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సన్న బియ్యం పంపిణీ కారణంగా రేషన్ దుకాణాల వద్ద ఒకేసారి డిమాండ్ పెరిగిపోతున్నందున బియ్యం రవాణాను వేగవంతం చేయాలని, రేషన్ దుకాణాల వద్ద అవసరమైన మేర బియ్యం అందుబాటులో ఉండాలని సూచించారు. సంచుల కొరత ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకు రావాలని, సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
సన్న బియ్యం పంపిణీపై ప్రభుత్వ చిత్తశుద్ధి చాటేలా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.నూతన ఆహార భద్రత కార్డుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు .కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాలకు వేగంగా సన్న బియ్యం పంపిణీ చేయాలని సూచించారు. సన్న బియ్యం రవాణాను, నూతన ఆహార భద్రత కార్డుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలన్నా. రు సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల డిఎం జగన్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.

సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం.!

సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం. చౌకగా ప్రభుత్వ సన్నబియ్యం పేదలకు పంపిణి

ఎస్సి సేల్ మండల అధ్యక్షులు ఓనపాకల ప్రసాద్

మొగులపల్లి ఏప్రిల్ 4 నేటి ధాత్రి

మండలంలోని ములకలపల్లి గ్రామంలోని చౌక ధరల దుకాణంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాలతో. కాంగ్రెస్ పార్టీ మొగులపల్లి మండల కమిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఓనపాకల ప్రసాద్. రేషన్ షాపులో అర్హులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. చౌక ధరల దుకాణం నుండి చౌకగా పేదల ఇండ్లకు చేరిన సంపన్నుల సన్నబియ్యమని ఓనపాకాల ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో. చౌక ధరల దుకాణం ద్వారా నాసిరకం దొడ్డు బియ్యం సరఫరా జరిగేదని ఆ బియ్యాన్ని ప్రజలు ఎవరు కూడా తినేవారు కాదని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల ద్వారా సన్న వడ్లను కొనుగోలు చేసి క్వింటాకు 500 బోనస్ ఇవ్వడంతో పాటు రేషన్ కార్డు దారులు అందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని అన్నారు ముఖ్యమంత్రి అన్న మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రైతుల వద్ద సన్న ధాన్యాన్ని 500 బోనస్ చెల్లించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మర ఆడించి రాష్ట్రంలోని చౌక దరల దుకాణం ద్వారా అర్హులైన వారికి 6 కిలోల చొప్పున1.81.686 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రతినెల ప్రభుత్వం ద్వారా సరఫరా జరగనుందని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి సన్న బియ్యం పంపిణీ చేస్తుందని రేషన్ డీలర్లు పౌరసరఫరాల రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో. సన్న బియ్యం సంక్షేమ పథకాన్ని విజయవంతం చేయాలని అధికారులను వేడుకున్నారు. సన్న బియ్యం పంపిణిలో డీలర్లతో పాటు ప్రజలు పాల్గొన్నారు.

రేషన్ షాప్ లో సన్నబియ్యం పంపిణి.

రేషన్ షాప్ లో సన్నబియ్యం పంపిణి

గంగారం, నేటిధాత్రి:

 

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పునుగోండ్ల గ్రామం లో డీలర్ ఒక కొత్త ప్రచారం చేస్తున్నాడు రేషన్ షాప్ లో సన్నబియ్యం వచ్చాయని సాయంత్రం సమయంలో గ్రామం లో డప్పు సాటింపు చేపించి మరి బియ్యం పంపిణి చేస్తున్నారు ప్రజలు ఉదయమే రేషన్ షాపు కు వస్తున్నారని రేషన్ కార్డు లబ్ధిదారులందరికి సన్నబియ్యం పంపిణి చేయడం జరుగుతుందని..
అన్నారు,,,,

సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చారిత్రాత్మక నిర్ణయం.

పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చారిత్రాత్మక నిర్ణయం:ఎమ్మెల్యే కడియం
దేశంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం
చిల్పూర్(జనగాం)నేటి ధాత్రి

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఓ చారిత్రాత్మక నిర్ణయం అని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.చిల్పూర్ మండలంలోని శ్రీపతి పెళ్లి, మల్కాపూర్, చిన్న పెండ్యాల గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై రేషన్ కార్డుదారులకు శుక్రవారం సన్న బియ్యం పంపిణీ చేసి కార్యక్రమం ప్రారంభించారు.అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ఈ సందర్భంగా మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని దళారులకు అమ్ముకోవద్దని సూచించారు.రాష్ట్రంలో పెద్దవాళ్లు, పేదవాళ్లు అనే తేడా లేకుండా అందరూ ఒకే రకమైన అన్నం తినాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.

Sanna Rice

 

ఆనాడు 2 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి ఎన్టీ రామారావు ఎలా గుర్తుండిపోయారో ఈ రోజు సన్న బియ్యం పంపిణీ చెస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా అదే స్థాయిలో గుర్తిండిపోతుందని అన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన దొడ్డు బియ్యం అక్రమ మార్గల్లో రాష్ట్రం దాటి, దేశం దాటి పోతున్న నేపథ్యంలో ప్రభుత్వం అందించే బియ్యం పేదల కడుపు నింపాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతీ కుటుంబానికి ఒక్కరికీ 6కిలోల చొప్పున ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసం తెలంగాణ ప్రభుత్వం చేసిందని అన్నారు.సన్న బియ్యం పంపిణీ లో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పంపిణీ జరగాలని ప్రభుత్వం అందించే సన్న బియ్యంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వచ్చే వర్షాకాలంలోపు మల్లన్న గండి లిఫ్ట్ పనులను పూర్తి చేసి చిల్పూర్ మండలానికి సాగునీరు అందించే బాధ్యతనాదని హామీ ఇచ్చారు.నియోజకవర్గ అభివృద్ధిని గత పాలకులు పట్టించుకోలేదని అన్నారు. తాను ఎమ్మెల్యే గా ఎన్నికైన నాటి నుండి ప్రతీ రోజు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నాని వెల్లడించారు.ఎన్నికల సమయం లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కాలువల వెంట తిరుగుతూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ కాలువల నిర్మాణం, పూడికతీత, చెట్ల తొలగింపు వంటి పనులను వేగవంతం చేసి పంటలకు సాగు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. మరో ఏడాది కాలంలో నియోజకవర్గం లోని ప్రతీ ఎకరానికి సాగు నీరు అందించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్దే నా ఏకైక ఎజెండా అని, నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే వరకు విశ్రమించనని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు,నాయకులు,మండల రేషన్ డీలర్లు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల 9వ వార్డు రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణి.

సిరిసిల్ల 9వ వార్డు రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణి

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

సిరిసిల్ల పట్టణం 9వ వార్డు (సర్ధాపూర్, జెగ్గరావుపల్లె) లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి గారు గంభీరావుపేట ప్రశాంత్ గౌడ్ గారు.

 

Ration shop.

బాలకీస్టాయ్య, యాదయ్యా,రాజనర్సు,కనకయ్య,రాములు,ఉపేందర్, షాధుల్, అంజయ్య, తిరుపతి, మోఫిక్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనికి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పారు..

పంటల కోతలు వాయిదా వేసుకోవాలి.

పంటల కోతలు వాయిదా వేసుకోవాలి.

మూడు రోజులపాటు వర్షాలు పడే అవకాశం.

నర్సంపేట ఏ.డీ.ఏ దామోదర్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

Crop harvesting should be postponed.

వాతావరణంలో వచ్చిన మార్పులు నేపథ్యంలో మొక్కజొన్న, ఎండుమిర్చి, ఇతర పంటల కోతల నిర్వహణ పనులను వాయిదా వేసుకోవాలని నర్సంపేట డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు కే. దామోదర్ రెడ్డి రైతులను కోరారు. ఈ సందర్భంగా ఏడిఏ మాట్లాడుతూ అకస్మాత్తుగా వచ్చిన వాతావరణ మార్పుల్లో మూడు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

 

వరంగల్ జిల్లా పరిధి పలు ప్రాంతాలతో పాటు నర్సంపేట డివిజన్ లోని 6 మండలాలకు మూడు రోజులపాటు వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.కోత దశలో ఉన్న మొక్కజొన్న,ఎండుమిర్చి, ఇతర పంటల కోత మరొక రెండు రోజుల పాటు వాయిదా వేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.ఇప్పటికే కోసిన మొక్కజొన్న,ఎండుమిర్చి పంట ఇతర ఉత్పత్తుల పట్ల అప్రమత్తమై ఇళ్లల్లో జాగ్రత్తగా తడవకుండా భద్రపరచుకోవాలని అన్నారు.ఒకవేళ కల్లాలలో ఉన్నచో వాటినిటార్పాలిన్లతో తగువిధంగా భద్రపరచుకొనుటకు పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకోవాలని ఏటియ దామోదర్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు.

సన్న బియ్యం పంపిణిని ప్రారంభం.

సన్న బియ్యం పంపిణిని ప్రారంభం

గంగారం, నేటిదాత్రి:

 

గంగారం మండలం కోమట్ల గూడెం గ్రామంలోని రేషన్ దుకాణంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని, ఈపథకం ద్వారా రైతుల కష్టానికి సన్న వడ్ల కు క్వింటకు 500 రూపాయల బోనస్ కల్పిస్తూ వారికీ గౌరవాన్ని కల్పించడంతో పాటు, పేద ప్రజలకు పోషకాహారాన్ని అందించడమే ఈపథకం యొక్క ఉద్దేశమన్నారు. ఈ పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఈసం రమ, కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు మంకిడి విజయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామప్రజలు,మహిళా లు తదితరులు పాల్గొన్నారు…

సన్న బియ్యం పంపిణిని ప్రారంభించిన AMC చైర్మన్.

సన్న బియ్యం పంపిణిని ప్రారంభించిన ఏఎంసి చైర్మన్

రామడుగు, నేటిదాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని రేషన్ దుకాణంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గోపాల్రావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల తిరుపతి గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఎఏంసి చైర్మన్ మాట్లాడుతూ ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని, ఈపథకం ద్వారా రైతుల కష్టానికి గౌరవాన్ని కల్పించడంతో పాటు, పేద ప్రజలకు పోషకాహారాన్ని అందించడమే ఈపథకం యొక్క ఉద్దేశమన్నారు. ఈ పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ పిండి సత్యం, రేషన్ డీలర్ నార్ల మంగ రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

పేదలకు సన్న బియ్యం పంపిణి.

పేదలకు సన్న బియ్యం పంపిణి

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

Distribution of fine rice to the poor

బిజనేపల్లి మండలం కేంద్రం, మంగనూర్ గ్రామంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నాగర్ కర్నూల్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గురువారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పథకాన్ని లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తీసుకొస్తున్నామన్నారు. అందులో భాగంగా, ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వచ్చింది” అని తెలిపారు. రైతుల కష్టానికి గౌరవాన్ని కల్పించడంతో పాటు, పేద ప్రజలు ఆకలికి గురికాకుండా పోషకాహారాన్ని అందించడమే ఈ పథక ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే అన్నారు. ఈ పథక ఫలాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు..

లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పథకం సజావుగా అమలవ్వాలని, బియ్యం పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అక్రమాలను సహించేది లేదని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ పథకం విజయవంతంగా అమలుకావడానికి ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. ఎమ్మెల్యే గ్రామ ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సన్న బియ్యం పంపిణీ విప్లవాత్మక మార్పు…

సన్న బియ్యం పంపిణీ విప్లవాత్మక మార్పు…

కాంగ్రెస్ నాయకులు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

ప్రభుత్వ చౌకధర దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడం విప్లవాత్మక మార్పు అని కాంగ్రెస్ నాయకులు అన్నారు.గురువారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 7,8,10 చౌకధర దుకాణాలలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం కళ, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, రఘునాథ్ రెడ్డి, అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య లు ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. పేదలు,ధనికులు అనే తేడా లేకుండా అందరూ ఒక్కటేనని భావంతో రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేయడం ప్రజాపాలన ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇస్తున్న అన్ని సరుకుల పంపిణీని బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎత్తివేసి దొడ్డు బియ్యం మాత్రమే పంపిణీ చేసి పేదల పట్ల పక్షపాత వైఖరి ధోరణి అవలంబించిందని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు పొలం సత్యం, పనాసరాజు, మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్, శ్యాం గౌడ్, శ్రీనివాస్ గౌడ్ ,సత్యం, చంద్రయ్య, పుల్లూరి కళ్యాణ్, మహిళా నాయకురాలు పుష్ప తదితరులు పాల్గొన్నారు.

పేదలకు పౌష్టిక ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం.

పేదలకు పౌష్టిక ఆహారం
అందించడమే ప్రభుత్వ లక్ష్యం

నాగర్ కర్నూల్ / నేటి ధాత్రి

 

 

రాష్ట్రంలోని పేద ప్రజలకు సన్న బియ్యం అందుబాటులో ఉండాలి పేదలకు పౌష్టిగా ఆహారం అందాలని వచ్చే నాలుగు సంవత్సరాలు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇది ప్రజా ప్రభుత్వం పేద ప్రజల మేలు కోరే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలకు సన్నబియ్యం పంపిణీ ఈ కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు,18వ వార్డు, 8వ వార్డులలో ఏర్పాటు చేసిన సన్న బియ్యం పంపిణీ పథకం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని పేదలకు సన్నబియ్యం పంపిణీలు చేసిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉగాది కానుకగా సన్న బియ్యం పంపిణీ ప్రారంభించారు శ్రీమంతుల తరహాలో సన్నబియ్యం పేదలకు కూడా అందాలని దేశంలో ఎక్కడా లేని విధంగాతెలంగాణ రాష్ట్రంలో సీఎం సన్న బియ్యం పంపిణి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే విధంగా ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసమే చేస్తుందని అందుకే వారి ఆకలి తీర్చేందుకు ఈ పథకాన్ని తేవడం జరిగింది.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

నిన్న కురిసిన భారీ వర్షానికి దెబ్బతిన్న వరి పంటలు.

నిన్న కురిసిన భారీ వర్షానికి దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన బిజెపి శ్రేణులు
– రైతులను ఆదుకోవాలని ఎమ్మార్వో కు వినతి పత్రం
చందుర్తి, నేటిధాత్రి 

 

heavy rain.

నిన్న కురిసిన భారీ ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి దెబ్బ తిన్న పంటలను బిజెపి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చింతకుంట సాగర్ ఆధ్వర్యంలో పరిశీలించి ఎమ్మార్వో కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నియోజకవర్గ కన్వీనర్ నాయకులు మార్తా సత్తయ్య మాట్లాడుతూ మండలంలో పలు గ్రామాల్లో నిన్న కురిసిన చేతికంది పంట దాదాపు 60% నష్టం వాటిల్లిందని, గత ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ పసల్ బీమా యోజన స్కీం ని ఇక్కడ అమలు చేయకపోవడం బాధాకరమని, ఫసల్ బీమా యోజన ఉంటే నష్టం జరిగిన రైతులకు ఇన్సూరెన్స్ అందేదని, ఇప్పటికైనా ఫసల్ బీమా యోజన అమలు చేయాలని, తక్షణమే ఈ ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని వ్యవసాయ అధికారులను వ్యవసాయ క్షేత్రం లోకి పంపించి పంట నష్టం అంచనా వేసి ఎకరాకు 50,000వేల రూపాయలు నష్టపరిహారం అందించాలని మార్త సత్తయ్య అన్నారు, ఈ పంట నష్టం పర్యవేక్షణలో బిజెపి మండల అధ్యక్షులు మొకిలి విజేందర్, ప్రధాన కార్యదర్శులు పెరుక గంగరాజు, మర్రి మల్లేషం, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మూడపెళ్లి ముఖేష్ , మనోహర్ రెడ్డి , బొరగాయ తిరుపతి , లింగాల రాజన్న, నిరటి శేకర్, హనుమయ్య చారి, చింతకుంట గంగాధర్, సిరికొండ తిరుపతి, మట్కామ్ మల్లేశం, పాటి సుధాకర్, కూతురు మహేందర్ రెడ్డి, అల్లం శేఖర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మేతగా మారిన వరి పంట.

మేతగా మారిన వరి పంట

నిజాంపేట, నేటి ధాత్రి

మెదక్ జిల్లా నిజాంపేట మండలం పరిధిలోని నస్కల్, నందగోకుల్ ,నగరం, చల్మెడ గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటటం తో బోర్లు నీళ్లు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుకాలం పండించిన పంట చేతికి వచ్చే సమయంలో బోర్లలో నీళ్లు రాక పశువులకు మేతగా మారుతున్నాయి. ప్రభుత్వం ద్వారానైన రైతులకు ఆర్థిక సహాయం అందించేలా చూడాలని కోరుతున్నారు

బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత..

బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత

రాష్ట్ర ఓబిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపాలిటీ చైతన్య నగర్ కాలనీలో ఇటీవల అకాల మరణం చెందిన పందుల యాకయ్య కుటుంబాన్ని పరామర్శించి ఒక క్వింటా బియ్యం ఇచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ఓబిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కత్తెరసాల శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్ల రవి బ్లాక్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మాసాడి శ్రీనివాస్ ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర రమేష్ సొస కండ్ల సుభాష్ రెడ్డి పెండ్యాల లక్ష్మణ్ బోళ్ల కట్టయ్య ఉల్లి వెంకటేశ్వర్లు కీర్తి సారయ్య ఎస్.కె. యాకూబ్ బి వెన్ను ఎల్లయ్య తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

ఇఫ్తార్ విందులో పాల్గొన్న టీఎస్ఐడిసి మాజీ చైర్మన్.

ఇఫ్తార్ విందులో పాల్గొన్న టీఎస్ఐడిసి మాజీ చైర్మన్ మహ్మద్ తన్వీర్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కేంద్రంలో ఆలంగిరి జామియా మసీదులో ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని టీఎస్ఐడిసి మాజీ చైర్మన్ మహ్మద్ తన్వీర్ అన్నారు.ఈ మేరకు శుక్రవారం ఝరాసంగం గ్రామ ఆలంగిరి జామియా మసీద్ లో మహమ్మద్ యూనుస్ ఆధ్వర్యంలో ఝరాసంగం లోని మసీదు కార్యాలయంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీఎస్ఐడిసి మాజీ చైర్మన్ మహ్మద్ తన్వీర్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఉండే ముస్లీం సోదరుల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం.

Iftar dinner.

అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో బషీర్ సాబ్ మొహమ్మద్ హమీద్ మొహమ్మద్ ఇస్మాయిల్ షేక్ సజావుద్దీన్ సాదాత్ హుస్సేన్ అబ్రామ్ షకీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇఫ్తార్ విందుకు విచ్చేసిన అతిథులు, గ్రామస్తులు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు.

బెల్లం వలన అసిడిటి పోతుంది.!

బెల్లం వలన అసిడిటి పోతుంది.

జహీరాబాద్. నేటి ధాత్రి:

అసిడిటీ:ప్రతిరోజూ భోజనం తరవాత చిన్న బెల్లం ముక్క నోటిలో వేసుకొని చప్పరిస్తే తిన్న ఆహారం జీర్ణం ఔతుంది, అసిడిటీ పోతుంది.

అల్లం టీ వలన లాభం

అల్లం

ఔషధ గుణాలు ప్రయోజనాలు కలిగి ఉంటుంది. వేసవిలో కడుపు అసౌకర్యం నుంచి, అజీర్ణం నుంచి అల్లం కాపాడుతుంది.అల్లం ప్రేగుల అసౌకర్యం లో బాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది మరియు ప్రాబియాటిక్ గా పని చేస్తుంది.

ginger

గర్భాశ్రయ క్యాన్సర్ నుంచి విముక్తి:

మహిళలలో ఎక్కువగా గర్భాశయ కాన్సర్ అధికంగా వస్తుంది అని అందరికీ తెలిసిన విషయమే.. అలాంటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గర్భాశయ క్యాన్సర్ ను దూరం చేసే శక్తి ఆవాలకు వుంది.ముఖ్యంగా ఆవాలు ఉపయోగించకుండా చేసే వంటలు కూడా చాలా అరుదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆహారం యొక్క రుచిని పెంచడంలోనూ ఆవాలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. కొన్ని దశాబ్దాలుగా నల్ల ఆవాలు ప్రావీణ్యం లో ఉన్న విషయం తెలిసిందే. కానీ గత కొన్ని రోజుల నుంచి పసుపు ఆవాలు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇందులో ఉండే అదనపు పోషకాలు కారణంగా ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్స్, అలాగే బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. పసుపు ఆవాలు ఏ విధంగా గర్భాశయ క్యాన్సర్ ను నిరోధిస్తుంది అనే విషయం కూడా ఒక సారి చదివి తెలుసుకుందాం
ఆవాలలో గ్లూకోసినోలైట్స్ అనే ముఖ్యమైన ఫైటో కెమికల్ ఉంటుంది కాబట్టి ఇది శరీరంలో ఫ్రీరాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ ను నిరోధించడంలో సహాయ పడుతుంది అని అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భం, మూత్రాశయం మరియు ప్రేగులకు సంబంధించిన క్యాన్సర్ల నిరోధించడంలో పసుపు ఆవాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. మీ ఆహారంలో ప్రతిరోజు పసుపు ఆవాల నుంచి తీసిన నూనె లేదా ఆవాల పొడిని చేర్చుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
ఇందులో ఉండే మెగ్నీషియం కారణంగా జీవక్రియ రేటును పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి పసుపు ఆవాలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ఉండడంవల్ల శరీరానికి మంచి శక్తి కూడా లభిస్తుంది. నోటి నుంచి వచ్చే దుర్వాసన నియంత్రించడానికి కూడా ఒక అద్భుతమైన హర్ రెమడీ అని చెప్పవచ్చు. మీ నోటిలోకి పసుపు ఆవాల తో తీసిన నూనె వేసి ఒక నిమిషం పాటు ఉంచి.. బయటకి మూయాలి. ఆ తర్వాత గోరువెచ్చని. నీటితో శుభ్రం చేసుకుంటే నోటి దుర్వాసన కూడా దూరం చేసుకోవచ్చు. ఇక గుండె సంబంధిత రోగాలు, నరం పట్టేయడం, జుట్టు సమస్యలు ఇలా అన్నింటిని దూరం చేయడంలో పసుపు ఆవాలు బాగా పనిచేస్తాయి

గిరిజన మహిళలల సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల.

గిరిజన మహిళలల సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల
ఉత్పత్తులు

రాష్ట్రపతి భవన్ లో స్టాల్స్ ఏర్పాటు

ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ఐఏఎస్

నేటి దాత్రి భద్రాచలం

గిరిజన మహిళలు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల ద్వారా తయారు చేసే వివిధ రకాల సబ్బులు షాంపూలు, మిల్లెట్ బిస్కెట్లు కరక్కాయ పౌడర్ తేనె, న్యూట్రి మిక్స్ ఉత్పత్తులు గిరిజనులకు సంబంధించిన ప్రొడక్ట్స్ ప్రాచుర్యంలోకి తేవడానికి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
బుధవారం నాడు రాష్ట్రపతి భవన్ లో గిరిజన మహిళల ఉత్పత్తులకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేసిన సమాచారం అందిన వెంటనే ఆయన మాట్లాడుతూ ఇండియా సాంస్కృతిక వైవిధ్యం సౌత్ ఆఫ్ ఇండియా నేపథ్యంలో భాగంగా మినిస్టర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ మోటా సహకారంతో గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఆదివాసి గిరిజన మహిళల వివిధ రకాల ఉత్పత్తులు వాటి వలన కలుగు ప్రయోజనాలు,ఇతర రాష్ట్రాల ప్రతినిధులకు మరియు ప్రజలకు తెలియజేసి ప్రాచుర్యంలోకి తేవడం కొరకు ఐటీడీఏ భద్రాచలం నుండి మూడు ఎంఎస్ఎంఈ యూనిట్లకు సంబంధించిన సిబ్బందిని వారు తయారు చేస్తున్న ఉత్పత్తులతో పాటు పంపించడం జరిగిందని అన్నారు. ఈనెల ఆరవ తేదీ నుండి 9వ తేదీ వరకు గిరిజన మహిళలు తయారుచేసిన వివిధ రకాల ఉత్పత్తులు అమ్మకాలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ ప్రోగ్రాంలో మన రాష్ట్రం నుండే కాక ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రం నుండి వచ్చిన వివిధ రకాల యూనిట్ మహిళలు స్టాల్స్ ఏర్పాటు చేసుకొని వారి యొక్క ఉత్పత్తులను అమ్మకాలు జరుపుకుంటున్నారని అన్నారు.
మన ఐటీడీఏ శ్రీ లక్ష్మి గణపతి జాయింట్ లయాబిలిటీ గ్రూప్, భద్రాద్రి శ్రీరామ జె ఎల్ జి గ్రూప్, దమ్మక్క జాయింట్ లయబిలిటీ గ్రూప్ ఎం ఎస్ ఎం ఈ యూనిట్ మహిళలను పంపడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీమతి విజయలక్ష్మి, వెంకటలక్ష్మి, రమాదేవి, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

జాతీయ మిర్చి బోర్డు ఏర్పాటు చేయండి..

జాతీయ మిర్చి బోర్డు ఏర్పాటు చేయండి…

మిర్చి క్వింటాల్ కి రూ” ఇరువై వేలు కనీస మద్దతు ధర ప్రకటించండి…

త్వరలో మిర్చి రైతుల సమస్యలపై గవర్నర్ సీయం మరియు రాష్ట్ర కేంద్ర మంత్రులను కలుస్తా…

*జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి…

మంగపేట:నేటిధాత్రి

దేశవ్యాప్తంగా మిర్చి రైతులను ఆదుకునేందుకు “జాతీయ మిర్చి బోర్డు” ఏర్పాటు చేసి క్వింటాల్ ఎండు మిర్చి రూ” ఇరువై వేలు కనీస మద్దతు ధర నిర్ణయించి నేరుగా రైతుల వద్ద నుండి ప్రభుత్వమే మిర్చి కొనుగోలు చేయాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గడచిన పది రోజులుగా మిర్చి ధర భారీగా పతనం కావడం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో మిర్చి రైతుల సమస్యలు తెలుసుకుని వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు స్పైసెస్ బోర్డు అధికారులతో మాట్లాడానని ప్రస్తుతం మార్చి మాసంలో మిర్చి ధర పెరగవచ్చునని కేంద్ర వాణిజ్య శాఖ అంచనా వేస్తోందన్నారు ఎకరా మిర్చి సాగుకు సుమారు రూ” మూడు లక్షల వరకు పెట్టుబడి వ్యయం అవుతుందని మార్కెట్లో క్వింటాలుకు పధమూడు వేల లోపు మాత్రమే ధర లభించడం వల్ల ఆర్థికంగా అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక చత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో మిర్చిని పెద్ద ఎత్తున సాగు చేస్తున్నందున కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటుచేసిన జాతీయ పసుపు బోర్డు తరహాలో వరంగల్ కేంద్రంగా “జాతీయ మిర్చి బోర్డు” మంజూరు చేయాలని మిర్చి బోర్డు ద్వారా మిర్చి సాగు కి అవసరమైన అనేక రకాల రాయితీ పథకాలను అమలు చేయడంతో పాటు క్వింటాల్ ఎండుమిర్చి రూ” ఇరువై వేలు గా నిర్ణయించి రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా నేరుగా ప్రభుత్వమే మిర్చి బోర్డు నుండి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సాంబశివరెడ్డి కోరారు ప్రస్తుత సీజన్ లో మార్కెట్ పరంగా మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి గవర్నర్ మరియు రాష్ట్ర కేంద్ర మంత్రులను కలిసి వారి దృష్టికి తీసుకు వెళ్తానని సాంబశివరెడ్డి తెలిపారు మిర్చి రైతుల సమస్యలు మార్కెట్ ఒడిదుడుకులపై ఇప్పటికే జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మూడు పర్యాయాలు తన నివేదికను భారత ప్రభుత్వం కామర్స్ మరియు ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖకు అందజేసిన విషయాన్ని సాంబశివరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు

తాటి ముంజలతో ఎన్నో బెనిఫిట్స్.​!

క్యాన్సర్​ నుంచి డీహైడ్రేషన్​ వరకు – తాటి ముంజలతో ఎన్నో బెనిఫిట్స్​!

జహీరాబాద్. నేటి ధాత్రి:

సమ్మర్​ వచ్చిందంటే మామిడి, పుచ్చకాయతో పాటు దొరికే మరో పండు తాటి ముంజలు. ఈ తాటి ముంజల్లో ఉండే పోషకాలు డీహైడ్రేషన్​ నుంచి క్యాన్సర్​ వరకు అన్ని రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో తాటి ముంజలు కూడా ఒకటి. ఇవి చూడటానికి పైన గోధుమ రంగులో, లోపల తెల్లగా ఉండి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత సాఫ్ట్​గా ఉంటాయి. తియ్యగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపలి భాగంలో నీరు ఉంటుంది. ఈ పండునే ‘ఐస్ యాపిల్’ అని కూడా అంటారు. ఎండాకాలం ప్రారంభం కాగానే మార్కెట్లో తాటి ముంజలు దర్శనమిస్తాయి. ఈ తాటి ముంజల్లో ఉండే పోషకాలు.. ఆరోగ్యానికి అదే విధంగా అందానికి కూడా ఎన్నో రకాలుగా మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

PALM

పోషకాలు పుష్కలం:

ఈ పండులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో కాల్షియం, ఫైటోన్యూట్రియెంట్లు, విటమిన్లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, జింక్​, ఫాస్పరస్​​​ అధికంగా లభిస్తాయి. ఎండాకాలంలో మాత్రమే లభించే తాటి ముంజలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక విధాలుగా మేలు చేస్తుంది. మరి దీని ప్రయోజనాలు చూస్తే..

క్యాన్సర్ల నుంచి రక్షణ:

తాటి ముంజలు.. వివిధ రకాల ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే ఫైటోకెమికల్స్, ఆంథోసయనిన్ లాంటి వాటిని నిర్మూలిస్తాయి. అందువల్ల ఈ పండుని ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ల నుంచి కూడా రక్షణ పొందవచ్చు. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచి.. శరీరానికి కావాల్సిన మినరల్స్, న్యూట్రియంట్ల శాతాన్ని బ్యాలన్స్ చేయడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. 2018లో “పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్” జర్నల్​ ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. తాటి ముంజలు తినే వ్యక్తులు కొన్ని రకాల క్యాన్సర్​ బారిన పడే అవకాశం తక్కువగా ఉందని కనుగొన్నారు. ముఖ్యంగా, తాటి ముంజలు తినడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్​, బ్రెస్ట్​ క్యాన్సర్​, ఊపిరితిత్తుల క్యాన్సర్​ రిస్క్​ తగ్గుతుందని కనుగొన్నారు. తాటి ముంజలలోని యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధించడంలో సహాయపడతాయని కనుగొన్నారు.

బరువు తగ్గొచ్చు:

తాటి ముంజల్లో శరీరానికి కావాల్సిన ఎ, బి, సి విటమిన్లు, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం.. వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇందులో కేలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహకరిస్తుందని, జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని ప్రముఖ పోషకాహార నిపుణురాలు డా. అంజలీదేవీ తెలిపారు.

కాలేయ సమస్యలు:

 తాటి ముంజలు కాలేయ సంబంధ సమస్యల్ని కూడా తగ్గిస్తాయి. ఈ పండులో అధిక మొత్తంలో ఉండే పొటాషియం శరీరంలో ఉండే విషపదార్థాలను తొలగిస్తుందని డా. అంజలీదేవీ తెలిపారు .

డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం:

ఎన్ని నీళ్లు తాగినాఎండాకాలంలో డీహైడ్రేట్ అయిపోవడం సర్వసాధారణం. అయితే ముంజల్లో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల వీటిని తింటే ఈ సమస్య నుంచి మనల్ని కాపాడుకోవచ్చని డా. అంజలీదేవీ అంటున్నారు. వేసవిలో శరీరానికి కావాల్సిన ఖనిజాలు, చక్కెరలను ఇవి బ్యాలన్స్ చేస్తాయని.. వీటిలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ బి, ఐరన్, క్యాల్షియం శరీరానికి చాలా అవసరమని ఆమె తెలిపారు.

గర్భిణులకూ మంచిదే:

ప్రెగ్నెన్సీ సమయంలో కొంతమందికి ఏ ఆహారం తిన్నా జీర్ణం కాకపోవడం వంటి సమస్య ఎదురవుతుంది. అలాంటి వారు ముంజల్ని తింటే ఫలితం ఉంటుంది. జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా.. ఈ సమయంలో ఎదురయ్యే మలబద్ధకం, ఎసిడిటీ.. లాంటి ఆరోగ్య సమస్యల్ని కూడా ఈ పండ్లు దూరం చేస్తాయని నిపుణులు అంటున్నారు.

అలసట దూరం:

వేసవిలో కొద్దిసేపు బయటికి వెళ్లొస్తేనే అలసిపోతాం. అంతేకాదు.. విపరీతమైన చెమట కూడా పట్టేస్తుంది. ఫలితంగా శరీరం అధిక మొత్తంలో నీటిని కోల్పోతుంది. ఈ క్రమంలో శరీరం కోల్పోయిన నీటిని తిరిగి అందించి, అలసట నుంచి ఉపశమనం పొందడానికి తాటి ముంజల్ని తినడం ఒక సులువైన మార్గం అంటున్నారు నిపుణులు.

పొట్టు తీయకుండా తినాలి:

ఇకచాలామంది ముంజలను పొట్టు తీసేసి తింటారు. కానీ ఆ పొట్టులోనే ఎన్నో రకాల పోషకాలుంటాయి. అలాగే ఈ పొట్టు వల్లే శరీరానికి ఎక్కువ చలువ చేస్తుంది. కాబట్టి తాటి ముంజల్ని పొట్టు తీయకుండా తింటేనే ఆరోగ్యానికి మంచిది.

అందానికి కూడా:

కొంతమందికి ఎండాకాలంలో వేడికి ముఖంపై చిన్న చిన్న మొటిమల్లా వస్తుంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే ముంజలను తినడం మంచిది.

తాటి ముంజలు వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. ముఖం మెరిసేలా చేస్తుంది. మొటిమలు, మచ్చలు, ముడతలు రాకుండా అడ్డుకుంటుంది.

తాటి పండు జుట్టు పొడిబారకుండా చేస్తుంది. నిర్జీవమైన జుట్టుని రిపేర్ చేస్తుంది. అలాగే జుట్టు చిట్లి పోవడం, తెల్ల జుట్టు, బట్టతల రాకుండా చేయడంలో తాటి ముంజలు గొప్పగా పని చేస్తాయి

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version