రేవంత్‌కు ఎదురులేదు..పొంగులేటికి తిరుగులేదు!

`అధిష్టానం వద్ద ఈ ఇద్దరికే ప్రాధాన్యం

`బిఆర్‌ఎస్‌ ను ఎదరించి నిలిచింది రేవంత్‌ రెడ్డి

`తొడగొట్టి సవాలు చేసి గెలిపించింది పొంగులేటి

`ఆరు నెలల్లో తెలంగాణ రాజకీయ వాతావరణం మార్చింది ఈ ఇద్దరే!

`ఆది నుంచి కేసిఆర్‌ మీద అలుపెరగని పోరాటం చేసింది రేవంత్‌ రెడ్డి

`నమ్మక ద్రోహానికి తగిన బుద్ధి చెప్పింది శ్రీనివాస్‌ రెడ్డి

`ఈ ఇద్దరు ఉత్తర, దక్షిణ దృవాలుగా పార్టీని నిలబెట్టారు

`పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ను గెలిపించి అధికారంలోకి తెచ్చారు

`అందుకే పార్టీ పెద్దలు రేవంత్‌ రెడ్డి నిర్ణయాలకే సై అంటున్నారు

`జీర్ణించుకోలేకపోతున్న కొందరు కీలక సీనియర్లు

`సీనియర్ల చెప్పుకునే గొప్పలన్నీ ఇక్కడే

`అధిష్టానం వద్ద వారి మాటలకు చెల్లు చీటే!

`సీనియర్ల మాటలు బారెడు..చేతలు మూరెడు

`ఇప్పటికే సీనియర్లు పదవులందుకున్నారు

`ఇంకా పెత్తనం కోసం పాకులాడుతున్నారు

`సిఎం. రేవంత్‌ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు

`పార్టీ బలోపేతానికి సీనియర్లు చేస్తున్న ప్రయత్నమేమీ లేదు

`పదవులు అనుభవించుకుంటూనే ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు

`అధిష్టానం వద్ద రేవంత్‌ రెడ్డికున్న ప్రాధాన్యతతో ఖంగుతింటున్నారు

`తమ మాట చెల్లు బాటు కావడం లేదని మధనపడుతున్నారు

`సీనియర్లమంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదు

`పదేళ్ల కాలంలో నాయకులు కాంగ్రెస్‌ ను వీడుతుంటే ఆపింది లేదు

`కారెక్కకుండా ఆపే ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు

`అధిష్టానానికి అబద్దాలు మోయడం మాత్రమే సీనియర్లకు అలవాటు

`పార్టీ కోసం త్యాగం చేయమంటే సీనియర్లు ఒక్కరు కూడా పార్టీలో వుండరు

`మేమే గొప్ప అని చెప్పుకునే వారిలో పార్టీని వీడి వచ్చిన వారున్నారు

`ఇంకా వాళ్లనే నమ్మితే పార్టీని నట్టేట్లో ముంచేస్తారు

`ఇప్పటికీ సీనియర్లకు ఇచ్చిన గుర్తింపే ఎక్కువ

                                  హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కాంగ్రెస్‌ పార్టీలోనేనే సీనియర్‌. నాకంటే సీనియర్‌ ఎవరూ లేరు. పార్టీలో నేనెంత చెబితే అంత. అదిష్టానానికి నేనంటే ప్రేమ. అని చెప్పుకోకపోతే రాజకీయాలు చేయలేరు. అలా ఇంత కాలం రాజకీయం చేసుకుంటూ వచ్చిన సీనియర్లకు ఇప్పుడు మింగుడు పడడం లేదు. వారి రాజకీయం చెల్లడం లేదు. వారికి తెలిసి ఏ పని జరగడం లేదు. అధిష్టానం వారి అభిప్రాయాలు తీసుకోవడం లేదు. వారిని సంప్రదించడం లేదు. గతంలో సీనియర్లు ఎప్పుడూ డిల్లీలో వుండేవారు. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూ వుండేవారు. కాని వారి వల్ల పార్టీకి ఒక్కశాతం కూడా లాభం వుండేది కాదు. అయినా వారికి పదవులు వస్తూ వుండేవి. ప్రాదాన్యత దక్కుతూ వుండేది. కాని ఇప్పుడు సీనియర్ల ఆటలు సాగడం లేదు. అంతో ఇంతో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ కాలంలో కూడా కొంత మంది పదవులు పొందేవారు. అధిష్టానం వద్ద సానుభూతిని పొందుతూ వుండేవారు. కాని తెలంగాణ వచ్చిన తర్వాత సీనియర్ల మాటలు నమ్మడానికి పార్టీ ఇష్టపడడం లేదు. వారి సూచనలు సలహాలు తీసుకోవడానికి సిద్దపడడం లేదు. ముఖ్యంగా రాహుల్‌ గాంధీ పార్టీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీనియర్లను అసలు పరిగణలోకే తీసుకోవడం లేదు. సరిగ్గా గత ఐదు సంవత్సరాలుగా సీనియర్లమని చెప్పుకుంటున్నవారికి అధిష్టానం సమయం కూడా ఇవ్వడం లేదు. డిల్లీకి వెళ్లిపడిగాపులు కాసినా వారి ముఖం కూడా చూడడం లేదు. ఇక రాష్ట్రంలో కాంగ్రస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఆ మాత్రం ఎంట్రీకూడా లేకుండా పోయింది. లేకుంటే ఇప్పటికే ఇల్లు పీకి పందిరేసేవారు. అయినా కొంత మంది సీనియర్లు అవకాశం దొరికితే చాలు ఏదో ఒకటి చెప్పాలని చూస్తున్నారు. కాని వారికి ఆ అవకాశం పార్టీ ఇవ్వడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిచిన వెంటనే లాబీయింగ్‌ చేయని నాయకుడు లేడు. సీనియర్లంతా మాకంటే, మాకే అవకాశమివ్వాలంటూ డిల్లీపెద్దలను కోరుతూ వచ్చారు. కాని పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే ఎంపిక చేసింది. అప్పటి దాకా మూడు రోజులపాటు సీనియర్ల హైడ్రామా నడిపారు. దాంతో వారిని పూర్తిగా ఇప్పుడే పక్కన పెట్టడం వల్ల ఆదిలోనే అపశృతులు వద్దనుకొని అధిష్టానం కొంత మందికి అవకాశమిచ్చింది. నిజానికి ఇప్పుడున్న మంత్రి వర్గంలో కూడా సీనియర్లు మరి కొంత మంది వున్నారు. కాని వాళ్లు ఎప్పుడూ డిల్లీ చెవుల్లో ఏదో చెప్పేందుకు వెళ్లేవారు కాదు. డిల్లీ పెద్దలు రమ్మంటే తప్ప వారి వద్దకు వెళ్లరు. అలాంటి వారితో వచ్చిన ఇబ్బందేమీ లేదు. కాని ఓ ముగ్గురు నలుగురు సీనియర్ల మూలంగానే పార్టీకి ఇంకా తిప్పలుతప్పడం లేదు. సీనియర్లమని చెప్పుకోవడం , పార్టీని వదిలిపెట్టి వెళ్లలేదని చెప్పడం తప్ప పార్టీ కోసం కష్టపడ్డామని చెప్పడానికి వారికి ఒక్క సాక్ష్యం లేదు. కాని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వచ్చిన నాటి నుంచి ఆయన చేసినంత పోరాటం ఎవరూ చేయలేదు. పైగా రేవంత్‌రెడ్డి పోరాటం చేస్తుంటే అడుగడుగునా అడ్డు పుల్లలు పెట్టారు. మాకంటే ముందు వెళ్తున్నాడని ఆయనకు బ్రేకులువేసే ప్రయత్నాలు చేశారు. రేవంత్‌రెడ్డి పిసిసి అయిన నాటి నుంచి ఆయనను ఏదో రకంగా ఇరుకన పెట్టాలని చూశారు. వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తూ మాట్లాడాల్సినన్ని మాటలు మాట్లాడారు. పిపిసి. కొనుక్కున్నారంటూ కూడా విమర్శలు చేసిన సందర్భం వుంది. ఓ సందర్భంలో నేనంటే కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ అంటే నేను అని పార్టీకి పేరు తెచ్చేలా రేవంత్‌రెడ్డి గొప్పగా చెబితే కూడా దాన్ని కూడా జీర్ణించుకోలేకపోయారు. వివాదం చేసి, పార్టీకి చెడ్డపేరు తెస్తున్నాడంటూ విమర్శలు చేశారు. అసలు ఆ మాట చెప్పుకోవడానికి రేవంత్‌ రెడ్డి ఎవరు అంటూ ప్రశ్నించారు. ఏకంగా పిపిసి. అధ్యక్షుడుగా రేవంత్‌ రెడ్డి వున్న సమయంలో మా ఉమ్మడి జిల్లాకు రావాల్సిన అవసరం లేదు అని కూడా కొందరు నాయకులు ప్రకటించిన సందర్భం వుంది. ఇక రేవంత్‌రెడ్డి పిసిసి ప్రెసిడెంటు అయిన తర్వాత ఆయన కింద మేం పనిచేయాలా అంటూ ప్రశ్నించిన వారున్నారు. పార్టీ అదికారంలోకి రాకముందు రేవంత్‌ రెడ్డి మీద సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎంతగా నోరు పారేసుకోవాలో అంత పారేసుకున్నారు. అసలు రేవంత్‌ రెడ్డి పెత్తనమేమిటంటూ ప్రశ్నిస్తూ వుండేవారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకుడంటూ కూడా ఎద్దేవా చేస్తూ వుండేవారు. కాని ఆయన బిఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన కాంగ్రెస్‌లో చేరారు. 2014 ఎన్నికల్లో ఓడిపోగానే బిజేపిలో చేరి మెదక్‌ నుంచి ఎంపిగా పోటీచేశారు. ఓడిపోయి, మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. కాని ఆయన పార్టీన సంగతి మర్చిపోయి, రేవంత్‌ రెడ్డిపై నోరు పారేసుకునేవారు. అయినా అవన్నీ ఏనాడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లెక్కపెట్టుకునేవారు కాదు. ఆయన లక్ష్యం వేరు. ఆయన ఆలోచనలు వేరు. ఇతర నాయకులు ఎంత మంది ఏది మాట్లాడినా ఎక్కడా పార్టీకి చెందిన నాయకుల మీద ఎలాంటి ఆరోపణలు చేసిన దాఖలాలు లేవు. అంతా మన మంచికే అన్నట్లు ఇన్నింటినీ చిరునవ్వుతో స్వాగతించేవారు. అలా పార్టీ కోసం పనిచేస్తూ, మరోవైపు అప్పటి బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మీద నిత్యం పోరాటం చేసిన ఏకైక నాయకుడు రేవంత్‌రెడ్డి మాత్రమే. కాంగ్రెస్‌లో ఇంత పెద్ద నాయకులున్నారు. కాని ఏనాడైనా, ఏ ఒక్క నాడైనా బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మీద పోరాటం చేసింది లేదు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గాని, కోమటి రెడ్డి వెంకటరెడ్డిగాని ఈ పదేళ్ల కాలంలో ఏనాడు జైలుకు వెళ్లలేదు. కనీసం అరెస్టు కాలేదు. ఎలాంటి ఉద్యమం చేపట్టలేదు. ఏ వర్గానికి కొమ్ము కాయలేదు. పోరాటాలకు శ్రీకారం చుట్టలేదు. కాని రేవంత్‌రెడ్డి ప్రతి నిత్యం పోరాటంచేశారు. ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. అలా ఆయన చేపట్టిన ఉద్యమాలకు హజరు కావడానికికూడా ఇష్టపడేవారు కాదు. ఓ సందర్భంలో కేసిఆర్‌ హాయాంలో వరి వేస్తే ఉరి అంటూ అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. దానికి నిరసనగా కేసిఆర్‌ పొలంలో వరి ఎందుకు వేశారంటూ రేవంత్‌ రెడ్డి ధర్నాకు పిలుపునిచ్చారు. ఆ సమయంలో నా జిల్లాలో నాకు తెలియకుండా కేసిఆర్‌ మీద పోరాటం చేయడానికి రేవంత్‌రెడ్డి ఎవరు? అని జగ్గారెడ్డి ప్రశ్నించిన సందర్భం వుంది. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక సమయంలో రేవంత్‌రెడ్డికి ఎదరుపడిన మీడియా అభ్యర్ధి ఎంపిక గురించి ఓ ప్రశ్న అడిగే సమిష్టి నిర్ణయం వుంటుందని చెప్పారు. ఆ మాట చెప్పడానికి రేవంత్‌రెడ్డి ఎవరు? అంటూ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మీడియా ముందు రేవంత్‌రెడ్డి పరవు తీసినంతపనిచేశారు. కాని ఇప్పుడు అందరూ సుద్దులు చెబుతున్నారు. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీద కూడా కావాలని కొంత మంది కుట్ర చేస్తున్నారు. ఆయనపై రకరకాల వివాదాలు సృష్టిస్తున్నారు. ఆయనపై ఆరోపణలు చేసేందుకు కొంత మంది పని గట్టుకొని మాట్లాడుతున్నారు. కాని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి లేకపోతే ఖమ్మం జిల్లాలో పార్టీలోనే కాదు, తెలంగాణలో 27 నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ గెలుపు కష్టమయ్యేది. ఉమ్మడి ఖమ్మంతోపాటు, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ వరకు సుమారు 27 నియోజకవర్గాలను తన కనుసన్నల్లో గెలిపించిన ఘనత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిది. ఆ సంగతి సీనియర్లు మర్చిపోతున్నారు. బిఆర్‌ఎస్‌ను ఖమ్మం నుంచి అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనంటూ శపధం చేసిన ఏకైక కాంగ్రెస్‌ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. అలా ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఖమ్మం మొత్తం సీట్లను గెలిపించుకున్నారు. పొరపాటున బిఆర్‌ఎస్‌నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావ్‌ను కాంగ్రెస్‌లోకి తెచ్చేశారు. అలా సీనియర్‌ నాయకులమని చెప్పుకుంటున్న వాళ్లెవరైనా చేశారు. ఒక్క నాయకుడినైనా బిఆర్‌ఎస్‌ నుంచి తెచ్చారా? బిఆర్‌ఎస్‌ అదికారంలో వున్నంత కాలం ఆ పార్టీకి కోవర్టులు అని ముద్ర వేయించుకున్న వాళ్లే కొందరు సినీయర్లు. వారికి చెందిన వారసులు కూడా ఇప్పుడు బిఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు. అంటే వారికి పార్టీ మీద ఎంత చిత్తశుద్ది వుందో అర్దంచేసుకోవచ్చు. వారి నాయకత్వ పటిమ ఎంత బలంగా వుందో ఈ ఒక్క విషయంతో తెలుసుకోవచ్చు. మంత్రి వర్గ విస్తరణలో కూడా మాకంటే మాకే కావాలంటూ ఆ సీనియర్‌ నాయకులు కోరడం విడ్డూరం. అసలు కాంగ్రెస్‌పార్టీ పని అయిపోయిందని, బిజేపిలో చేరి అక్కడ ప్రాదాన్యత దక్కక తిరిగి కాంగ్రెస్‌లో చేరిన రాజగోపాల్‌రెడ్డి కూడా నేనే మంత్రిని అంటున్నారు. నాకు ఎన్నికల ముందు హమీఇచ్చారనిచెబుతున్నారు. ఇలాంటి వారికి కోసం బిసి. మహిళామంత్రికొండా సురేఖను పక్కన పెట్టేందుకుకూడా కుట్ర చేస్తున్నారన్న వార్తలువస్తున్నాయి. కాని అధిష్టానం అన్నీ గమనిస్తూనే వుంటుంది.పైగా దేశంలో అదికారంలోవున్న మూడు రాష్ట్రాలలో తెలంగాణ అత్యంత కీలకమైంది. అందవల్ల తెలంగాణలో ఏ నాయకుడు ఏమిటో అదిష్టానానికి అంతా తెలుసు. రేవంత్‌ రెడ్డి పార్టీని ఎంతకష్టపడి గెలిపించారో తెలుసు. అందుకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎంత శ్రమించారో పార్టీ పెద్దలందరికీ తెలుసు. ఎందుకంటే అన్నీ వున్న విస్తరి అణిగి మణిగి వుంటుంది. ఏమీ లేని విస్తరులే ఎగిరెగిరి పడుతుంటాయన్న సామెతను మర్చిపోతున్నారు.

బంగ్లపల్లి లో ఉచిత పశువైద్య శిభిరం ఏర్పాటు.

బంగ్లపల్లి లో ఉచిత పశువైద్య శిభిరం ఏర్పాటు………….
చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్
గుమ్మడి శ్రీదేవి…………వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ ……….

మొగుళ్లపల్లి నేటి ధాత్రి

మండలంలోని బంగ్లపల్లి గ్రామంలో, వ్యవసాయమార్కెట్ కమిటీ చిట్యాల ఆధ్వర్యంలో. పశుసంవర్ధక శాఖ సౌజన్యంతో. ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గుమ్మడి శ్రీదేవి పాల్గొని మాట్లాడుతూ.

Chityala Market

మొగుళ్లపల్లి మండలంలోని రైతుసోదరులు తమ పాడి పశువులు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉండేందుకు ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాట్లు చేశామని రైతు సోదరులు తమ పశువులను పశు వైద్య అధికారికి చూపించి డాక్టర్ సలహాలు పాటించి పశువులకు వ్యాధులు సోకకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు.ఆమెవెంట ఏ ఎం సి. వైస్ చైర్మన్ ఎండి రఫీ, డైరెక్టర్లు లింగయ్య, సతీష్ రెడ్డి, మార్కెట్ కమిటీ సెక్రటరీ కనుక .శేఖర్, మండల పశువైద్యాధికారి డాక్టర్.G. రాకేష్ శర్మ, ఎం .వెంకటేష్(జె వి వో), గోపాలమిత్ర శ్రీనివాస్, రాజన్న, అశోక్ , మార్కెట్ కమిటీ సిబ్బంది బొచ్చు రాజు, పడదల దేవేందర్ రావు, అల్లం సమ్మయ్య రైతు సోదరులు పాల్గొనడం జరిగింది.

మైనారిటీల కోసం తోఫా మర్చిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం.

మైనారిటీల కోసం తోఫా మర్చిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం.

• మైనార్టీలకు మోసం కాంగ్రెస్ ప్రభుత్వం..

• టిఆర్ఎస్ యువ నాయకుడు షేక్ సోహెల్…

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం మండల ఝరాసంగం టిఆర్ఎస్ యువ నాయకుడు షేక్ సోహెల్ మాట్లాడుతూ… మైనారిటీల కోసం తోఫా మర్చిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక మైనారిటీకి మంత్రి పదవి లేకపోవడం చాలా బాధాకరం మీకు మైనారిటీల ఓట్లు కావాలి కానీ మైనారిటీల మంత్రి పదవి వద్ద గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ మైనార్టీలకు తోహ ఇచ్చారు. మరియు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఈ ప్రభుత్వానికి మైనారిటీ అవసరం లేదా అని మీ యువ నాయకుడు షేక్ సోహెల్ ప్రశ్నిస్తున్నారు.

మద్యం బెల్ట్ షాపులపై గంజాయి పై దశలవారీగా పోరాటాలు.

మద్యం బెల్ట్ షాపులపై గంజాయి పై దశలవారీగా పోరాటాలు

డివైఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కమిటీ

భూపాలపల్లి నేటిధాత్రి

 

జిల్లా అధ్యక్షుడు భూక్య నవీన్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ డివైఎఫ్ఐ జిల్లా మహాసభలు కొన్ని అనివార్య కారణాలవల్ల మే 25 26 కు వాయిదా వేయడం జరిగిందని దీనిని మేధావులు పెద్దలు మిత్రులు గమనించాలని ఈ మధ్యకాలంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మద్యం బెల్టు షాపులపై గంజాయి నిర్మూలన పై నూతన కార్యచరణకు ఈ జిల్లా కమిటీ శ్రీకారం చుట్టిందని ఇకనుంచి దశలవారీగా జిల్లాలో యావత్ యువకులను బానిసలను చేస్తూ వారి ప్రాణాలను కోల్పోయే విధంగా మనుషుల విలువలను దెబ్బతీసే విధంగా రోజు రోజుకు జిల్లాలో ఏరులై పారుతున్న మద్యం షాపులపై దఫళవారీగా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించిందని ఎన్నోసార్లు అధికారులకు వినతులు స్వయంగా పట్టించిన కూడా జిల్లాలు అధికారులేనట్టుగా నిమ్మకు నీరెత్తినట్లుగా జిల్లా యంత్రాంగం వ్యవహరిస్తుందని, దీనిపైన డివైఎఫ్ఐ అధికారులు సిండికేట్ యాజమాన్యాలు బెల్టు షాపులు కుమ్మక్కయ్యే యువకులను నాశనం చేసేందుకు ధనార్జినేయంగా వాళ్ళ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఈ దంధాలు నడిపిస్తున్నారని స్పష్టమైన అవగాహనకు వచ్చిందని అందుకోసమే ఈ జిల్లాలో యువకులు మద్యం తాగుతూ తద్వారా గంజాయి డ్రగ్స్ కూడా బానిసలు అవుతున్నారని దీనిపై అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూనే పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అంతవరకు డివైఎఫ్ఐ పోరాటాలు ఉంటాయని యువకులకు ఈ జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సిమెంట్ కర్మాగారం గాని, కోల్ శుద్ధి కర్మాగారం, గాని ఉక్కు పరిశ్రమ, గాని ఏర్పాటు చేస్తే ప్రజల్లో ఆర్థిక ఇబ్బందులు ఉండమని యువకులు కూడా గంజాయి డ్రగ్స్ మద్యం నుంచి బయటపడతారని వీలైనంత త్వరగా ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే దీని మీద దృష్టి సారించి జిల్లాలో ఉన్న యువకులందరికి ఉద్యోగ ఉపాది అవకాశాలు కల్పిస్తూనే రోజురోజుకు పెరుగుతున్న మద్యం బెల్ట్ షాపులపై తక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తామని.
అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలు పడుతున్న సమస్యలపై త్వరలోనే సందర్శనలు చేసి సమగ్రమైన సమాచారంతో పోరాటాలు నిర్వహించబోతున్నామని ప్రభుత్వాసుపత్రుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి తెలియజేసేందుకు దశల వారి పోరాటాలు కూడా డివైఎఫ్ఐగా నిర్వహించబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం కవిత, గుడి కందుల దేవేందర్, బందు సుజాత, జిల్లా కమిటీ సభ్యులు, జ్ఞానేశ్వరి బుర్ర స్వాతి, అజ్మీర సరిత, ఎర్ర సుజాత, భాస్కర్లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

దక్షిణాదిపై డీలిమిటేషన్‌ కత్తి!

ఈ ప్రక్రియను మరో 25ఏళ్లు వాయిదా వేయాలంటున్న జేఏసీ

ఉత్తరాది రాష్ట్రాల నిర్లక్ష్యం, దక్షిణాదికి ఇబ్బందికరం

డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలకు దన్నుగా నిలవని ఉత్తరాది పార్టీలు

ప్రాంతీయ ప్రయోజనాలే ఇందుకు కారణం

బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు జట్టుకట్టలేవన్న సత్యం మరోసారి బట్టబయలు

గుంపులో గోవిందయ్య స్థాయికి దిగజారిన కాంగ్రెస్‌

దక్షిణాదికి తానే నాయకుడుగా ఎదగాలని స్టాలిన్‌ తహతహ

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై మార్చి 22న చెన్నైలో జరిగిన సమావేశంలో ఏడు రా ష్ట్రాలనుంచి ప్రజాప్రతినిధులు హాజరుకావడమే కాకుండా, ఈ అంశంపై ఒక జాయింట్‌ యాక్షన్‌ కమిటీని ఏర్పాటు చేయడం తాజా పరిణామం. ఈ జాయింట్‌ యాక్షన్‌ కమిటీలో తమిళనాడు, కేరళ, తెలంగాణ, పంజాబ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు కర్ణాటక, తెలంగాణ, ఒడిషాల నుంచి సీనియర్‌ నాయకులు సభ్యులుగా వున్నారు. తాము నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతి రేకం కాదని, కాకపోతే ఇది, సామాజిక న్యాయం, జనాభా నియంత్రణతో పాటు ఆర్థికాభివృద్ధి సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేవిధంగా వుండకూడదని సమావేశంలో పా ల్గన్న నాయకులు స్పష్టం చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల ప్రకారం తాము నియోజకవర్గాల పునర్విభజనను ఆమోదించలేమని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే పునర్విభజనలో పారదర్శకతల లేదంటూ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.ఆర్‌.సి.పి. అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి కూడా మార్చి 22న ప్రధానికి ఒక లేఖరాస్తూ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో పారదర్శకతను పాటించాలని కోరినప్పటికీ, ఈ సమావేశానికి తమ పార్టీ తరపున ప్రతి నిధిని పంపకపోవడం గమనార్హం. ఇక ఆహ్వానం అందిన పశ్చిమబెంగాల్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా తన ప్రతినిధులను పంపలేదు. ప్రస్తుతం తమ రాష్ట్రంలో ఓటర్ల గుర్తిం పు కార్డుల సమస్య కొనసాగుతున్న నేపథ్యంలో మరో సమస్యలో తలదూరిస్తే తమ రాష్ట్రసమస్య బలహీనపడుతుందని అందువల్లనే మిన్నకుండిపోయామని పార్టీ తెలిపింది. ఒడిషా మాజీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ మాత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశంలో పాల్గనడం గమనార్హం. తమిళనాడు, అంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిషా, వెస్ట్‌ బెంగాల్‌, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ముందున్న సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తన మామూలు ధోరణిలో మాట్లాడుతూ ఈ పునర్విభజన ప్ర క్రియ దక్షిణాది రాష్ట్రాల నెత్తిన కత్తిలా వేలాడుతోందన్నారు. 1976నాటి కేంద్ర ప్రభుత్వ కు టుంబ నియంత్రణ విధానాన్ని చిత్తశుద్ధితో అమలుచేసిన ఈ రాష్ట్రాలను శిక్షించడం తగదని పే ర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఒక్కటైౖ నిలబడాలని కోరారు. ‘జనాభాపరంగా ఈ రాష్ట్రాలను శిక్షించడం అన్యాయ’మన్నది ఆయన వాదన. ఏతావాతా జాయింట్‌ యాక్షన్‌ కమిటీ మాత్రం 1971 జనగణన ప్రకారమే నియోజక వర్గాల సంఖ్యను కొనసాగించాలని, ఈ డీలిమిటేషన్‌ ప్రక్రియను మరో 25 సంవత్సరాల పాటు వాయిదావేయాలని స్పష్టం చేసింది. 

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 2021 జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనను చేప ట్టాలని భావిస్తోంది. అంటే ఇప్పటికే ఇది ఆలస్యమైంది. అందువల్ల 2026లో చేపట్టబోయే జనగణన ప్రకారం ఈ డీలిమిటేషన్‌ ప్రక్రియను చేపట్టాలన్నది కొందరి అభిప్రాయం. ఇందుకోసం మళ్లీ రాజ్యాంగ సవరణ చేపట్టాల్సి వుంటుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టడానికి కేవలం జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు కూ డా వ్యక్తమవుతున్నాయి. జనాభా నియంత్రణ పాటించిన వివిధ రాష్ట్రాలు ఇప్పటికే కేంద్ర ఆర్థిక సంఘం కేటాయింపులు తగ్గిపోయి ఇబ్బందులు పడుతుండగా, ఇప్పుడు డీలిమిటేషన్‌ ‘బాంబు’ వాటిని మరింత ఆందోళనకు గురి చేస్తున్నది.

పరిశీలిస్తే చెన్నైలో జరిగిన ఈ డీలిమిటేషన్‌ వ్యతిరేక సమావేశానికి ఎన్డీఏ యేతర పక్షాల నుంచిపూర్తిస్థాయి మద్దతు లభించలేదన్న అంశం స్పష్టమైంది. ముఖ్యంగా ఫెడరల్‌ యాంటీ`బీజేపీ ఫ్రంట్‌ ఏర్పాటు విషయంలో అభిప్రాయ భేదాలు స్పష్టమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన స మాజ్‌వాదీ పార్టీ, బిహార్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జేడీ), పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్‌ కాంగ్రెస్‌లు గైర్హాజరీకి కారణాలు ఏమి చెప్పినా, డీలిమిటేషన్‌ వల్ల సీట్లు పెరిగి ప్రయోజనం కలుగుతున్నప్పుడు, సీట్లు తగ్గే దక్షిణాదికి మద్దతివ్వడానికి అవి ముందుకు రాలేదన్నదిస్పష్టమైంది. అయితే ఈ పార్టీలు గైర్హాజరైనప్పటికీ, దక్షిణాది రాష్ట్రాల సమావేశం తన అభిప్రా యాలను స్పష్టంగా వెల్లడిరచడంలో విజయం సాధించిందనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ఈ డీలిమిటేషన్‌పై ఇప్పటివకు ఎటువంటి రోడ్‌మ్యాప్‌ ప్రకటించలేదు. కాకపోతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మాత్రం, ఈ డీలిమిటేషన్‌ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి అన్యాయం జరగబోదంటున్నారు. అది ప్రాతిథ్య పరంగానా లేక నైష్పత్తిక ప్రాతినిధ్య పరంగానా అన్న అంశాన్ని ఆయన స్పష్టం చేయలేదు. 

లోక్‌సభలో అన్ని ప్రాంతాలకు సరైన ప్రాతినిధ్యం లభించాలంటే జనాభానే ప్రాతిపదికగా తీసుకోవాలా అన్నది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ఒక పౌరుడు, ఒక ఓటు అనే విధానంలో జనాభానే ప్రాతిపదికగా తీసుకోవాల్సివుంటుంది. కానీ స్వాతంత్య్రం వచ్చిన దగ్గరినుంచి నియోజకవర్గాల ఏర్పాటులో జనాభాను ప్రాతిపదికగా తీసుకున్న దాఖలాలు లేవు. పరిపాలనాపరమైన సౌలభ్యత,దేశంలోని అన్ని ప్రాంతాలకు సరైన ప్రాతినిధ్యం వుండాలన్న ప్రాతిపదికనే అనుసరించినట్టు గతాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ముఖ్యంగా లక్షద్వీప్‌, లద్దాఖ్‌ నియోజకవర్గాలు ఈవిధంగా ఏర్పడినవే. జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే నియోజకవర్గ ఏర్పాటుకు తగినంత జనాభా ఈ ప్రాంతాల్లో లేదు. అందువల్ల భౌగోళిక ప్రాతిపదికన వీటి ఏర్పాటు జరిగింది. ప్రస్తుతం జనాభా ప్రాతి పదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే, దెబ్బతినేవి దక్షిణాది రాష్ట్రాలే. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్‌ ప్రక్రియపై జరుగుతున్న చర్చలు ప్రధానంగా రెండు అంశాలను తెరపైకి తెస్తున్నాయి. మొదటిది ఆర్థికం కాగా రెండవది జనాభా ప్రాతిపదిక. ఈ రెండు అంశాలు దేశ పురోభి వృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఎందుకంటే జనా భా నియంత్రణను పాటించి, ఆర్థికాభివృద్ధి సాధించడమే కాకుండా ఉద్యోగావకాశాల కల్పనలో దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది కంటే ఎంతో ముందంజలో వున్నాయి. ఈ విషయంలో తీవ్ర నిర్ల క్ష్య వైఖరి అనుసరించిన ఉత్తరాది రాష్ట్రాలు పెరిగిన జనాభా భారంతో పాటు, పేదరిక వృద్ధి, కుంటుపడిన ప్రగతి వంటి అనేక అవలక్షణాలతో కునారిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ లేవనెత్తిన అంశాలను కేంద్రం తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి. కేవలం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళితే, ఉత్తర`దక్షిణ ప్రాంతాల మధ్య ప్రాధాన్యతల్లో తేడాలు ఏర్పడతాయి. 

చెన్నైలో జరిగిన సమావేశం ప్రాంతీయ పార్టీల్లో నెలకొన్న స్వార్థపరత్వాన్ని మరోసారి బహిర్గతం చేసింది. అంతేకాదు బీజేపీకి వ్యతిరేకంగా ఏకం కావడంలో కూడా వీటి చిత్తశుద్ధిని శంకించాల్సి వస్త్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఏదోవిధంగా ప్రముఖంగా ప్రచారంలో వుండాలని కోరుకుంటున్నారు. ఇందులో భాగమే భాషా వివాదం మరియు డీలిమిటేషన్‌ వివాదం. ఈ రెండు అంశాల్లో దక్షిణాదికి తనను తాను నాయకుడిగా ప్రచారం చేసుకోవడానికి తహతహలాడుతున్నారు. కానీ ప్రాంతీయ పార్టీలంటేనే కుటుంబ పార్టీలు, పక్కాగా స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తాయి. ఇక్కడ వాటికి బీజేపీకి వ్యతిరేకంగా జట్టు కట్టేకంటే, తమ ప్రయోజనాలు దెబ్బతినకుండా వుంటే చాలన్న ధోరణి మరోసారి బట్టబయలైంది. సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌జేడీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలు తమ ప్రతినిధులను చెన్నైకి పంప డం వల్ల డీలిమిటేషన్‌ ప్రక్రియలో ఆయా రాష్ట్రాలకు పెరిగే సీట్లు తగ్గిపోవు. తమ సహచర తమ సహచర రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నప్పుడు దన్నుగా నిలవకుండా తప్పించుకోవడం వాటికే చెల్లింది. ఇటువంటి పార్టీలు, దేశ ప్రయోజనాలకోసం పనిచేస్తాయని ఎట్లా అనుకోవాలి? జాతీయభావంలేని పార్టీల వల్ల దేశానికి తీరని నష్టం. ఎవరికి వారే నాయకులం కావాలనుకుంటారు పరస్పర సహకారం విషయంలో ముందుకు రారు. ఎప్పటికప్పుడు ప్రాంతీయ సమస్యలను లేవనెత్తి ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడం తప్ప, వీటివల్ల రాష్ట్రాలకు, దేశానికి ఎటువంటి ప్రయోజనం వుండబోదు. కుటుంబపాలనతో రాచరికాన్ని వెలగబెట్టడం తప్ప ప్రజా స్వామ్యం వీటికి ఎంతమాత్రం పట్టదు.

రోడ్డు నిబంధనలు పాటించని వారిపై చర్యలు.

“రోడ్డు నిబంధనలు పాటించని వారిపై చర్యలు”
– ఎస్సై సంగమేశ్వర్

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని లేనిపక్షంలో నిబంధనలు పాటించని వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఝరాసంగం ఎస్సై సంగమేశ్వర్ తెలిపారు. జహీరాబాద్ నుండి రాయికోడ్ కు వయా ఝరాసంగం వెళ్లే ప్రధాన రోడ్డు పై మల్లన్న గట్టు కు వెళ్లే కూడలి రామయ్య జంక్షన్ వద్ద సోమవారం సాయంకాల సమయంలో పోలీస్ సిబ్బంది తో కలిసి వాహనాలు తనిఖీ చేశారు.

Ramaiah Junction

ఈ సందర్బంగా ఆయన వాహనదారులకు పలు సూచనలు సలహాలు చేసి, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడ్డ వారికి చలాన్లు వేశారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించి డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, సంబందిత పత్రాలు కల్గి ఉండి మంచి కండిషన్ గల వాహనల్ని నడపాలని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మానవ ప్రాణం అత్యంత విలువైనదాని, అతి వేగంతో వాహనాల్ని నడపారాదని, రహదారులు పచ్చని చెట్ల నీడతో కప్పబడాలి తప్ప మనిషి రక్తంతో తడవకూడదని వాహనాలు ఢీకొనడం గాని రోడ్డు ప్రమాదాలు జరగడం వల్ల అంగ వికలాంగులు కావడం కుటుంబ సభ్యులకు దూరమావడం తన పై ఆధారపడ్డ వారికి దుఃఖం ను మిగిల్చకూడదని వారి జీవితం అగమ్య గోచరంగా మారుతుందని అందుకు
ప్రతి ఒక్కరు బరువుగా కాకుండా బాధ్యత గా హెల్మెట్ ధరించాలని సూచించారు. చిన్నపిల్లలకు బైకులు ఇవ్వరాదని మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని ఆయన సూచించారు.

కార్యదర్శులపై ‘పంచాయతీ’ భారం.

కార్యదర్శులపై ‘పంచాయతీ’ భారం…

ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి ఆగిన నిధులు

రెండున్నరేండ్లుగా స్టేట్ ఫైనాన్స్ నిధులూ వస్తలేవు

మెయింటెనెన్స్ పనుల కోసం సొంతంగా ఖర్చుపెడుతున్న కార్యదర్శులు

ఒక్కో సెక్రటరీపై రూ.3 లక్షల నుంచి 10 లక్షల దాకా అప్పు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపో వడంతో కేంద్రం నుంచి పల్లెలకు రావాల్సిన నిధులు ఆగిపో యాయి. నిరుడు జనవరి నుంచి ఇదే పరిస్థితి, ఇటు రెండున్న రేండ్లుగా రాష్ట్రం నుంచి స్టేట్ ఫైనాన్స్ నిధులు కూడా రావడం లేదు. మరోవైపు ఆస్తిపన్నులు వసూలు కావట్లేదు. దీంతో పం చాయతీల నిర్వహణ భారం కార్యదర్శులపై పడింది. నిధుల్లేక పల్లెల్లో అభివృద్ధి పనులు చేసే పరిస్థితి లేదు. పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరా, ట్రాక్టర్ మెయింటనెన్స్, డీజిల్, ట్యాంకులు క్లోరినేషన్, బ్లీచింగ్, మోటార్ల రిపేర్ లాంటి పనులకు సెక్రటరీలు తమ జేబుల్లోంచి ఖర్చు చేయాల్సి వస్తున్నది. రెండేండ్లుగా ఇదే పరిస్థితి ఉండడంతో ఒక్కొక్కరు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా అప్పులు చేశామని కార్యదర్శులు వాపోతున్నారు. అప్పులు తెచ్చిపనులు చేస్తున్నాకొందరు ఉన్నతాధికారులు ఫీల్డ్ విజిట్ పేరుతో ఎక్కడో ఓ లోపం పట్టుకొని తమపై చర్యలు తీసు కుంటున్నారని, ఇది ఎంత వరకు సమంజసమని సెక్రటరీలు ప్రశ్నిస్తున్నారు.

Panchayat

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ మేరకు కనీసం స్టేట్ ఫైనాన్స్ నిధులైనా విడుదల చేసి అప్పుల బాధ నుంచి తమకు విముక్తి కల్పిం చాలని కోరుతున్నారు.

పంచాయతీలకు రూ.6,500 కోట్లు పెండింగ్

పంచాయతీలకు గతేడాది ఫిబ్రవరిలో పాల కవర్గాల గడువు ముగిసింది. ఏడాది దాటినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు ఆగిపోయాయి. అలాగే, కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం రూ.1,514 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. పాలకవర్గాలు కొ లువుదీరితే తప్ప ఈ నిధులు వచ్చే పరిస్థితి లేదు. రెండున్నరేండ్లుగా దాదాపు రూ.5 వేల కోట్ల స్టేట్ ఫైనాన్స్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు. గత బీఆర్ఎస్ హయాం నుంచే ఈ పరిస్థితి ఉంది. అప్పటి సర్పంచులు అప్పు చేసి పల్లెలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టగా, దానికి సంబంధించిన బిల్లులు నేటికీ చెల్లించకపోవడం తో వారు ఇబ్బందులు పడుతున్నారు. 15 నెలల కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పంచాయతీలు గాడిన పడ్తాయని అందరూ భావించారు. గతంలో కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులైనా వచ్చేవి. కానీ, ఎన్నికలు జరగ కపోవడంతో ఆ నిధులు కూడా రాకపోవడంతో పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్లు అయింది.

నిర్వహణ భారమంతా కార్యదర్శులదే

సర్పంచుల పదవీకాలం ముగియడంతో పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తున్నది. ఒక్కో అధికారికి నాలుగైదు గ్రామాల బాధ్యతలు ఉండడంతో ఇప్పుడు పంచాయతీల నిర్వహణ భారమంతా పంచాయతీ కార్యదర్శలపై పడింది. కేంద్రం, రాష్ట్రాల నుంచి ఫండ్స్ రాకపోవడం. టార్గెట్ మేరకు ఆస్తిపన్నులు వసూలు కాకపోవ డంతో కార్యదర్శులే అప్పులు చేసి పంచాయతీల ను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఇంటింటా చెత్త సేకరణకు ట్రాక్టర్ను గ్రామంలోకి పంపాలంటే అందులో డీజిల్ పోయించాల్సి ఉంటుంది.
నెలనెలా డీజిల్ కు రూ.10 వేల నుంచి 20 వేలకు పైగా ఖర్చుచేయాల్సి వస్తోంది. చాలా గ్రామాల కు మిషన్ భగీరథ నీళ్లు అందడం లేదు. దీంతో లోకల్ బోర్లు, మోటార్లు, పైపుల రిపేర్లు చేయించక తప్పట్లేదు. రహదారులపై మొరం పోయించడం, గుంతలు పూడ్చడం, మొక్కలకు నీళ్లు పట్టడం, స్ట్రీట్ లైట్ల నిర్వహణలాంటి పనులు సరేసరి. ప్రత్యేక అధికారుల పాలనలో ఏ చిన్న మీటింగ్ జరిగినా తమ జేబు నుంచే పెట్టుకో వాల్సి వస్తోందని కార్యదర్శులు వాపోతున్నారు. ఇలా ఒక్కో నెలకు రూ.50 నుంచి రూ.80 వేల వరకు, పెద్ద పంచాయతీలకు రూ.లక్ష నుంచి రూ. ఐదు లక్షల వరకు మెయింటెనెన్స్ ఖర్చవు తున్నదని చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా అప్పు చేశామని వాపోతున్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గత కెసిఆర్ ప్రభుత్వాన్ని.

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గత కెసిఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టిన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం

గంగాధర నేటిధాత్రి :

 

KG to PG విద్యను ప్రారంభిస్తా, కార్పొరేట్ కళాశాల కాళ్లు విరుస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన కెసిఆర్, గత దశాబ్ద కాలంలో విద్యా విధ్వంసానికి పాల్పడ్డాడు. కెసిఆర్ తీర్పుతో విద్యా వ్యవస్థ రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్ళి. ది అన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్-2024 ప్రకారం 2వ తరగతి నుండి 5వ తరగతి చదువుతున్న 82% విద్యార్థులకు 2వ తరగతి బుక్స్ చదవడం రావడం లేదు, 8వ తరగతి చదువుతున్న 65% మంచి విద్యార్థులకు బేసిక్ మ్యాథమెటిక్స్ పైన అవగాహన లేదు, బీహార్ జార్ఖండ్,ఛత్తీస్గడ్ వంటి రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం విద్యావ్యవస్థలో అధమ స్థానంలో ఉంది. నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో 3వ, 5వ, 8వ,10వ తరగతి విద్యార్థుల సామర్ధ్యాన్ని రాష్ట్రాల వారిగా నిర్వహించే పరీక్షలో టాప్-5 వరస్ట్ పర్ఫామెన్స్ రాష్ట్రాల్లో తెలంగాణను ఉంచిన ఘనత కేసిఆర్ కు దక్కుతుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో 2017-18 నుండి పర్ఫామెన్స్ ఆఫ్ గ్రేడింగ్ ఇండెక్స్ సూచిక ద్వారా రాష్ట్రాల విద్య వ్యవస్థ పనితీరుకు ర్యాంకులు కేటాయించడం జరుగుతుంది, ఈ ఇండెక్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రం జాతీయలోనే అధమ స్థానంలో నిలిచింది. 2022 సూచిక ప్రకారం సెకండరీ విద్య తర్వాత డ్రాప్ అవుట్ లలో తెలంగాణ రాష్ట్ర మొదటి స్థానంలో ఉంది, జాతీయస్థాయిలో ఈ సగటు 13.2% గా ఉంటే,తెలంగాణ రాష్ట్రంలో 22.2% గా ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వ పెద్దలు నారాయణ,శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ పాఠశాలలను ప్రోత్సహించి, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేశారు.

కెసిఆర్ హయంలో విధ్వంసానికి గురైన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యకు అధిక నిధులు కేటాయిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో విద్యాభివృద్ధికి రూ.23,108 కోట్ల రూపాయలను ప్రభుత్వం కే ప్రతిపాదించింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ లను ప్రారంభించాలని సంకల్పించి సీఎం రేవంత్ రెడ్డి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల డైట్ చార్జీలను 200 శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో 8 వేల పై చిలుకు టీచర్ ఉద్యోగాలనే భర్తీ చేయగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 11 వేలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసింది. దశాబ్ద కాలంగా ఉపాధ్యాయ బదిలీలు, మోషన్లు చేపట్టలేదు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులను బదిలీ చేయడంతో పాటు ప్రమోషన్లను కల్పించింది. విద్యా వ్యవస్థను పర్యవేక్షణ చేయడానికి గత ప్రభుత్వం హాయంలో డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు, ఎంఈఓ లను నియమించలేదు. కేజీ టు పీజీ విద్య నేపంతో ప్రారంభించిన సంక్షేమ పాఠశాలల్లో వసతి సౌకర్యాలు సరిగా లేక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఆనాటి బిఆర్ఎస్ నాయకుల జేబులు నింపడానికి వారి కోళ్ల ఫారాలు, అభ్యభవనాల్లో పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టింది ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం. గత దసరా సమయంలో టిఆర్ఎస్ నాయకుల కనుసన్నల్లో ఉన్న భవనాలకు అద్దె చెల్లించలేదని ధర్నాలు చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రీన్ ఛానల్ ద్వారా భవనాలకు మధ్య చెల్లిస్తామని, పాఠశాలలు నడవకుండా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంతో తిరిగి ప్రారంభించారు. శాస్త్రీయ ప్రమాణాలు పాటించకుండా ప్రారంభించిన ఈ పాఠశాలలతో రాష్ట్రంలో ఉన్న జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలు చాలావరకు మూతపడ్డాయి, ఉన్న పాఠశాలల్లో సరైన విద్యార్థులు లేకుండా పోయింది.

కెసిఆర్ హయంలో నిర్వీర్యమైన విద్యావ్యవస్థను తిరిగే గాడిలో పెట్టడానికి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తోంది. కులం,మతం,ఆర్థిక సంబంధం లేకుండా ప్రతి విద్యార్థికి విధమైన విద్యను అందజేయడానికి ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించడం చారిత్రక నిర్ణయం. విద్య ద్వారానే జీవితానికి సార్థకత ఏర్పడుతుందన్న అంబేద్కర్ ఆలోచన విధానం మేరకు డబ్బులు ఉన్న పిల్లలకే ఐఐటీ,నీట్ అనే విధానం పోవాలనే గొప్ప ఆలోచనతో ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రారంభిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన మధ్యాహ్న భోజనం బిల్లులను ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో నీళ్ల చారు అన్నం తినవలసి వచ్చింది. విద్యార్థులకు పౌష్టికరమైన ఆహారం అందించడానికి డైట్ చార్జీలను 200 శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది.

రోడ్ల వెంట కొనుగోలు ఆపాలి…

రోడ్ల వెంట కొనుగోలు ఆపాలి…? మార్కెట్ గేట్ తాళాలు తెరవాలి…?

ఉపాధి కోల్పోతున్న మార్కెట్ హమాలి కూలీలు దడువాయిలు

ఈ నామ్ చేయకుండా… రైతుల సొమ్ము కాజేస్తున్న వ్యాపారులు

మార్కెట్లో చారాన కొలుగోళ్ళు…! రోడ్ల వెంట బారాన కొనుగోళ్లు..!

చోద్యం చూస్తున్న మార్కెట్ అధికారులు

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

 

కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఆసియా ఖండంలో భారత దేశంలోనే ఎక్సలెన్స్ అవార్డు పొంది గుర్తింపు తెచ్చుకొని పేరుగాంచింది, అంటే అప్పుడున్న మార్కెట్ అధికారుల చిత్తశుద్ధి కట్టుదిట్టమైన పాలన, వ్యాపారులు మార్కెట్ యార్డులోనే కొనుగోలు చేసేలా నియమ నిబంధనలు అమలుపరి, మార్కెట్ పరిసర ప్రాంతాలలో బహిరంగంగా రోడ్ల వెంట ఎవరు కొనుగోలు చేయరాదని పటిష్టమైన కట్టుదిట్టమైన చర్యలతో మార్కెట్ను సజావుగా నడిపించేవారు.

ట్రేడింగ్ లైసెన్స్ ఉన్న వారు ఎవరైనా రోడ్ల వెంట దుకాణాల ముందు కొనుగోలు చేసి వ్యవసాయ మార్కెట్ ను అప్రతిష్ట పాలు చేసే వారిపట్ల గతంలో కఠినంగా వ్యవహరించి నోటీసులు జారీ చేసిన సందర్భాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.

వ్యవసాయ మార్కెట్ అధికారులు నియవ నిబంధనలు చేపట్టి రైతుల ధాన్యాన్ని మార్కెట్లోనే విక్రయించుకునేలా రైతులకు ఎలాంటి మోసాలు జరగకుండా అలాగే మార్కెట్ ఆదాయానికి గండి పడకుండా మార్కెట్ యార్డులో పనిచేసేటువంటి హమాలి కూలీ కార్మికులకు మరియు దడువాయిలకు మంచి ఉపాధి లభించేదని పలువురు హమాలి కూలి దడువాయిలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.

కొంతమంది వ్యాపారులు సిండికేట్ గా మారి ఇష్టం వచ్చిన కాడికి రైతులను మోసం చేస్తూ దండుకుంటున్నారని పలువురు రైతులు విమర్శిస్తున్నారు.

మార్కెట్ పరిసర ప్రాంతాలలో కొనుగోలు చేయరాదని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కి కొంతమంది వ్యాపారులు వే బ్రిడ్జి కాంటాలు నిర్వహిస్తూ వే బ్రిడ్జ్ కంటాలలో తేడాలు ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్న అవేవి పట్టించుకోకుండా ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తూ వే బ్రిడ్జి కాంటా నిర్వహించిన తర్వాత రైతుల ధాన్యం నుండి 30 నుంచి 40 కిలోల వరకు తరుగు పేరుతో కోత విధిస్తూ ఇష్టం వచ్చిన రేట్లు పెడుతూ రైతులను నిండా ఉంచుతున్నారని ఈ నామ్ చేయకుండా మార్కెట్ ఆదాయాన్ని గండి పెడుతున్నారని పలువురు రైతులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.

ఇటు రైతులనే కాకుండా హమాలి కూలీలను మరియు దడువాయిలకు రావాల్సిన సొమ్ము ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, హమాలీ కూలి రేట్లు చెబుతూ రైతుకు ఇచ్చే లెక్కల్లో చూపుతూ రైతుకు కోత విధిస్తూ ఆ సొమ్మని వ్యాపారి జేబులోనే వేసుకుంటున్నాడని ఇది చాలా దారుణమని పలువురు భావిస్తున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా రోడ్ల వెంట వ్యాపారులు కొనుగోలు చేస్తుంటే మార్కెట్ అధికారులు పట్టించుకోకపోవడం వెనక ఏదో మతాలాబ్ ఉందని గుసగుసలాడుకుంటున్నారు.

ఈ మొక్కజొన్న సీజన్లో మార్కెట్ యార్డ్ మొత్తం కాలు పెట్టే సందు లేకుండా మొక్కజొన్న రాశులతో కలకలాడుతూ కనిపిస్తూ ఉండేది, నేడు మార్కెట్ యార్డు మొత్తం ఎటు చూసినా మొక్కజొన్న రాశులు లేవు వ్యవసాయ మార్కెట్ యాడ్ మొత్తం ఖాళీగా కనిపిస్తుందంటే దీనికి అధికారులే కారణమని రైతులు దుయ్యబడుతున్నారు.

మార్కెట్ గేట్లకు తాళాలు వేసే సమయపాలన లేదా రైతులకు మార్కెట్లో అమ్ముకునే హక్కు లేనట్టు ఇలా గేట్లకు తాళాలు వేయడం ఏంటని పలువురు విమర్శిస్తున్నారు.

ఇదే అదునుగా భావించిన వ్యాపారస్తులు మా తప్పేం లేనట్టు కొంతమంది ట్రాక్టర్ డ్రైవర్లతో సహా ట్రాలీల వరకు డబ్బు ఆశ చూపి ట్రేడింగ్ దుకాణాల ముందుకు రైతుల ధాన్యాన్ని రప్పించుకునేలా వ్యూహాలు మొదలు పెడుతున్నారని పలువురు రైతులు అంటున్నారు.

ఇటు మార్కెట్ ఆదాయానికి గండి పెడుతూ మార్కెట్ హమాలీ కూలీల దడువాయిలకు ఉపాధి లేకుండా చేస్తున్న మార్కెట్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వెనక విమర్శలు వెళ్లవెత్తుతున్నాయని ప్రజలు చెప్పుకుంటున్నారు.

రైతులు ధాన్యాన్ని మార్కెట్లో పోసుకోకుండా చుట్టూ ఉన్న గేట్లకు తాళాలు వేసి ఉండడంతో రైతులు అయోమయానికి గురై దిక్కులేని స్థితిలో ఇలా రోడ్ల వెంట అమ్ముకొని నష్టాలను భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు మండిపడుతున్నారు.

వ్యాపారులు మార్కెట్ యార్డులో 25% కొనుగోలు చేసి బహిరంగంగా వారి ఇష్టం వచ్చిన రేటు విధిస్తూ తరుగు పేరుతో 30 నుంచి 50 కేజీల వరకు ధాన్యంలో కోత విధిస్తూ బజారులో 75% కొనుగోలు చేస్తూ రైతులను మోసాలకు గురి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి, కానీ మార్కెట్ అధికారులు మాత్రం వ్యాపారుల నుండి మార్కెట్ ఫీజు చెల్లిస్తున్నారు అని చెప్తున్నారు తప్ప మరి రైతుల పక్షాన మార్కెట్ అధికారులు చర్యలు చేపట్టడం లేదని రైతులు మోసాలకు గురికాకుండా చూడాల్సిన అధికారులే మాకు ఏమీ ఎరగనట్టు చోద్యం చూస్తుంటే ఇక మార్కెట్ ఎందుకు అని ప్రజలు విమర్శిస్తున్నారు.

ఇలా ఎవరికి వారు రైతును దోచుకోవాలని చూసేవాళ్ళు ఉన్నంతకాలం రైతు రాజు కాలేడని దీనికి కేసముద్రం వ్యవసాయ మార్కెట్ అధికారులే నిదర్శనమని పలువురు భావిస్తున్నారు.

ఇదే సందర్భంగా పలు హమాలి కూలి కార్మికుల సంఘాల నాయకులు మార్కెట్ కార్యాలయం ముందు వ్యాపారులు దుకాణాల ముందు రోడ్ల వెంట కొనుగోలు చేయరాదని అనే నినాదంతో కార్మికులతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ మార్కెట్ అధికారులలో ఏమాత్రం వ్యవసాయ మార్కెట్ పట్ల చిత్తశుద్ధి లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికైనా వ్యవసాయ మార్కెట్ అధికారులు మార్కెట్ సమయపాలన పాటిస్తూ మార్కెట్ గేట్లు తెరిచి ఉంచాలని అప్పుడే రైతుల యొక్క దాన్యం సరుకులకు గిట్టుబాటు ధర లభించి తూకాలలో మోసాలు జరగకుండా రైతుకు న్యాయం జరుగుతుందని ఇకనైనా మార్కెట్ అధికారులు రైతుల పక్షాన అలాగే మార్కెట్ ని నమ్ముకుని బ్రతుకుతున్న వేలాదిమంది కార్మికుల ఉపాధి కోల్పోకుండా నిలబడి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపట్టాలని పలువురు హమాలి, కూలి దడువాయి కార్మికుల సంఘం నాయకులు రైతులు రైతు సంఘం నాయకులు మార్కెట్ అధికారులను మార్కెట్ పాలకమండలిని కోరుకుంటున్నారు.

ఈ డైలమా ఇంకెంత కాలం! కరిగిపోతున్న పుణ్యకాలం!!

`ఈటెల తప్ప ఇంకెవరూ కనిపించడం లేదా?

`అరవింద్‌ లాంటి నాయకులు అధ్యక్షుడుగా పనికి రారా?

`బండి సంజయ్‌ ను మరో సారి అధ్యక్షుడిని చేయలేరా?

`రఘునందన్‌ రావుకు అవకాశం ఇచ్చి చూడలేరా?

`బిజేపి పగ్గాలపై పారని పాచికలు!

`రాష్ట్ర బిజేపిలో లుకలుకలు

`అధిష్టానానికి తప్పని తలనొప్పులు

`బిజేపిలో కొనసాగుతున్న తెర వెనుక దోబూచులాట!

`అదిగో, ఇదిగో అధ్యక్షుడొచ్చే అనేవి ఊహలేనా

`ఈటెల అధ్యక్షుడు అనేది సొంత ప్రచారమేనా?

`ఏ వార్త నిజమో! ఏ వార్త అబద్ధమో గందరగోళం

`అందరూ ఆశావహులే..ఎవరికిచ్చినా సహాకారాలు అంతంత మాత్రమే!

`ఈటెల రాజేందర్‌ ప్రచారం ఎంత వరకు నిజమౌతుంది?

`బిసి నినాదం అంటే రాజేందర్‌కే పరిమితం కాదు

`అరవింద్‌ కూడా ముందు వరుసలో నిలబడే అవకాశం

`ఇప్పుడు ఎవరు అధ్యక్షుడైనా మూడేళ్లే పదవీ కాలం!

`ఎన్నికల నాటికి అధ్యక్షుడుగా ఎవరున్నా మార్పు ఖాయం!

`ఇప్పుడు ఎవరికిచ్చినా అభ్యంతరం ఎవరికీ వుండకపోచ్చు!

`ఇప్పుడు అధ్యక్షుడయ్యే వారికి వెంటనే రెండో సారి అవకాశం దక్కకకపోవచ్చు

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఇదిగో అధ్యక్షుడొచ్చె..అదిగో కొత్త అధ్యక్షుడు వచ్చే అంటూ ఏడాది కాలంగా బిజేపిలో వార్తలు వాస్తవాలు రూపుదాల్చడం లేదు. కొత్త బిజేపి అధ్యక్షుడు రావడం లేదు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి రాష్ట్ర బిజేపి పగ్గాలు చేపట్టి రెండు సంవత్సరాలౌతోంది. మరో ఏడాదిపాటు అలాగే కిషన్‌ రెడ్డిని కొనసాగిస్తారా? లేక కొత్త వారిని నియమిస్తారా? అన్న ప్రశ్నలే వినిపిస్తున్నాయి. కాని సమాధానాలు మాత్రం ఎవరూ చెప్పడం లేదు. నాయకులకు కూడా ఈ వివరాలు తెలియడం లేదు. కాని ఓవైపు బిజేపి పుంజుకుంటున్న తరుణంలో కూడా బిజేపి అదిష్టానం ఇంకా రాష్ట్ర బిజేపి పగ్గాలు కొత్తవారికి అప్పగించక పోవడం కూడా శ్రేణుల్లో నైరాశ్యం ఆవహిస్తోంది. కొత్త అధ్యక్షుడు వస్తే పార్టీలో ఊపు వస్తుందని చూస్తున్నారు. జిల్లాల అధ్యక్షులను ప్రకటించినప్పటి నుంచి రాష్ట్ర అద్యక్ష ప్రకటన వస్తుందని ఎదురుచూస్తున్నారు. కాని కేంద్రం నుంచి ఎలాంటి సంకేతాలు వెలువడడం లేదు. కాని అదిగో..ఇదిగో అన్న మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే వచ్చేది ఎవరో గాని, నేనంటే నేనే అనుకునే వారు మాత్రం చాలా మందే వున్నారు. ఒక రకంగా చెప్పాంటే ఎంపిలంతా క్యూలో వున్నారు. అందరూ నాకే వస్తుందన్న ఆశాభావంతో వున్నారు. కాని ఎవరిని పదవి ఎవరిని వరిస్తుందో అర్దం కాక అందరూ తలలు పట్టుకుంటున్నారు. పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం సాదించాలని అదికారంలోకి తేవాలని కార్యకర్తలు ఉవ్విల్లూరుతున్నారు. పార్టీ బలోపేతం కోసం ఆలోచిస్తున్నారు. కాని రాష్ట్ర స్దాయి నాయకత్వంలో ఆ ఊపు మాత్రం కనిపించడం లేదు. ఇటీవల రెండు ఎమ్మెల్సీలు గెల్చుకొని బిజేపి మరింత ఊపుతో వుంది. ఇలాంటి సమయంలో కొత్త అధ్యక్ష పదవిని ఎవరికో ఒకరికి అప్పగిస్తారని అనుకుంటున్నారు. ఆ సంకేతాలు వెలుడుతున్నాయి. అయినా నాయకుల్లో డైలామా ఇంకెంత కాలం అంటున్నారు. ఎవరి గోల వారిదే! పారని పాచికలు..పగ్గాల కోసం పరుగులు! బిజేపి అధ్యక్ష ఎన్నిక కోసం నేతల ఉరుకులు పరుగులు. రాష్ట్ర బిజేపిలో లుకలుకలు. అదిష్టానం ముందు నేతలంతా హజరు. ఎవరి ప్రయత్నాలు వారివే..ఎవరి దారి వారిదే. బిజేపిలో కొనసాగుతున్న తెరవెనుక దోబూచులాట. ఈటెల వైపు అధిష్టానం మొగ్గు ప్రచారం మాత్రమే. గట్టిగానే ప్రయత్నిస్తున్న రామచంద్రరావు. నన్ను కూడా పరిగణలోకి తీసుకోమంటున్న డికే. అరుణ. ఏ వార్త నిజమో! ఏ వార్త అబద్దమో అంతా గందరగోళం.బిఆర్‌ఎస్‌లో వున్నప్పుడు ఈటెల అందరికీ అజాతశత్రువే. బిజేపిలోకి వెళ్లి కొందరికి పట్టని, గిట్టని శత్రువే? పైకి అంతా నటిస్తున్నారు..ఈటెల మాత్రం తన ప్రచారం తాను చేసుకుంటున్నారు. తానే కొత్త అధ్యక్షుడినంటూ చేసుకున్న ప్రచారం బిజేపిలో ఎవరికీ నచ్చడం లేదు. అదిగో పులి అంటే ఇదితో తోక అని ప్రచారం జరగడం ఈ రోజుల్లో పెద్ద వింత కాదు. అదే సంప్రదాయమౌతోంది. ఆ వార్తలకే ప్రాదాన్యత దక్కుతోంది. కేంద్ర బిజేపి నాయకులకు ఎప్పుడూ ఏదో ఒక తలనొప్పి వస్తూనే వుంది. వరుస ఎన్నికలతో సతమతమౌతూనే వుంది. కాకపోతే ఎక్కడ ఎన్నికలు జరిగినా బిజేపి గెలుస్తూ వస్తోంది. ఆ ఊపులోనే తెలంగాణ బిజేపి అధ్యక్షపదవి ప్రకటన వుంటుందని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈటెల రాజేందర్‌ పేరు ఖరారైనట్లు ఈయన వర్గం కొన్ని నెలలుగా విపరీమైన, విసృతమైన ప్రచారం సాగిస్తోంది. అంటే పోటీలో ఈటెల మాత్రమే వున్నాడని, ఆయన పేరు ఖరారైన తర్వాత చేసేదేముందని ఇతర నాయకులు చేతులెత్తేసేందుకు ఇదొక వ్యూహం అనుకోవాలి. కాని డిల్లీలో మరోరకమైన వాతావరణం కనిపిస్తోంది. రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు మాజీ ఎమ్మెల్సీ సీనియర్‌ నాయకుడు రామచంద్రరావుకు ఇవ్వాలని బలంగా ఇతర నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆయనకు పార్లమెంటు ఎన్నికల్లోనే టికెట్‌ ఇస్తారని అనుకున్నారు. అప్పుడు కూడా ఈటెల రాజేందర్‌ టికెట్‌ కోసం ప్రయత్నం చేశారు. అదిష్టానాన్ని ఒప్పించారు. మెప్పించి టికెట్‌ తెచ్చుకున్నారు. అప్పుడే సీనియర్లు కొంత ఇబ్బంది పడ్డారు. ఈటెలకు టికెట్‌ ఇవ్వడాన్ని లోలోన సీనియర్లు వ్యతిరేకించారు. అధిష్టానం నిర్ణయం కావడంతో ఆయనకు సపోర్టుగా నిలిచారు. ఇప్పుడు మళ్లీ పార్టీ పగ్గాల విషయంలోనూ ఈటెల ఇతర సీనియర్లకు పోటీ రావడాన్ని సీనియర్లు తట్టుకోవడంలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. బిజేపిలో చేరిన తర్వాత ఎన్నికల ముందు బండి సంజయ్‌ పార్టీ అధ్యక్ష పదవి పోవడానికి ప్రధాన కారణం ఈటెల రాజేందరే అన్న ఆరోపణలు అనేకం వచ్చాయి. అందులోనూ కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్‌ కూడా నర్మగర్భంగా అనేక సార్లు ఆ విషయం వెల్లడిరచడం కూడా జరిగింది. ఇప్పుడు మళ్లీ అధ్యక్ష ఎంపిక తెరమీదకు వచ్చింది. ఈ నెలలోనే అధ్యక్ష ప్రకటన వస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఈ విషయాన్ని మెదక్‌ ఎంపి. రఘునందన్‌ రావు వెల్లడిరచినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే తాను కూడా రేస్‌లో వున్నానని పదే పదే చెబుతున్న రఘునందన్‌ రావు చెప్పడం అంటే డిల్లీలో ఏదో పీట ముడి జరుగుతోందన్నది మాత్రం అర్ధమౌతుంది. అంటే తాను రేసు నుంచి తప్పించారని ఆయన అభిప్రాయమా? అన్నది కూడా అర్దం చేసుకోవచ్చు. ఇక మిగిలింది డికే. అరుణ. ఆమె కూడా తెలంగాణ రాజకీయాల్లో సీనియర్‌ నాయకురాలు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా అనుభవం వుంది. అటు పార్టీ నాయకురాలిగా, ఇటు పాలనా పరమైన అనుభవం వున్న నాయకురాలు డికే. అరుణ. అంతేకాకుండా ఉమ్మడి మహాబూబ్‌ నగర్‌ జిల్లా మీద ఆమెకు పూర్తి పట్టువుంది. తెలంగాణ రాజకీయాలపై కూడా ఎంతో అవగాహన వుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహాబూబ్‌ నగర్‌ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ముఖ్యంగా అధికార పార్టీని టార్గెట్‌ చేస్తూ రాజకీయాలు చేయాలంటే డికే. అరుణకు అద్యక్ష బాద్యతలు అప్పగిస్తే రాజకీయాలు రంజుగా వుంటాయన్నది కొందరి అభిప్రాయం. గతంలో డికే. అరుణ మంత్రిగా వున్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడుగా రేవంత్‌ రెడ్డి అడుగడుగునా అడ్డుకునేవారు. ఆమెకు వ్యతిరేకంగా రాజకీయాలు నెరిపారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి వున్నారు. అదే జిల్లా నుంచి పార్లమెంటు సభ్యురాలుగా వున్న డికే. అరుణకు పగ్గాలు అప్పగిస్తే రాజకీయాలు హాట్‌ హాట్‌గా మారుతాయి. ఇక్కడ కొన్ని విషయాలు ప్రత్యేకంగా చర్చించుకోవాలి. రెండు జాతీయ పార్టీలు క్రియాశీలంగా వున్న రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల మనుగడ కొనసాగదు. ఇప్పుడు అదే ఫార్ములాను అనుసరించి రాజకీయాలు చేయాలనుకుంటే బిజేపి డికే. అరుణకు పార్టీ పగ్గాలు అప్పగించాలి. ఇప్పటి వరకు అధికార కాంగ్రెస్‌ పార్టీ మీద పోరాటం చేస్తున్న పార్టీగా టిఆర్‌ఎస్‌ మాత్రమే ముందు వుంది. రాష్ట్ర అధ్యక్షుడైన జి. కిషన్‌ రెడ్డి కేంద్ర క్యాబినేట్‌ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన అటు పాలన, ఇటు రాష్ట్ర రాజకీయాలనే కాదు, దేశంలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో ప్రచారాలు నిర్వహిస్తూ బిజీగా వుంటున్నారు. దాంతో తెలంగాణ రాజకీయాలమీద పూర్తి దృష్టిపెట్టే అవకాశం చిక్కడం లేదు. త్వరలో తెలంగాణలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగనున్నాయి. గతంలో రామచంద్రరావు మహాబూబ్‌ నగర్‌ నుంచి గ్రాడ్యుయేట్‌ ఎన్నికలు గెలిచిన అనుభవం వుంది. కరీంనగర్‌ పార్లమెంటు నుంచి బండి సంజయ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆదిలాబాద్‌ నుంచి ఎమ్మెల్యేలున్నారు. నిజాబాబాద్‌ నుంచి ఎమ్మెల్యేలున్నారు. మెదక్‌ నుంచి పార్లమెంటు సభ్యుడు రఘునందన్‌ రావు వున్నారు. వీళ్లలో ఎవరో ఒకరికి ఇవ్వడమో లేదా? మరో ఏడాదిపాటు అద్యక్ష ఎంపిక లేదని చెప్పడమో జరగడం లేదు. అయితే ఇక్కడ ఒక విషయం సూక్ష్మంగా ఆలోచిస్తే అర్దమౌతుంది. బిజేపిలో అధ్యక్ష పదవి కాలం మూడు సంవత్సరాలు. ఇప్పుడు కేంద్ర మంది బండి సంజయ్‌కు అద్యక్ష బాద్యతలు అప్పగిస్తే ఎన్నికల నాటికి మళ్లీ ఆ పదవి కాలం పూర్తవుంది. అందువల్ల ఈ సమయంలో పార్టీలో ఎవరికో ఒకరికి ఇచ్చి, పార్టీకి కొంత ఊపు తెచ్చి, సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల మందు బండి సంజయ్‌ను బిజేపి అధ్యక్షుడిని చేయాలన్న ఆలోచన బిజేపి అధిష్టానం చేస్తున్నట్లు కూడా మరో వాదన వుంది. కాకపోతే కొత్త అద్యక్షుడు ఈ మధ్య సమయంలో ఎవరో ఒకరు రాకపోతే పార్టీలో కొంత నిరాశ, నిస్రృహలు నెలకొంటాయని చెప్పడంలో సందేహం లేదు. అందువల్ల అద్యక్ష పదవి ఎవరికో ఒకరికి ఇస్తే జోష్‌ పెరిగే అవకాశం వుంది. బిజేపి మరింత బలోపేతమయ్యేందుకు ఆస్కారముంది.

కమిట్‌ మెంట్‌ ‘కామ’నా?

-ఆడవాళ్లు ఎప్పటికీ ఆట బొమ్మలేనా?

-సినీ రంగానికే పరిమితమా?

-వ్యవస్థలో పెరిగిపోయిన జాడ్యమా?

-అవినీతిలో ఇదొక భాగమా?

 

-అన్ని రంగాలలో మహిళలు అనుభవిస్తున్నదేనా?

-ఏ వ్యవస్థలో చూసిన కనిపించకుండా వుందా?

-రాజకీయాలలోకి కూడా వుందా?

-వైద్య వృత్తిలో కూడా నీచం లేకుండా పోయిందా?

-పోలీసు వ్యవస్థలో ఏమైనా తక్కువుందా?

-విద్యా వ్యవస్థను కూడా నాశనం చేసిందా?

-ప్రైవేటు కంపనీలైనా, ప్రభుత్వం ఉద్యోగులకు తప్పడం లేదా?

-మహిళ అంటే సమాజంలో ఇంత చిన్న చూపా?

-విద్యావంతమైన సమాజంలో కూడా మహిళకు స్వేచ్ఛ లేదా?

-స్వాతంత్య్రం ఇంకా మహిళలకు అందడం లేదా?

-ఎక్కువగా సినీ రంగంలోనే ఎందుకు వేళ్లూనుకొని పోయింది?

-సినీ వ్యవస్థ ఎందుకు ఇంతగా దిగజారిపోయింది!

-జనం గొప్పగా కీర్తించే వారిలో కూడా ఈ రోగం ఎందుకుంది?

-సహ నటీమణులతో నటుల పైత్యమేమిటి?

-గుడికెళ్తే అమ్మవారిని కొలుస్తారు?

-బైట ఆడవారు కనిపిస్తే కామంతో చూస్తారు?

-మహిళ నవ్వితే చాలు నానా పెడర్థాలు తీసుకుంటారు?

-కనీసం మహిళలు మనసారా నవ్వుకునే స్వేచ్ఛను దూరం చేస్తున్నారు.

-వేధింపులకు గురి చేస్తున్నారు!

-లొంగిపోతే తప్ప వదలనంత దుర్మార్గం చూపిస్తున్నారు.

ఏ వ్యవస్థ చూసినా ఏమున్నది గర్వకారణం.. సమస్తం కామపు చూపుల మృగాల అరణ్యం. నాకెంతిస్తావంటే ఒక రకమైన అర్థమొస్తుంది. నాకేమిస్తావంటే మరో అర్థం స్పురిస్తుంది. అసలు కమిట్‌ మెంట్‌ అనేది ఒక్క సినిమా రంగంలోనే వుందా? అంటే అన్ని వ్యవస్థలలోనూ పాతుకుపోయింది. వేళ్లూనుకుపోయింది. ఆ దారిద్య్రం రాజకీయాలలో కూడా వుంది. కానీ సినిమా విషయంలోనే ఎక్కువగా వెలుగులోకి వస్తుంది. ఎందుకంటే సమాజంలో ఎలాంటి వారికైనా సినిమా రంగంలో ఏం జరుగుతోందనేది తెలుసుకోవాలన్న ఉత్సుకత వుంటుంది. సామాన్యులలో మరీ ఎక్కువగా వుంటుంది. ఇక స్థితి మంతులలో తమకు అవకాశం దొరికితే బాగుండు అనే కోరిక కలుగుతుంది. మహిళలు బైటకు రావాలి. రాజ్యమేలాలి. అన్ని రంగాలలో దూసుకుపోవాలి. అని గొప్పలు బాగానే చెప్పుకుంటాం. కానీ మహిళలు బయటకు వస్తే ఎన్నో వేల కామపు కళ్ల ముందు నుంచి వెళ్లాలి. మహిళలు ఎంత ఉన్నత స్థానంలో వున్నా ఈ సమాజపు చూపులో తేడా వుంటుంది. అందుకే ఆడ పిల్లలను బైటకు పంపాలంటే తల్లిదండ్రులు ఒకటి లక్ష సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఎంత గొప్ప స్థానంలో వున్నా సాయంత్రానికి ఇంటికి చేరుకోకపోతే భయపడాల్సి వస్తోంది. ఇదేం ఖర్మనో ఇప్పటి వరకు అర్థం కాదు. మహిళకు స్వేచ్చను ఎలాగూ ఈ సమాజం ఇవ్వదు. గౌరవం అంత కన్నా ఇవ్వదు. కానీ చెడు దృష్టినైనా మార్చుకుంటుందా? అదీ వుండదు. నాపై ఆ కళ్లు పడలేదు. అని చెప్పడానికి కూడా లేకుండా పోతోంది. సినిమా రంగంలో ఆ తరం నుంచి మొదలు ఈ తరం వరకు అందరూ బాధితులే…పైకి చెప్పుకోవడానికి ఎంత అబద్దమాడాలనుకున్నా, కళ్లలో ఆ తడి వారిని నిజం చెబుతుంది. వారికి జరిగిన అన్యాయం తన్నుకుంటూ వస్తుంది. సినిమా రంగంలోనే ఇంత దిగజారుడు తనం వుంటుందనుకుంటే, ఆ దుర్మార్గం టెలివిజన్‌కు కూడా సోకిందని తెలుస్తుండడం విడ్డూరం. సినిమాలో వుండే ప్రతి మగాడు కళా హృదయుడు కాదు. హీరోలు కాదు ముసుగు మాయగాళ్లు. సినిమా అంటే రంగుల ప్రపంచం. అందమైన లోకం. నిజానికి సినీ లోకం అంటే కళాత్మక నిండివుండాలి. నటనా చాతుర్యం తెలిసి వుండాలి. ఎలాంటి పాత్రలోనైనా సహజ నటనత్వంతో ఒదిగిపోవాలి. ప్రేక్షకులను రంజింపజేయాలి. ప్రేక్షకులు ఆ పాత్రలో లీనమైపోయే చేయాలి. సినిమా చూస్తున్నంత సేపు సగటు ప్రేక్షకుడు సినిమా చూస్తున్నామనే భావన రాకూడదు. తాను తన్మయత్వంలో మునిగిపోవాలి. అదీ సినిమా అంటే..కానీ ఇప్పడుడేమైంది. వ్యాపార వస్తువైపోయింది. ఆదాయ మార్గమైపోయింది. కళాత్మక చిత్రాల జాడ లేకుండా పోయింది. ఒక రకంగా చెప్పాలంటే సినిమా ఎప్పుడో కళ తప్పింది. కాసుల వర్షం కోసం మాత్రం నిర్మాణం సాగుతోంది. రూపాయి పెట్టుబడితో వంద రూపాయల ఆదాయం సమకూర్చే వ్యాపారమైపోయింది. కొత్త తరం వచ్చినా వారసత్వంతో నిండిపోయింది. కొన్ని కుటుంబాల గుప్పిట్లో సినిమా బంధీ అయిపోయింది. దాంతో వాళ్లు తీసిందే సినిమా. వాళ్లు వేసిందే వేషం. వాళ్లు చేసేదే నటన. అంతకు మించి ప్రేక్షకులకు గత్యంతరం లేదు. కొత్తగా ఎవరైనా వస్తామంటే రానివ్వరు. వచ్చినా వారిని రాణించనివ్వరు. సినిమా అవకాశాలు రాకుండా చేస్తారు. ఎవరూ వారికి సహకరించకుండా చూస్తారు. వాళ్ల సినిమా తెరమీద పడకుండా అడ్డుకుంటారు. ధియేటర్లన్నీ గుప్పిట్లో పెట్టుకొని వాళ్ల సినిమాలు మాత్రమే ఆడేలా చేసుకుంటారు. ఇదోరకమైన దోపిడీ ఇలా సాగిస్తూనే మరో వైపు హీరోయిన్లను వేధించుకు తింటారు. అదే కాస్టింగ్‌ కౌచ్‌. పేరు కూడా వినసొంపుగా పెట్టారు. ఆ దరిద్రాన్ని అర్థం కాకుండా చేస్తున్నారు. కమిట్‌ మెంట్‌ ‘కామ’నా? అనే ప్రశ్న ఉత్పన్నం కానటువంటి వ్యవస్థ కనిపించకపోవడం మన దౌర్భాగ్యం. అది ఒక్క సినీ రంగానికే పరిమితమా? అంటే ఎక్కువ సమానం మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. అది అందరూ అంగీకరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో గతంలో వారికి జరిగిన అనుభవాలను అనేక మంది హీరోయిన్ల వెల్లడిస్తున్నారు. బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ దాకా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు వాటిని గాసిప్స్‌గా మాత్రమే చెప్పుకునే వారు. ప్రజలు కూడా సినీ పత్రికలలో ఇలాంటి వార్తలను ఆసక్తిగా చదువుతుండేవారు. వాటిలో నిజమెంత అనేదానికన్నా, అదే నిజమైతే బాగుండు అని చదువుకునే వారు. అక్కడితో వదిలేసేవారు. ఎప్పుడైతే సోషల్‌ మీడియా వచ్చిందో అప్పటి నుంచి అన్ని వ్యవస్థలలో జరిగే అన్యాయాలు వెంటనే వెలుగులోకి వస్తున్నాయి. ఈ మధ్య గతంలో సినిమా రంగంలో పేరు పొందిన హీరోయిన్లు తమ అనుభవాలను జంకు లేకుండా చెప్పేస్తున్నారు. అప్పటి కమిట్‌ మెంట్‌ లపై ఇప్పుడు వాస్తవాలు బైట పెడుతున్నారు. ముఖ్యంగా అప్పుటి హీరోలు ఎంత దారుణంగా ప్రవర్తించే వారో చెబుతున్నారు. వాళ్లెంత అన్యాయమైపోయారో కూడా చెప్పేస్తున్నారు. ఎలా తమ జీవితాలు ఆగమైపోయాయో! పూస గుచ్చినట్లు చెప్పేస్తున్నారు. ఆ విషయాలను కొందరు దర్శకులు కూడా నిజమే అని ఒప్పుకోవడం కూడా చూస్తున్నాం. తాను ఓ హోటల్‌ రూంలో వున్నప్పుడు, పక్కనే అదే హోటల్‌లో మరో దర్శకుడు ఐదుగురు హీరోయిన్లతో ఎంజాయ్‌ చేశాడని అన్నారు. అంటే అక్కడ ఎవరు? ఎవరిని మోసం చేశారు? అన్నది చెప్పలేం. కాకపోతే సినిమాలో నటించాలని, తెరమీద కనిపించాలన్న కోరిక బలంగా వున్నప్పుడే హీరోయిన్లుగా ముందుకొస్తారనే అపవాదు వుండనే వుంది. అయితే తెరమీద నటిగా వెలిగిపోవాలన్న లక్ష్యాన్ని హీరోలు, దర్శకులు, నిర్మాతలు వారి బలహీనతలను ఈ విధంగా ఉపయోగించుకునే వారంటేనే అసహ్యం వేస్తుంది. ఎందుకంటే ఓ ఇరవై ఏళ్ల క్రితం కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో నటి కావడం కోసం ఒక అమ్మాయి పడే తపనను ఎలా చూపించారో ప్రపంచమంతా చూసింది. నటి కావాలనుకునే వారి నటనను పక్కన పెట్టి ముందు ఆ దుర్మార్గులు తమ అవసరం తీర్చుకోవడం నిజంగానే రాక్షసత్వం. అయితే కమిట్మెంట్‌ అనేది సినిమా రంగానికే పరిమితమా? అంటే కాదు. సినిమా రంగంలో అతి ఎక్కువ. తొందరగా వెలుగులోకి వస్తుంది. అక్కడ కూడా ఓ పది శాతం మంచి వుంది. కానీ తొంభై శాతం కాస్టింగ్‌ కౌచ్‌ ముందు మంచి తనం కనిపించకుండా పోతోంది. మిగతా వ్యవస్థలలో కూడా వుంది. కానీ తక్కువ వుంటుంది. బైట పడడం తక్కువగా కనిపిస్తోంది. వ్యవస్థలో పెరిగిపోయిన జాడ్యమా? అంటే కాదు ముదిరిపోయిన రోగం. దానికి మందు లేకుండా పోయింది. సినిమా రంగంలో అవకాశాలలో అది కామన్‌. మిగతా వ్యవస్థలో అవినీతిలో ఇదొక భాగం. అన్ని రంగాలలో మహిళలు అనుభిస్తున్నదే? కానీ ఇతర వ్యవస్థలో ఇంత దుర్మార్గం వుండదు. ఎక్కడో అక్కడ భయం వుంటుంది. పరువు కూడా తప్పు చేయడానికి వెనక్కి లాగుతుంది. అన్ని వ్యవస్థలో చూసిన కనిపించకుండా వుంటుంది. ముఖ్యంగా రాజకీయాలలోకి కూడా వుందా? అనే ప్రశ్న తలెత్తుతుంది. నాయకులలో ఇలాంటి పాడు పనులు చేసే వారు చాలా తక్కువ. కానీ అవి బైటకు రావు. రాజకీయాల విషయానికి వస్తే ఇక్కడ రకరకాల కమిట్మెంట్లు వుంటాయి. అన్ని రకాలు అవసరాలు తీర్చుకుంటారు. కాకపోతే విచ్చలవిడి తనం వుండదు. అంతా గోప్యంగా జరిగిపోతుంది. ఇక చెప్పకూడని వ్యవస్థ అంటే వైద్య వృత్తి. నిజానికి పవిత్రమైన వృత్తి. గతంలో పెద్దగా ఇక్కడ నీచం వినిపించేది కాదు. కానీ ఇక్కడ కూడా విచ్చలవిడి తనం విపరీతంగా పెరిగిపోయింది. వైద్య వృత్తిలో కూడా నీచం లేకుండా వుంటుందా? అనే స్థితికి మరింత దిగజారిపోయింది. ఇక పోలీసు వ్యవస్థలో ఏమైనా తక్కువుందా? చెప్పుకోవడానికి సిగ్గు చేటు. ఇక్కడ కమిట్మెంట్‌ అంటే కంచె చేను మేయడమే. పై స్థాయిలో కొంత మెరుగు. కానీ కింది స్థాయిలో మహిళా కానిస్టేబుల్‌లను పై అధికారులతో పాటు, తోటి కానిస్టేబుల్‌లు కూడా వారిని ఎలా సంబోదిస్తారో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే? అంత దిగజారుడు బాషను వారి పట్ల అనుసరిస్తుంటారు. పై స్థాయి అధికారులు చాలా మంది మహిళా పోలీసులకు కనీస విలువ కూడా ఇవ్వరనేది జగమెరిగిన సత్యమే. మహిళా పోలీసుల ఆవేదన అక్కడ ఎవరూ వినిపించుకోరు. కనీసం అర్థం చేసుకోరు. ఎలాంటి దుర్మార్గం జరిగినా బైటకు రానివ్వరు. ఈ దుర్మార్గం విద్యా వ్యవస్థను కూడా నాశనం చేసిందనే చెప్పాలి. కాకపోతే మిగతా వ్యవస్థలన్నే విద్యా వ్యవస్థ చాలా మేలు. ప్రైవేటు కంపనీలైనా, ప్రభుత్వం ఉద్యోగులకు లైంగిక వేధింపులు తప్పడం లేదు. మహిళ అంటే సమాజంలో ఇంత చిన్న చూపని ప్రపంచానికి తెలిసినా బాగు చేద్దామన్న ఆలోచన ఎవరికీ రాదు. ఎందుకంటే వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకునేదంతా పురుష సమాజమే. విద్యావంతమైన సమాజంలో కూడా మహిళకు స్వేచ్ఛ ఇప్పటికీ లేదు. కొన్ని సార్లు మహిళల ఇష్టం లేకుండా కొన్ని జరిగిపోతాయా? అనే ప్రబుద్దులు చాలా మంది వుంటారు. సమాజంలో తాను అలా కావాలని ఏ మహిళ కోరుకోదు. ప్రతి మహిళ ఆత్మ గౌరవంతోనే బతకాలనుకుంటుంది. ఒకరి ముందు తల దించుకొని బతకాలని ఎవరూ కోరుకోరు. కానీ పురుష సమాజం వారిని వేధించి, వెంటాడి, భయపెట్టి, ఆశలు కల్పించి మహిళను తొంగే పరిస్థితులు సృష్టిస్తారు. అష్ట దిగ్భంధనం చేస్తారు. అందుకే 78 ఏళ్ల స్వాతంత్య్రం అందరికీ వచ్చినా, ఇంకా మహిళలకు అందడం లేదు. ఈ దుర్మార్గం ఎక్కువగా సినీ రంగంలోనే వేళ్లూనుకొని పోయింది. సినీ వ్యవస్థ అంతగా దిగజారిపోయింది!

జనం గొప్పగా కీర్తించే వారిలో కూడా ఈ రోగం నిలువెల్లా నిండిపోయింది. సహ నటీమణులతో నటుల పైత్యానికి పరాకాష్ట దశకు చేరుకున్నది. ఆడవాళ్లు ఎప్పటికీ ఆట బొమ్మలనే దౌర్భాగ్యంలో సినీ రంగం వుంది. గుడికెళ్తే అమ్మవారిని కొలుస్తారు? బైట ఆడవారు కనిపిస్తే కామంతో చూస్తారు?మహిళ నవ్వితే చాలు నానా పెడర్థాలు తీస్తుంటారు. కనీసం మహిళల మనసారా lo నవ్వుకునే స్వేచ్ఛను దూరం చేస్తున్నారు. Continue reading కమిట్‌ మెంట్‌ ‘కామ’నా?

జాదవ్‌ యూనివర్సిటీలో ఆధిపత్య రాజకీయాల కుంపట్లు

ఒకప్పుడు అత్యంత ప్రతిష్టాత్మక యూనివర్సిటీ

ఆధిపత్యం నిలుపుకునేందుకు వామపక్ష విద్యార్థి సంఘాల పోరు

ఎన్నికలు జరపాలంటూ విద్యాశాఖ మంత్రిపై దాడి

ర్యాంగింగ్‌, రాజకీయం, హింసలతో కునారిల్లుతున్న యూనివర్సిటీ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల్లో కోత

విద్యార్థుల విపరీత పోకడలే కారణం

నిధులు తగ్గడంలో కుంటుపడుతున్న యూనివర్సిటీ పాలన

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఒకప్పుడు దేశంలో ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు, విద్యాసంస్థలుగా పేరుపడ్డ చాలా సంస్థలు నే డు విద్యార్థి రాజకీయాల పేరుతో వివిధ రాజకీయ పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాల మధ్య కొనసాగుతున్న ఆధిపత్యపోరు హింసాత్మక సంఘటనలకు దారితీసి మొత్తంమీద విద్యార్థులకు విద్యతో పాటు రాజకీయ పరిజ్ఞానం కలిగించాలన్న అసలు లక్ష్యం పూర్తిగా దెబ్బతింటోంది.యూనివర్సిటీలు భ్రష్టుపట్టి పోవడానికి ప్రధాన కారణం ఈ విద్యార్థి రాజకీయాలు ముదిరిపోరు హింసకు దారితీయడమే. ఎంతోకష్టపడి తమ పిల్లల్ని ఉన్నతవిద్యకోసం పంపితే రాజకీయాల పేరుతో తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవడం ఆయా తల్లిదండ్రుల హృదయాలు ఎంతటి తీవ్ర మనోవేదనకు గురవుతాయో అర్థంచేసుకోవచ్చు. దేశంలో ప్రైవేటు విద్యకు ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వ విద్య అన్నిరకాలుగా భ్రష్టుపట్టిపోవడమే. హింస, ఘర్షణలు, ఆందోళనల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా యూనివర్సిటీలకు కేటాయించే నిధుల్లో కోత విధిస్తుండటంతో అక్కడి విద్యాప్రమాణాలు, మౌలిక సదుపాయాలు దారుణంగా పడిపోతున్నదన్నసత్యం వర్తమాన చరిత్ర స్పష్టం చేస్తున్నది. ఇందుకు తాజా ఉదాహరణ కోల్‌కతాలోని జాదవ్‌ యూనివర్సిటీ. ఇది ఒకప్పుడు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా పేరుండేది. కానీ ప్రస్తుతం భయంకరమైన రీతిలో ర్యాగింగ్‌, హాస్టళ్లలో బెదిరింపులు వంటివి సర్వసాధారణమైపోయాయి. ఇక్కడ సీనియర్‌ విద్యార్థులు జూనియర్లను చాలా హేయనీయమైన రీతిలో భౌతిక, మానసిక హింసకు పాల్పడుతూ ర్యాగింగ్‌లు నిర్వహిస్తారన్న ఆరోపణలున్నాయి. ఈ యూనివర్సిటీలోవామపక్ష విద్యార్థి సంఘాలదే ఆధిపత్యం. ఇటీవల ఈ యూనివర్సిటీలో వామపక్ష విద్యార్థి సం ఘాల నాయకులు, పశ్చిమబెంగాల్‌ విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు మధ్య చోటుచేసుకున్న ఘర్షణతో మళ్లీ ఈ యూనివర్సిటీ పతాకశీర్షికలకెక్కింది. విద్యాపరంగా ఒకప్పుడు అత్యున్నత ప్రమాణాలను పాటించే సంస్థగా పేరుపడ్డ ఈ యూనివర్సిటీ ప్రస్తుతం సీపీఎం, తృణమూల్‌ మరియు బీజేపీల మధ్య ఆధిపత్యపోరుకు ప్రధాన కేంద్రంగా మారడం విషాదం. 

మార్చి1వ తేదీన యూనివర్సిటీలో తృణమూల్‌ అనుబంధ సంస్థ అయిన ‘వెస్ట్‌ బెంగాల్‌ కాలేజ్‌ అండ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్స్‌ అసోసియేషన్‌ (డబ్ల్యుబీసీయుపీఏ)’ ఏర్పాటు చేసిన ఒక సదస్సుకు అధ్యక్షత వహించేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు యూనివర్సిటీకి విచ్చేశారు. సరిగ్గా ఇదే సమయంలో యూనివర్సిటీకి చెందిన వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆయనతో గొడవకు దిగారు. 2020 ఫిబ్రవరి నెలలో జరిగిన యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఎన్నికలను మళ్లీ ఎప్పుడు ప్రకటిస్తారనేది ప్రధానంగా వారు లేవనెత్తుతున్న ప్రశ్న. ఇదే అంశంపై స్పష్ట మైన సమాధానం ఇవ్వాలని వారు విద్యాశాఖ మంత్రిని డిమాండ్‌ చేయడంతో గొడవ క్రమంగా తీవ్రరూపం దాల్చి, సదస్సు ప్రదేశం, అక్కడి ఫర్నీచర్‌ విద్యార్థుల చేతుల్లో ధ్వంసమయ్యాయి. ఇదేసమయంలో ఓంప్రకాశ్‌ మిశ్రా అనే ఒక ప్రొఫెసర్‌పై దాడిచేశారు. అయితే తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన గూండాలు తమపై దాడిచేయడం, మంత్రి కారును వేగంగా నిర్లక్ష్యంగా నడపడంతో తమ సహచరులు గాయపడటం వల్లనే తాము ఎదురుదాడికి దిగామని లెఫ్ట్‌ రివల్యూషనరీ ఫ్రంట్‌ మరియు ఎస్‌ఎఫ్‌ఐ (సీపీఎం అనుబంధ సంస్థ) విద్యార్థి నాయకులు వెల్లడిరచారు. తర్వాత పోలీసులు దాడికి బాధ్యులైన విద్యార్థులపై కేసులు నమోదు చేశారు. అదేవిధంగా మార్చి 6వ తేదీన కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేర నిర్లక్ష్యంగా కారును నడిపినందుకు కారుడ్రైవర్‌ మరియు మంత్రిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే సమస్య అంతటితో సమసి పోలేదు. వామపక్ష విద్యార్థి సంఘాలు యూనివర్సిటీలో ఉద్రిక్తత పరిస్థితులను కొనసాగిస్తూ వచ్చాయి. ముఖ్యంగా మార్చి 17వ తేదీన వారు తాత్కాలిక యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ భాస్కర్‌ గుప్తా ఎన్నికలు ఎప్పుడు జరిపేదీ నిర్ణయించేందుకు తమతో చర్చలు జరపాలని డిమాండ్‌ చేయడంతో మళ్లీ యూనివర్సిటీలో హింసాత్మక వాతావరణం నెలకొంది. 

2019లో కూడా సరిగ్గా ఇటువంటి సంఘటనే జరిగింది. 2019లో కేంద్రంలో మంత్రిగా వున్న బాబుల్‌ సుప్రియో (2021లో ఆయన తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు) అఖిల భారత విద్యార్థి పరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గనడానికి వచ్చినప్పుడు కూడా ఇదే విధంగావామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపాలు రాజకీయంగా ప్రత్యర్థులు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం. ప్రస్తుతం తృణమూల్‌ మంత్రిపై జరిగిన దాడి నేపథ్యంలో, ఈ రెండు పార్టీలు వామపక్ష విద్యార్థి సంఘాల కువ్యతిరేకంగా తమ గళం విప్పడం విచిత్ర పరిణామం. ఇదే సమయంలో ఒకప్పుడు మితవాద వామపక్ష మరియు అతివాద వామపక్ష విద్యార్థి సంఘాల మధ్య కూడా తీవ్ర విభేదాలుండేవి. తాజాపరిణామాల నేపథ్యంలో ఈ రెండు వర్గాలు ఏకం కావడం మరో విచిత్ర పరిణామం. 

నిజానికి జాదవ్‌ యూనివర్సిటీకి గతంలో హింసాత్మక సంఘటనల చరిత్ర వుంది. నక్సలైట్ల ప్రభావం తీవ్రంగా వున్న 1970ల్లో అప్పటి యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ గోపాల్‌ చంద్రసేన్‌ క్యాంపస్‌లోనే దారుణహత్యకు గురయ్యారు. ఇంతటి దారుణ సంఘటనలు జరిగినప్పటికీ యూనివర్సిటీలో రీసెర్చ్‌ మరియు ఇతర అకాడమిక్‌ కార్యకలాపాలు దెబ్బతిన్న చరిత్ర లేదు. తాజా పరిణా మాల నేపథ్యంలో వామపక్ష విద్యార్థి సంఘాలు యూనివర్సిటీ ఇమేజ్‌ని దెబ్బతీయాలని చూస్తు న్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం విద్యార్థి సంఘాల ఎన్నికలు ఆలస్యమైనంత మాత్రాన ఇంతటి దారుణమైన దాడులకు హింసాత్మక చర్యలకు పాల్పడాల్సిన అవసరం ఏ మొచ్చిందని యూనివర్సిటీకి చెందిన పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే గత ఐదేళ్లుగా విద్యార్థి సంఘాలకు ఎన్నికలు జరపకపోవడం వల్ల పరిపాలన మొత్తం నిరంకుశంగా మారిందని, ప్రజాస్వామ్యం కనిపించడంలేదని వామపక్ష విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. క్యాంపస్‌లో కొనసాగుతున్న హింసాత్మక సంఘటనల నేపథ్యంలో 2017నుంచి కేంద్రం యూనివర్సిటీకి నిధులను నిలిపివేయగా, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం తన వాటా నిధులను గణనీయంగా తగ్గించింది. దీంతో యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల నిర్వహణ కష్టతరంగా మారింది. నిధుల కేటాయిం పు విషయంలో ఎవరి వాదనలు వారివే. తమ ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించడం లేదని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపిస్తుండగా, అసలు క్యాంపస్‌లో అరాచకానికి ప్రధాన కారణం ఈ సంఘాలేనని తృణమూల్‌, బీజేపీ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇదిలావుండగా కేంద్రం జాదవ్‌ యూనివర్సిటీకి ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌’ గుర్తింపును రద్దుచేసింది. ఈ స్థాయి గుర్తింపునకు అవసరమైన ప్రమాణాలను పాటించక పోవడంవల్లనే ఈ చర్య తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుకాంత ముజందార్‌వెల్లడిరచడం గమనార్హం. 

యూనివర్సిటీల్లో రాజకీయ ఆధిపత్యం పేరుతో పెరుగుతున్న హింసాత్మక సంఘటనల నేపథ్యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం, వెస్ట్‌బెంగాల్‌ యూనివర్సిటీస్‌ అండ్‌ కాలేజెస్‌ (కంపోజిషన్‌, ఫంక్షన్‌, ప్రొసీజర్‌ ఫర్‌ ఎలక్షన్స్‌ టు స్టూడెంట్స్‌ కౌన్సిల్స్‌)2017 పేరుతో ఒక చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. విద్యాసంస్థల్లో రాజకీయపార్టీల ప్రమేయం లేకుండా చేయడమే దీని ముఖ్యోద్దేశం. నిజానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన మంచి పని ఇది! ఈ చట్టం ప్రకారం విద్యాసంస్థ ల్లో రాజకీయ పార్టీల ప్రమేయం వుండకూడదు. ఎన్నికల్లో విద్యార్థి కేవలం తన పేరు మీద మా త్రమే పోటీచేయాలి. ఎన్నికల్లో పోటీచేసే విద్యార్థి సంఘాలు ఏ రాజకీయ పార్టీ బ్యానర్‌ లేదా చిహ్నాలను ప్రదర్శించడానికి వీల్లేదు. విద్యార్థి సంఘాలకు ప్రతి రెండేళ్లకోమారు ఎన్నికలు జరపాలి. అంతకుముందు ఏటా నిర్వహించేవారు. అంతేకాదు స్టూడెంట్స్‌ యూనియన్‌ పేరు స్థానంలో స్టూడెంట్స్‌ కౌన్సిల్‌ అని ప్రభుత్వం ఈ చట్టంలో పేర్కొంది. ఇక కళాశాలల్లో అయితే ప్రెసిడెం ట్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ పోస్టులకు విద్యార్థులను ప్రిన్సిపాల్‌/వైస్‌ ప్రిన్సిపాల్‌/ఇన్‌చార్జ్‌ టీచర్‌ నామినే ట్‌ చేయాలని చట్టం నిర్దేశించింది. ఇక ప్రధాన కార్యదర్శి, అసిస్టెంట్‌ సెక్రటరీలను విద్యార్థి ప్రతినిధులు ఎన్నుకుంటారు. ఈ ప్రతినిధులను ఆయా తరగతులకు చెందిన విద్యార్థులు ఎన్నుకో వాల్సి వుంటుంది. అసిస్టెంట్‌ సెక్రటరీ పోస్టులు రెండు నుంచి ఐదువరకు వుండవచ్చు. 

ఇక విశ్వవిద్యాలయాల విషయానికి వస్తే ప్రెసిడెంట్‌, వైస్‌ప్రెసిడెంట్‌ పోస్టులకు విద్యార్థులను వైస్‌ చాన్స్‌లర్‌ నామినేట్‌ చేయాలి. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి, అసిస్టెంట్‌ సెక్రటరీ పోస్టులకు,వివిధ తరగతులకు చెందిన ప్రతినిధులు ఎన్నుకుంటారు. యూనివర్సిటీ స్థాయిలో పది అసిస్టెం ట్‌ సెక్రటరీ పోస్టులు వుండవచ్చు. ఈవిధంగా విద్యార్థి నేతలు నామినేట్‌ కావడంవల్ల వీరికి ఆర్థిక వ్యవహారాలపై ప్రశ్నించడానికి ఎటువంటి హక్కులుండవు. ఈవిధంగా విద్యార్థులు యూనియన్ల పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. జాదవ్‌ యూనివర్సిటీలో ప్రస్తుతం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న గొడవలకు ఈ ఎన్నికలను గత ఐదేళ్ల కాలంగా నిర్వహించకపోవడమే ప్రధాన కారణం.

Most powerful Finance Minister Nirmala Sitaraman

· Tamil Nadu is birth place and Andhra Pradesh is mother-in-laws house

· Join in BJP in the year 2008

· Gradually step by step raised to this present level

· As second woman Finance Minister she created record

· First woman full time Finance Minister is also a record

· Balakot strikes held while she was Defence Minister

· Attained place in Forbs world powerful women list

· Under her tenure India raised to fifth world largest economy

HYDERABAD,NETIDHATHRI:

Nirmala Sitharaman (born 18 August 1959) is an Indian economist, politician and a senior leader of the Bharatiya Janata Party (BJP) serving as the Minister of Finance and Minister of Corporate Affairs of the Government of India since 2019. She is a member of the Rajya Sabha, the upper house of the Indian Parliament, representing Karnataka since 2016 and previously represented Andhra Pradesh from 2014 to 2016. Sitharaman previously served as the 28th Defence Minister from 2017 to 2019, thereby becoming India’s second female defence minister and the second female finance minister after Indira Gandhi, and the first full-time female minister to hold each of those portfolios. Sitaraman presented the union budget 8 times, making her second only to Morarji Desai to present the most number of budgets.[2] She served as junior minister in the Modi ministry between 2014 and 2017, holding successive positions, first for her dual appointment as the Minister of State in the Ministry of Finance and the Minister of State in the Ministry of Corporate Affairs from May to November 2014, and then as the Minister of State (Independent Charge) for the Ministry of Commerce and Industry from May 2014 to September 2017, before being elevated to senior posts within the Union Cabinet. 
Sitharaman featured in the Forbes 2022 list of World’s 100 most powerful women and was ranked 36. In 2023, she was ranked 32nd and in 2024, she was ranked 28th in the Forbes list of World’s 100 most powerful women. Fortune named her the most powerful woman in India. In 2025, she created history by becoming the first person to table the union budget 8 consecutive times.
Birth and Education
Nirmala Sitharaman was born in a Tamil Iyengar family in Madurai, Tamil Nadu, to Savitri and Narayanan Sitharaman. She had her schooling at Sacred Heart Convent Anglo-Indian School, Villupuram, till primary level and thereafter at Vidyodaya School in Chennai. She then studied at St. Philomena’s School and at Holy Cross School in Tiruchirappalli. Sitharaman obtained a Bachelor of Arts degree in Economics from Seethalakshmi Ramaswami College, Tiruchirapalli, in 1980, and a Master of Arts degree in Economics and M.Phil. From Jawaharlal Nehru University, Delhi, in 1984.  She then enrolled in a Ph.D. program in Economics with a focus on Indo-European trade but later left this program and moved to London when her husband secured a scholarship at the London School of Economics because of which she was unable to complete her degree.
Political career in BJP
Nirmala Sitharaman served as a member of the National Commission for Women from 2003 to 2005. Nirmala Sitharaman joined BJP in 2008. She was a national spokesperson of the party till 2014. In 2014, she was inducted into Narendra Modi’s cabinet as a junior minister and was elected in June of that year as a Rajya Sabha Member from Andhra Pradesh. In May 2016, she was one of the 12 candidates nominated by the BJP to contest the Rajya Sabha elections due on 11 June. She successfully contested her seat from Karnataka. She has served as the Defence Minister of India and headed the Balakot Air Strike carried out by the Indian Air Force in 2019. She is currently serving as the Minister of Finance and Corporate affairs of India and has presented five annual budgets of India (as of 2023).
Union Defence Minister
Sitharaman as the Union Minister of Defence in New Delhi, 7 September 2017Sitharaman pictured during her tenure as Union Minister of Defence, January 2018
On 3 September 2017, she was appointed as Minister of Defence, being only the second woman after Indira Gandhi to hold the post, but the first full-time female defence minister. Under her tenure, the army conducted the Balakot airstrike in retaliation to the 2019 Pulwama attack. The Indian army claimed that the operation had killed at least 170 JeM terrorists.
Union Finance Minister
Nirmala Sitharaman being given the customary Curd and Sugar by President Droupadi Murmu before Union Budget presentation on, 1 February 2025. On 31 May 2019, Nirmala Sitharaman was appointed as the finance and corporate affairs minister. She is India’s first full-time female finance minister. She presented her maiden budget in the Indian parliament on 5 July 2019. Sitharaman presented the Union Budget 2020–21 on 1 February 2020. During the COVID-19 pandemic in India she was made in-charge of the COVID-19 Economic Response Task Force. Under her tenure as the finance minister in 2022, India became the Fifth largest Economy in the world, and the GDP of the country was said to have seen massive growth positively with historical context. In February 2024, she presented the Union budget for the record 6th time and matched it with Morarji Desai. She also became the first minister to present the budget in the New Parliament building of India. She was given the same cabinet posts after the Indian general election in June 2024.
Prior to politics
Nirmala Sitharaman worked as a salesperson at Habitat, a home decor store in London’s Regent Street. She has served as an assistant to Economist in the Agricultural Engineers Association in the UK. During her stay in the UK, she has also served as a Senior Manager (R&D) for PWC and briefly at the BBC World Service. She has also served as a member of National Commission for Women. In 2017, she was one of the founding directors of Pranava in Hyderabad.
Awards
The Jawaharlal Nehru University conferred her, the Distinguished Alumni Award in 2019. Forbes Magazine has ranked her 34th among the 100 most powerful women in the world in 2019. Nirmala Sitharaman, Union Finance Minister wins the Business Reformer of the year award at The Economic Times Awards for Corporate Excellence 2021. In 2023, ranked at number 32, Sitharaman has made it to the list of Forbes Magazine’s 100 most powerful women in the world for the fifth time in a row. In 2022, the minister was ranked at number 36 in the list, while she was in the 37th spot in 2021 and 41st in 2020 respectively.
Personal life
Sitharaman met her husband, economist and commentator Parakala Prabhakar, who is from Narsapuram, Andhra Pradesh, while studying at the Jawaharlal Nehru University. While Nirmala leaned towards the BJP, her husband is from a Congress family. They married in 1986, and have a daughter who previously worked for The Hindu and the Mint. Prabhakar served as the communications advisor to the Government of Andhra Pradesh from 2014 to 2018.

సమర్థతకు మారుపేరు నిర్మలా సీతారామన్‌

తమిళనాడు పుట్టిల్లు, ఆంధ్రప్రదేశ్‌ మెట్టినిల్లు

2008లో బీజేపీలో చేరిక

అంచెలంచెలుగా కొనసాగిన ప్రగతి ప్రస్థానం

రెండో మహిళా ఆర్థికమంత్రిగా రికార్డు

పూర్తిస్థాయి తొలి మహిళా ఆర్థిక మంత్రిగా రికార్డు

ఈమె రక్షణమంత్రిగా ఉన్నకాలంలోనే బాలాకోట్‌ దాడులు

ఫోర్బ్స్‌ శక్తివంతమైన మహిళల జాబితాలో స్థానం

ఈమె హయాంలోనే ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరణ

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

నిర్మలా సీతారామన్‌ మనదేశానికి చెందిన ఆర్థికవేత్త, ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్‌వ్యవహారాలశాఖ మంత్రిగా 2019నుంచి పనిచేస్తున్నారు. 1959 ఆగస్టు 18న జన్మించిన ఈమె ప్రస్తుతం భారతీయ జనతాపార్టీలో ముఖ్య నాయకురాలిగా వున్నారు. ఆమె కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు 2016నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014`16 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి ఆమె రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగారు. 2017`19 మధ్యకాలంలో దేశానికి 28వ రక్షణశాఖ మంత్రిగా పనిచేశారు. ఇందిరాగాంధీ తర్వాత రక్షణశాఖను మరియు ఆర్థికశాఖను నిర్వహించిన రెండో మహిళగా గుర్తింపు పొందారు. అంతేకాదు ఈ రెండు మంత్రిత్వశాఖను పూర్తిస్థాయిలో నిర్వహించిన తొలిమహిళ కూడా సీతారామన్‌ కావడం విశేషం. దివంగత మాజీ ప్రధాని మురార్జీదేశాయ్‌ తర్వాత అత్యధికసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఘనత కూడా ఈమెదే. మొత్తం ఎనిమిదిసార్లు నిర్మలమ్మ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2014`17 మధ్యకాలంలో ఆమె మోదీ ప్రభుత్వంలో జూనియర్‌ మంత్రిగా పనిచేశారు. 2014 మే నుంచి నవంబర్‌ మధ్యకాలంలో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయమంత్రిగా రెండు బాధ్యతలను నిర్వహించారు. 2014 నవంబర్‌ నుంచి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా (స్వతంత్ర) 2017 సెప్టెంబర్‌ వరకు పనిచేశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గంలో సీనియర్‌ మంత్రిగా ప్రమోట్‌ అయ్యారు.

ఫోర్బ్స్‌ జాబితాలో స్థానం

ఫోర్బ్స్‌ా2022 ప్రపంచంలో శక్తివంతమైన వందమంది మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్‌ చోటు సంపాదదించుకున్నారు. ఈ జాబితాలో ఆమెది 36వ స్థానం. ఇదే సంస్థ విడుదల 2023లో విడుదల చేసిన జాబితాలో 32వ స్థానం, 2024 ఫోర్బ్స్‌ జాబితాలో 28వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఫార్చూన్‌ సంస్థ భారత్‌కు చెందిన అత్యంత శక్తివంతమైన మహిళగా ఆమెను పే ర్కొంది. 2025లో కేంద్ర బడ్జెట్‌ను 8వ సారి ప్రవేశపెట్టిన తర్వాత ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు.

జన్మస్థలం మదురై

సీతారామన్‌ తమిళనాడులోని మదురైలో అయ్యంగార్ల కుటుంబంలో జన్మించారు. సావిత్రి, నారాయణన్‌ సీతారామన్‌లు ఈమె తల్లిదండ్రులు. విల్లుపురంలోని సేక్రెడ్‌ హార్ట్‌ కాన్వెంట్‌ ఆంగ్లో`ఇండియన్‌ స్కూల్‌ లో ఆమె తన ప్రాథమిక పాఠశాల విద్యను కొనసాగించారు. అనంతరం చెన్నై లోని విద్యోదయ పాఠశాలలో చదువుకున్నారు. 1980లో ఆమె తిరుచురాపల్లిలోని సీతాలక్ష్మి రామేశ్వరి కళాశాలలో ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి, ఢల్లీిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో ఇదే విభాగంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, ఎం.ఫిల్‌ పూర్తిచేశారు. ఇండో`యూరో పియన్‌ ట్రేడ్‌పై రీసెర్చ్‌ చేసేందుకు ఇదే విద్యాసంస్థలో తన పేరును నమోదు చేసుకున్నప్పటికీ, ఈ ప్రోగ్రామ్‌ను మధ్యలో ఆపేసి తన భర్తకు లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో స్కాలర్‌షిప్‌ రావడంతో లండన్‌ వెళ్లిపోయారు. 

రాజకీయ జీవితం

2003-05 మధ్యకాలంలో నిర్మలా సీతారామన్‌ జాతీయ మహిళా కమిషన్‌లో సభ్యురాలిగా పనిచేశారు. తర్వాత 2008లో భారతీయ జనతాపార్టీలో చేరారు. అప్పటినుంచి 2014 వరకు పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. 2014లో ఆమెను మోదీ ప్రభుత్వంలో జూనియర్‌ మం త్రిగా తీసుకున్నారు. ఇందుకోసం ఆమెకు ఆంధ్రప్రదేశ్‌నుంచి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇప్పించారు. 2016లో రాజ్యసభకు పోటీచేయడానికి పార్టీ నామినేట్‌ చేసిన 12మంది సభ్యుల్లో నిర్మలా సీతారామన్‌ కూడా ఒకరు. ఈ ఎన్నికల్లో కర్ణాటక నుంచి ఆమె విజయం సాధించారు. 2019లో బాలాకోట్‌ దాడులు జరిగినప్పుడు ఆమె రక్షణశాఖ మంత్రిగా వ్యవహరించారు. పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ దాడి జరిపింది. ఈ దాడిలో 170మంది జైషే మహమ్మ ద్‌ సంస్థకు చెందిన ఉగ్రవాదులను చంపేసినట్టు సైన్యం ప్రకటించింది.

2019 మే 19న నిర్మలమ్మ కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగా పదవీ బా ధ్యతలు స్వీకరించారు. దేశంలో మొట్టమొదటి పూర్తిస్థాయి తొలి మహిళా ఆర్థికమంత్రిగా చరిత్రసృష్టించారు. ఆమె మధ్యంతర బడ్జెట్‌ను 2019 జులై నెలలో ప్రవేశపెట్టారు. 2020`21కి సం బంధించిన తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న లోక్‌సభ ముందుంచారు. కోవిడ్‌`19 మ హమ్మారి కాలంలో ‘కోవిడ్‌`19 ఎకనామిక్‌ రీసెర్చ్‌ టాస్క్‌ ఫోర్స్‌’ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. ఆమె ఆర్థికశాఖ మంత్రిగా వున్న 2022లో భారత్‌ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడమే కాదు దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) చాలా వేగంగా పెరిగింది. పార్లమెంట్‌ నూతన భవనంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థిక మంత్రి కూడా నిర్మలా సీతా రామనే!

లండన్‌లో ఉద్యోగాలు

తాను లండన్‌లో వున్నకాలంలో రీజెంట్‌ స్ట్రీట్‌లోని ఒక హోమ్‌ డెకార్‌ స్టోర్‌లో సేల్స్‌పర్సన్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టారు. యు.కె. అగ్రికల్చర్‌ ఇంజీనీర్స్‌ అసోసియేషన్‌కు చెందిన ఒక ఆర్థికవేత్తకు అసిస్టెంట్‌గా వున్నారు. అక్కడే పి.డబ్ల్యు.సి.కి సీనియర్‌ మేనేజర్‌ (ఆర్‌Êడి)గా, బీబీసీ వరల్డ్‌ సర్వీస్‌లో కొద్దికాలం పనిచేశారు. 

2017లో మనదేశ జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా వుండటమే కాదు హైదరాబాద్‌లోని ‘ప్రణవ’కు వ్యవస్థాపక డైరెక్టర్లలో ఆమె కూడా ఒకరు. 2019లో జవహర్‌లాల్‌ నెహ్రూ యూని వర్సిటీ ఆమెకు డిస్టింగ్విష్‌డ్‌ అలుమిని అవార్డును ప్రదానం చేసింది. 2019లో ఫోర్బ్స్‌ మ్యాగజై న్‌ ప్రకటించిన ప్రపంచంలో వందమంది శక్తివంతమైన మహిళల జాబితాలో ఈమెకు 34వ స్థానం దక్కింది. ఎకనామిక్‌ టైమ్స్‌ ఇచ్చే కార్పొరేట్‌ అవార్డ్స్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌కు ఆమె 2024లో ఎంపికయ్యారు. ఆర్థిక మంత్రిగా ఆమె వాణిజ్య సంస్కరణ వేత్తగా ఈ అవార్డు ద్వారా గుర్తింపు లభించింది. 

నిర్మలా సీతారామన్‌ భర్త పరకాల ప్రభాకర్‌ కూడా మంచి ఆర్థికవేత్త మాత్రమే కాదు గొప్ప రాజకీయ వ్యాఖ్యాత కూడా. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో ఇద్దరు ఒకరికొకరు పరిచయమై చివరకు వివాహానికి దారితీసింది. నిర్మలా సీతారామన్‌ బీజేపీలో చేరగా పరకాల ప్రభాకర్‌ కుటుంబం కాంగ్రెస్‌ అనుయాయులు. వీరిది ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం. వీరిద్దరూ 1986లో వివాహం చేసుకోగా, ఈ దంపతులకు ఒక కుమార్తె. ఆమె కొంతకాలం హిందూలో తర్వాత మింట్‌లో పనిచేశా రు. 2014`18 వరకు పరకాల ప్రభాకర్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సమాచార సలహాదారుగా వ్యవహరించారు.

ఉగాది కే ఇందిరమ్మ ఇండ్లు

`ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని మంత్రి ‘‘పొంగులేటి’’ పట్టుదలతో ఉన్నారు

`ఉగాది నాటికి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు తయారు చేస్తున్నారు

`మంత్రి ‘‘శ్రీనివాస్‌ రెడ్డి’’ గట్టిగా ఇందిరమ్మ ఇండ్ల కోసం కృషి చేస్తున్నారు

`అనుకున్న మేరుకు నాలుగేళ్లలో 20 లక్షలు ఇస్తే కాంగ్రెస్‌కు ఎదురుండదు

`మరో పదేళ్లు కాంగ్రెస్‌ పాలనను జనం వదులుకోరు

`పదేళ్ల కల తీరితే బిఆర్‌ఎస్‌ గురించే ప్రజలు ఆలోచించరు

`గత ప్రభుత్వం పదేళ్లలలో డబుల్‌ బెడ్‌ రూంలు ఇచ్చింది లేదు

`ఇస్తామని చెప్పి రెండు సార్లు బిఆర్‌ఎస్‌ మోసం చేసింది

`అందుకే ప్రజలు బిఆర్‌ఎస్‌ ను ఓడిరచింది

`కాంగ్రెస్‌ మీద ప్రజలకు అపారమైన నమ్మకం వుంది

`గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన అనుభవం కాంగ్రెస్‌కు వుంది

`పదేళ్ల పాటు అడిగిన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్‌ ఇచ్చింది

`బిఆర్‌ఎస్‌ ఇస్తామని చెప్పి, పదేళ్లు మోసం చేసింది

`ఆ ప్రభావం బిఆర్‌ఎస్‌ మీద పడడం జరిగింది

`కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే చాలు తిరుగులేని శక్తిగా మారుతుంది

`కూడు, గూడు కల్పిస్తే ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు

`అక్కడక్కడా నిర్మాణాలు చేసి బిఆర్‌ఎస్‌ ఓట్లు పొందింది

`ఆ నిర్మాణాలను చూపించారే గాని బిఆర్‌ఎస్‌ ఇచ్చింది లేదు

`అప్పుటి నుంచి పేదలు ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు

`ప్రజా ప్రభుత్వం మీద పేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు

`నాలుగేళ్లలో ఇచ్చిన మాట ప్రకారం ఇండ్లు ఇస్తే కాంగ్రెస్‌ కు తిరుగుండదు

`తెలంగాణ లో ఇతర పార్టీలకు ఆదరణ వుండదు

`ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే కారు వైపు కన్నెత్తి కూడా చూడరు?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సొంతింటి కల నెరవేరే సమయం వచ్చేసింది. ఉగాదికి ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను పేదలకు అందించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చట్టనుంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తుచేస్తోంది. గత ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ప్రజలకు హమీ ఇచ్చింది. ఆ హమీ అమలు దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి గత కొంత కాలంగా ఈ కార్యక్రమం అమలు మీద ప్రత్యేక దృష్టిపెట్టారు. ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా సుమారు 20లక్షల ఇండ్లు ఈ నాలుగేళ్లకాలంలో పేదలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అందులో ఈ ఏడాది మొదటి విడుతగా సుమారు 5లక్షల ఇండ్లకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తున్నారు. ఉగాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పట్టుదలతో వున్నారు. అందుకు అవసరమైన ఇండ్ల పంట్టాలను యుద్ద ప్రాతిపదికన తయారు చేస్తున్నారు. ఉగాదికి ఎంతో అట్టహాసంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మంత్రి శ్రీనివాస్‌ రెడ్డి చొరవతో అధికారులు కూడా చకచకా ఆ పనులు పూర్తి చేస్తున్నారు. అనుకున్న మేరకు ఈ ఏడాది ఎట్టిపరిస్ధితుల్లో 5లక్షల ఇండ్లు పేదలకు పంచి వారి కళ్లలలో ఆనందం చూడాలనుకుంటున్నారు. వారికి ఇచ్చిన హమీని మొదటి దఫాలోనే నెరవేర్చి వారి ఆశలను నెరవేరేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎక్కడా రాజీ లేకుండా అర్హులందిరకీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం దిగ్విజయంగా సాగేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీమీద ప్రజలకు అంచెంచలమైన విశ్వాసం. పదేళ్లుగా పేదలు ఇందిరమ్మ ఇండ్లకోసం ఎదురుచూస్తున్నారు. 2005 నుంచి 2014 వరకు 25లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. రేవంత్‌ సర్కారు నాలుగేళ్లలో 20 లక్షల ఇండ్లు ఇస్తామంటోంది. నాలుగేళ్లలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే కాంగ్రెస్‌కు తిరుగుండదు. తెలంగాణలో ఇతర పార్టీలు రాజకీయమే వుండదు. రేవంత్‌ సర్కారు నాలుగేళ్లలో 20లక్షల ఇండ్లు నిర్మాణం చేయనున్నది. ఈ ఏడాది సుమారు 5లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే 5లక్షల ఇండ్లు నిర్మాణమైతే కాంగ్రెస్‌కు తిరుగుండదు. పల్లెల్లో ఇతర పార్టీల జెండాలే కనిపించవు. ప్రతి వ్యక్తికి సొంత ఇల్లు కల. ఆ కలను ఆది నుంచి నెవరేస్తున్న పార్టీ, ప్రభుత్వం కాంగ్రెస్‌. ఇందిరా గాంధీ హాయాం నుంచి మొదలు, 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలకు ఇండ్లు కట్టించి ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుంది. ముఖ్యంగా ఇందిరాగాంధీ ప్రధానిగా వున్న సమయంలో పెద్దఎత్తున ఎస్సీ, ఎస్టీలకు పక్కా గృహాలు, వ్యవసాయ భూములు, వాటితోపాటు తెట్టెతో నిర్మాణం చేసిన బావులు తవ్వించి, పేదలను ఆర్ధికంగా ఉన్నత స్దితికి తీసుకొచ్చారు. ఒకప్పుడు ఎస్సీ, ఎస్టీలకు సాగు భూములు వుండేవి కాదు. దాంతో ఎస్సీలకు ప్రభుత్వ భూములను అందించారు. ఆ భూములను సాగు యోగ్యం చేసేందుకు సహకారమందించారు. సాగు నీటికి అవసరమైన బావులను పెద్దఎత్తున తవ్వించి ఇచ్చారు. ఇప్పటికీ తెలంగాణలో ప్రతి గ్రామంలో వ్యవసాయ భూముల వద్ద రాతి కట్టడంతో కూడాని తెట్టె నిర్మాణం చేసిన బావులే ఎక్కువగా కనిపిస్తాయి. తర్వాత బిసిలకు బలహీన వర్గాల గృహ సముదాయాల పేరుతో పెద్దఎత్తున ఇండ్ల నిర్మాణాలు చేపట్టింది కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వాలే. 2004 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను పెద్దఎత్తున పేదలకు అందజేసింది. ఉమ్మడిరాష్ట్రంలో సుమారు 45లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేశారు. అప్పుడు ఎస్సీ, ఎస్సీ, బిసి , ఓసి అని తేడాలు లేకుండా ఇండ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీది. తెలంగాణలో ఆ పదేళ్ల కాలంలో సుమారు 25లక్షలు పైగా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. తెలంగాణలో ఏ పల్లెకు వెళ్లినా ఇందిరమ్మ ఇండ్లు కనీసం 500 వరకు వుంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లపధకం ద్వారా తెలంగాణ మొత్తం సుమారు 25 లక్షల మంది పేదలు ఇండ్లు నిర్మాణం చేసి ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను ప్రజలకు అందించేందుకు బృహత్తర ప్రణాళిలను రచిస్తోంది. తెలంగాణలో ఇల్లు లేదన్న పేద వారు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. గతంలో ఇల్లు కావాలన్న ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి ఇచ్చారు. అవి ఇప్పుడు పల్లెల్లో మరో గ్రామంగా, పట్టణాలలో పెద్ద పెద్ద కాలనీగా అవతరించాయి. అంత గొప్పగా ఆ పధకాన్ని అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వాలది. తెలంగాణ వచ్చిన తర్వాత రెండు పడకల గదులు ఇండ్ల నిర్మాణం పేరు చెప్పి ప్రజలను వంచించిన ఘనత బిఆర్‌ఎస్‌ది. కాంగ్రెస్‌ పార్టీ అప్పట్లో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లను ఎద్దేవా చేస్తూ వాటిని అగ్గిపెట్టెలంటూ హేళన చేసి బిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది. ఇందిరమ్మ ఇండ్ల స్ధానంలో ప్రతి ఒక్కరికీ డబుల్‌ బెడ్‌ ఇంటిని నిర్మించి ఇస్తామని హమీ ఇచ్చి కేసిఆర్‌ అధికారంలోకి వచ్చాడు. ఒకటి కాదు, రెండుసార్లు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఏ ఒక్క తెలంగాణ పల్లెలో ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేయలేదు. పేదలకు ఇవ్వలేదు. అందుకే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ ను గెలిపించారు. ఒక్కసారి కాంగ్రెస్‌ పార్టీ మాట ఇస్తే తప్పదని ప్రజలకు తెలుసు. అందుకే ముఖ్యమంత్రిరేవంత్‌రెడ్డిని ప్రజలు బలంగా విశ్వసించారు. ఆయన నాయకత్వాన్ని గెలిపించారు. అధికారంలోకి తీసుకొచ్చారు. అందుకే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హమీ మేరకు ఐదేళ్ల కాలంలో కనీసం 20లక్షల ఇందిరమ్మ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు నిర్మాణం చేసి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. ఏటా కనీసం 5లక్షల ఇండ్లు నిర్మాణం చేసి ఇవ్వనున్నారు. అందుకు అవసరమైననిధులను కూడా బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. త్వరలోనే ఇందిరమ్మ నిర్మాణం మొదలు కానున్నది. ప్రజా ప్రభుత్వ విజయోత్సవాలలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మొదలు పెడతామని హమీ ఇచ్చారు. ఆ ప్రజా విజయోత్సవాలలో ఇండ్ల ధరఖాస్తులుకూడా ప్రజల నుంచి స్వీకరిం చారు. వాటి ఆధారంగా ఎంపిక ప్రక్రియలు పూర్తి చేస్తున్నారు. పల్లెల్లో గాని,పట్ణణాలలో గాని స్ధలం వున్న వారికి రూ.5లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. స్థలాలు లేని వారికి ప్రభుత్వ స్ధలాలను గుర్తించి, ఇండ్ల పట్టాలిచ్చి, ఇందిరమ్మ ఇండ్లునిర్మాణం చేసిఇస్తారు. ఇటీవల జరిగిన సమగ్ర సర్వేతో ఆ వివరాలు వెల్లడి కానున్నాయి. దాంతో తెలంగాణ లో ఎంత మందికి ఇండ్లు అవసరపడతాయో తెలుతుంది. అయితే ఇప్పటికే ఈ ఆర్ధిక సంవత్సరానికి గాను సుమారు 5లక్షల ఇండ్లు నిర్మాణం చేసి ఇవ్వడానికి ప్రణాళికలు కూడా సిద్దమయ్యాయి. దానిపై ప్రభుత్వం ఇప్పటికే ఓ ప్రకటన కూడా చేసింది. ముందుగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు పైలెట్‌ ప్రాజెక్టు కింద మంజూరు చేశారు. ఇలా దశల వారిగా ప్రతి నియోజకవర్గంలో ఏటా 3500 ఇండ్లు నిర్మాణంచేసి ఇస్తారు. పట్టణాలలో అర్హులైన వారికి తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి ఇస్తారు. అందుకు అసవరమైన మోడళ్లను కూడా ప్రభుత్వం ప్రకటించింది. దానికి అనుగుణంగా ప్రభుత్వమే పూర్తిగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి పేదలకు పంచే కార్యక్రమం మొదలు కాకున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలోపు సుమారు 450000 ఇండ్లు పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్దంగా వుంది. ప్రజా ప్రభుత్వ విజయోత్సవాలలో దానికి అంకురార్పన జరగుతోంది. తెలంగాణలో మళ్లీ ఇందిరమ్మ ఇండ్ల కోసం లక్షలాది ధరఖాస్తులు వచ్చాయి. ఈసారి కూడ ఏడాదికి సుమారు 5లక్షల ఇండ్లు నిర్మాణం చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఇలా ఈ నాలుగేళ్ల కాలంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే వచ్చే ఇవరై ఏళ్ల వరకు తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి తిరుగుండదు. కాంగ్రెస్‌ను కాదని ఏ ఇతర పార్టీని ప్రజలు ఆదరించరు.

Strong foreign policy… pride for the country

· Self reliance in defence sector

· Neighbours first policy

· Preference for South East Asian Nations with Act East Policy

· Strengthened relations with USA

· Best friend for Putin

· “This is not a war of era” is the indication of Modi to Putin.

· Became best friend to Donald Trump

· Excellent talent in balancing relations with super powers

· Defence sector is now reached to the stage of exports

· Charismatic leader who attract leaders of world

HYDERABAD,NETIDHATHRI:

Foreign policy played a small role in Modi’s election campaign and did not feature prominently in the BJP’s election manifesto. He mainly concentrated on National and regional issued in his campaign. Modi’s foreign policy, similarly to that of the preceding Congress government, focused on improving economic ties, security and regional relations. Really speaking the roots of Narendra Modi foreign policy lies in the foreign policy introduced by then Congress Prime Minister P.V. Narasimha Rao who is the son of Telangana soil. He introduced new outlook in foreign policy naming it as ‘Look East Policy’, which followed by Atal Bihari Vajpayee who came to power after him. The same policy continued by Manmohan Singh Government succeeded Vajpayee. That policy is being now followed by Naredra Modi after coming to power in 2014 by renaming it as ‘Act East Policy’. Modi under his new slogans ‘Make in India’ and ‘Digital India’ has been inviting foreign direct investments into various sectors including defense and Railways. In this regard he is giving utmost priority to South-East-Asian Nations and East Asian Nations. He knows well the business with the countries of these regions will boost the economy of India. This was first recognized by P.V. Narasimha Rao who sown seeds for the economic development of the country. The government also tried to improve relations with Islamic nations in the Middle East, such as Bahrain, Iran, Saudi Arabia and the United Arab Emirates, as well as with Israel. 

Relations with USA

India’s relationship with the United States improved after Narendra Modi became PM. During the run-up to the general election, there was wide-ranging skepticism about future of the strategic bilateral relationship under Modi’s premiership; in 2005, while Chief Minister of Gujarat, Modi was denied a US visa during the presidency of George W. Bush in the back drop of Godra violence. The intentional miss information regarding this incident was the main cause for this denial. Sensing Modi’s victory well before the election, US Ambassador to India Nancy Powell contacted Modi as part of greater rapprochement from the West. Following Modi’s 2014 appointment as India’s PM, President Obama congratulated him over the telephone and invited Modi to visit the US. The Modi government enjoyed a positive relationship with the US during the presidencies of Barack Obama and his successor Donald Trump.

During the first few months after his appointment as PM, Modi visited a number of countries in support of his policy, and attended the BRICS, ASEAN and G20 summits. One of Modi’s first visits as PM was to Nepal, during which he promised one billion US dollars in aid. Modi also made several visits to the US; this was described as an unexpected development because of the US’s earlier denial of a US travel visa to Modi over his role in the 2002 Gujarat riots. The visits were expected to strengthen diplomatic and trade relations between the two countries.

Land agreement with Bangladesh

In 2015, the Indian parliament ratified a land-exchange deal with Bangladesh in the India–Bangladesh enclaves, which the government of Manmohan Singh had initiated. Modi’s administration brought renewed attention to India’s “Look East Policy”, which was instituted in 1991. The government signed agreements to improve land connectivity with Myanmar through the Indian state of Manipur; this represented a break with India’s historic engagement with Myanmar, which prioritised border security over trade. China–India relations rapidly deteriorated following the 2020 China–India skirmishes. Modi pledged aid of $900 million to Afghanistan, which he visited twice and was honoured with Afghanistan’s highest civilian honour in 2016. In September 2022, Modi appeared to have developed a strong personal relationship with Russia’s President Vladimir Putin.

India as president of G20 nations

India hosted the 2023 G20 New Delhi summit, during which the African Union joined the G20 as a permanent member. In an interview on 26 August 2023, Prime Minister Modi expressed optimism about the G20 countries’ evolving agenda under India’s presidency, shifting toward a human-centric development approach that aligns with the concerns of the Global South, including addressing climate change, debt restructuring through the G20’s Common Framework for Debt, and a strategy for regulation of global crypto currencies.

Raise in military spending

India’s nominal military spending steadily increased under Modi. Under Modi, India launched military modernisation initiative aimed at strengthening defence preparedness and streamlining defence acquisition.[405] Modi launched new policies under the “Aatmanirbhar Bharat” campaign, promoting indigenous defence manufacturing with policies to procure key weapon systems domestically. The government has implemented several of the recommendations from the Shekatkar Committee to streamline defence procurement and rationalise spending. Efforts have been made to establish Integrated Theatre Commands (ITCs) to enhance jointness among the services.

Skirmishes with China

In May 2020, Chinese and Indian troops engaged in aggressive skirmishes along the Sino-Indian border, including near the disputed Pangong Lake, Ladakh, and the Tibet Autonomous Region and near the border between Sikkim and the Tibet Autonomous Region. Additional clashes took place in eastern Ladakh along the Line of Actual Control (LAC). In 2020, skirmishes between the nations led to many border clashes, responses and reactions from both sides. A series of talks between India and China were held, using military and diplomatic means for peace. The first border clash reported in 2021 was on 20 January; this was referred to as a minor border clash in Sikkim. 

Relations with Russia

In December 2021, Modi signed an agreement with Russian President Vladimir Putin to extend military technical cooperation. The Modi government bought the S-400 missile system, an anti-missile striking system, strengthening the relationship between the two nations. India refused to condemn the 2022 Russian invasion of Ukraine and stayed neutral. The Indian government’s Operation Ganga initiative sought to return Indians stranded in Ukraine during the war. More than 19,000 Indian nationals were evacuated, including some from neighbouring countries.

Charismatic leader

Modi is a vegetarian and teetotaller, who has a frugal lifestyle, and is a workaholic and has been described as an introvert. On 31 August 2012, he posted on Google Hangouts, becoming the first Indian politician to interact with citizens on a live chat. Modi has been called a fashion icon for his signature crisply ironed, half-sleeved kurta, and for a suit with his name repeatedly embroidered in the pinstripes, which he wore during a state visit by US President Barack Obama, which drew public and media attention, and criticism. Scholars and biographers have described Modi’s personality as energetic, eccentric and charismatic. Modi created image among Indian politicians as a leader who has capable enough to take difficult decisions in critical conditions. 

Biopic on Modi

Modi Kaka Ka Gaon, a 2017 Indian Hindi-language drama film by Tushar Amrish Goel, is the first biopic about Modi. PM Narendra Modi, a 2019 Hindi-language biographical drama film by Omung Kumar which covers Modi’s rise to the premiership. 7 RCR (7, Race Course Road), a 2014 Indian docudrama political television series which charts the political careers of prominent Indian politicians, covered Modi’s rise to the PM’s office in the episodes “Story of Narendra Modi from 1950 to 2001”. Modi appeared in an episode of Discovery Channel’s show Man vs. Wild with the host Bear Grylls in July 2019, becoming the second world leader after Barack Obama to appear in the reality show. Modi hosts Mann Ki Baat, a monthly radio programme on All India Radio, and has conducted the competition Pariksha Pe Charcha, and discussions for students and the issues they face in examinations.

Modi as writer

In 2008, Modi published a Gujarati book titled Jyotipunj, which contains profiles of RSS leaders. After becoming the Prime Minister he also authored a book called Exam Warriors, a guide for children to commendably face exams.

పటిష్ట విదేశంగ విధానంతో పెరిగిన దేశప్రతిష్ట

రక్షణ రంగంలో స్వావలంబనం

పొరుగుదేశాలకే మొదటి ప్రాధాన్యత

 యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ ద్వారా తూర్పు, ఆగ్నేయాసి దేశాల సంబంధాలకు ప్రాధాన్యం

 అమెరికాతో సంబంధాలు బలోపేతం

 పుతిన్‌కు అత్యంత సన్నిహిత మిత్రుడిగా మోదీ

 ‘ఇది యుద్ధాల కాలం కాదు’ అని పుతిన్‌కు చెప్పిన దమ్మున్న నాయకుడు మోదీ

 డోనాల్డ్‌ ట్రంప్‌కు మంచి మిత్రుడిగా మోదీ

 అగ్రరాజ్యాలను మనేజ్‌ చేయడంలో అసమాన ప్రతిభ

 దిగుమతుల స్థాయి నుంచి ఎగుమతుల స్థాయికి రక్షణరంగం వృద్ధి

 ప్రత్యేక ఆహార్యంతో ప్రపంచ నాయకులను ఆకర్షించే ఛరిష్మా నాయకుడు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారాల్లో ఎప్పుడూ తాను అనుసరించబోయే విదేశాంగ విధానంపై పెద్దగా చెప్పిందేమీ లేదు. ఎక్కువగా దేశీయ, రాష్ట్రీయ అంశాలపై విపక్షాలపై విమర్శల దాడులకే పరిమితమయ్యారు. నిజం చెప్పాలంటే ప్రస్తుతం నరేంద్రమోదీ అనుసరిస్తున్న విదే శాంగ విధానానికి మూలాలు నాటి కాంగ్రెస్‌ ప్రధాని పి.వి.నరసింహారావు అనుసరించిన విదేశాంగ విధానంలో ఉన్నాయి. ఆయన అనుసరించిన పొరుగుదేశాలకు ప్రాధాన్యత, లుక్‌ ఈస్ట్‌ పాలసీని, తర్వాత ప్రధాన పదవిని చేపట్టిన అటల్‌ బిహారీ వాజ్‌పేయి అనుసరించారు. తర్వాత మన్మోహన్‌ ప్రభుత్వం కూడా అదే మార్గంలో నడిచింది. దాన్నే ఇప్పుడు నరేంద్రమోడీ కొనసాగిస్తున్నారు. కాకపోతే పి.వి. ప్రతిపాదించిన ‘లుక్‌ ఈస్ట్‌’ పాలసీని ‘యాక్ట్‌ ఈస్ట్‌’ పాలసీగా మార్చి మోదీ అమలు చేస్తున్నారు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’, ‘డిజిటల్‌ ఇండియా’ నినా దాలతో భారత ఆర్థిక వ్యవస్థలోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగం గా ఆయన ప్రధమ ప్రాధాన్యత ఆగ్నేయాసియా దేశాలకు అత్యధిక ప్రాధాన్యత నివ్వడం, తూర్పు మరియు ఆగ్నేయాసియా దేశాలతో నెరపే వాణిజ్యం దేశానికి ఎంతో లాభసాటిగా వుంటుందన్న సత్యాన్ని గుర్తించడమే. దీన్ని మొట్ట మొదట గుర్తించింది తెలంగాణ బిడ్డ పి.వి. నరసింహారావు. కాగా మోదీ ప్రభుత్వం ఇస్లామిక్‌ దేశాలకు కూడా సన్నిహితం కావడానికి యత్నించి సఫలీకృతమైంది. బహ్రైన్‌, ఇరాన్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వంటి మధ్యప్రాచ్య దేశాలతో నేడు మన సంబంధాలు ఎంతో పటిష్టంగా కొనసాగుతున్నాయంటేమన విదేశాంగ విధానంలోని పటిష్టతే కారణం. ఇదే సమయంలో మనకు ఇజ్రాయిల్‌ అ త్యంత ఆప్తమిత్ర దేశం. 

అమెరికాతో సంబంధాలు బలోపేతం

నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక అమెరికాతో మన సంబంధాలు మరింత బలోపేతమయ్యా యి. 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా…ఒకవేళ మోదీ ప్రధాని అయితే యు.ఎస్‌.తో మన సంబంధాలు ఎట్లా వుంటాయోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే మోదీగుజరాత్‌ ముఖ్యమంత్రిగా వున్న కాలంలో నాటి యు.ఎస్‌. అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌ ప్రభుత్వం మోదీకి వీసా నిరాకరించింది. ఈ అనుమానాలకు ప్రధాన కారణమిది. అయితే ఎన్నికల ప్రచారం ఊపందుకునేకొద్దీ గెలుపు పవనాలు మోదీకి అనుకూలంగా వున్న సంగతిని పసిగట్టిననాటి అమెరికా రాయబారి నాన్సీ పావెల్‌, ప్రధాని అభ్యర్థిగా వున్న నరేంద్ర మోదీని స్నేహ పూర్వకంగా కలిశారు. తర్వాత అప్పటి యు.ఎస్‌. అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఎన్డీఏ కూట మి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్‌ చేసి మాట్లాడమే కాకుండా యు.ఎస్‌.కు ఆహ్వానించారు. తప్పుడు ప్రచారాలను నమ్మి వీసా నిరాకరించిన యు.ఎస్‌. తనకు తానే వీసా రద్దును ఎత్తివేసి మోదీలోని నిలువెత్తు నిజాయతీకి నిదర్శనం. తర్వాత అధికారంలోకి వచ్చిన డోనాల్డ్‌ ట్రంప్‌తో కూడా నరేంద్ర మోదీ బలమైన స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తున్నారు. 

తొలిసారి ప్రధాని అయ్యాక దేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానాలకు అనుగుణంగా బ్రిక్స్‌,ఆసియన్‌, జి`20 సదస్సులకు హాజరయ్యారు. తొలిసారి ప్రధాని పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటగా ఆయన సందర్శించిన దేశం నేపాల్‌. ఈ సందర్భంగా నేపాల్‌కు ఒక బిలి యన్‌ డాలర్ల సహాయం అందించేందుకు హామీ ఇచ్చారు. తర్వాతి కాలంలో నరేంద్రమోదీ అమెరికాలో చాలాసార్లు పర్యటించి ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు కృషిచేశారు. భారత్‌`బాంగ్లాదేశ్‌ ఎన్‌క్లేవ్స్‌ (వీటినే చిత్‌మహల్స్‌ లేదా పాషా ఎన్‌క్లేవ్స్‌ అనికూడా పిలుస్తారు) ఒప్పందానికి 2015లో భారత పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం మన్మోహన్‌ సింగ్‌ హయాంలో జరిగింది. మణిపూర్‌ రాష్ట్రం గుండా మయన్మార్‌కుభూ అనుసంధానతకు వీలు కల్పించే ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేయడంతో ఈ విషయంలో ఎన్నోఏళ్లుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడిరది. 2020లో గాల్వాన్‌ సంఘటన తర్వాత భారత్‌`చైనా సంబంధాలు బాగా క్షీణించాయి. ఆఫ్ఘనిస్తాన్‌కు 900 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆఫ్ఘనిస్తాన్‌ను రెండుసార్లు సందర్శించారు. అక్కడి ప్రభుత్వం ప్రధానికి ఆదేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. 2022 నాటికి ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్‌ పుతిన్‌లు మంచి మిత్రులుగా మారిపో యారు. 2023లో జీ`20 సదస్సుకు భారత్‌ ఆతిథ్యం ఇచ్చింది. ఈ సందర్భంగా ఆఫ్రికన్‌ యూనియన్‌ దేశాలు జీ`20లో శాశ్వత సభ్యత్వాన్ని పొందాయి. మోదీ నేతృత్వంలో భారత్‌ గ్లోబల్‌ సౌత్‌ నాయకురాలిగా ఎదగడమే కాదు, ఈ ప్రాంత దేశాల వాణిని వినిపించడం మొదలుపెట్టింది. 

రక్షణరంగంలో స్వయం సమృద్ధి

మోదీహయాంలో మనదేశ రక్షణరంగంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకునే రెండో దేశంగా కొనసాగుతున్న ప్పటికీ, ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధన యత్నాలు మొదలై చివరకు చాలా వరకు సఫలీకృతం కావడమే కాకుండా, రక్షణ రంగ ఉత్పత్తును విదేశాలకు ఎగుమతి చేసేస్థాయికి ఎదగడం గొప్ప పరిణామంగా చెప్పవచ్చు. మోదే ప్రవేశపెట్టిన ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ పుణ్యమానిరక్షణరంగ పరికరాల తయారీలో భారత్‌ గణనీయమైన ప్రగతి సాధించింది. షెకత్కార్‌ కమిటీ సిఫారసులను కచ్చితంగా అమలు చేయడం ద్వారా మోదీ ప్రభుత్వం రక్షణరంగాన్ని ఎప్పటికప్పుడు ఆధునికీకరణ, స్వయం సమృద్ధి సాధన దిశగా మన రక్షణ రంగాన్ని ముందుకు నడిపింది. ముఖ్యంగా మోదీ అధికారంలోకి వచ్చాక పాకిస్తాన్‌తో మన వ్యవహారశైలి పూర్తిగామారిపోయింది. ఉగ్రవాద దేశానికి ఎప్పటికప్పుడు బుద్ధి చెప్పే విధానాన్ని మోదీ ప్రభుత్వం అనుసరిస్తోంది. 2020లో గాల్వన్‌ లోయ సంఘర్షణ తర్వాత, 2021 జనవరిలోకూడా భారత్‌`చైనా దళాల మధ్య సంఘర్షణ చోటుచేసుకుంది. చైనా దళాలను మన జవాన్లు తరిమికొట్టిన వీడియోలు కూడా సామాజిక మధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఇదిలావుండగా 2021లో భారత్‌`రష్యాల మధ్య సాంకేతిక, రక్షణ సహకార ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా ఎస్‌`400 క్షిపణి వ్యవస్థను రష్యానుంచి మనదేశం కొనుగోలు చేసింది. రష్యా`యుక్రెయిన్‌ యుద్ధంలో మనదేశం తటస్థ వైఖరి కొనసాగించింది. శాంతియుత చర్చల ద్వా రానే పరిష్కారాన్ని సాధించగలమని హితవు పలికింది. ‘ఇది యుద్ధాల కాలం కాదు’ అని పుతిన్‌కు చెప్పగలిగిన ప్రపంచంలో ఏకైక నాయకుడు నరేంద్ర మోదీ. ఆయన పుతిన్‌తో అన్న ఈ మాటలు బహుళ ప్రచారం పొందాయి. రష్యా`యుక్రెయిన్‌ యుద్ధ సమయంలో ఆపరేషన్‌ గంగ పేరుతో యుక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను మోదీ ప్రభుత్వం మనదేశానికి విజయవంతంగా తరలించింది. ఈ సందర్భంగా దాదాపు 19వేల మంది భారతీ యులను అక్కడినుంచి మన ప్రభుత్వం ఖాళీ చేయించింది. విశేషమేంటంటే ఇతరదేశాలకు చెందిన విద్యార్థులను కూడా మనదేశం ఈ ఆపరేషన్‌లో తరలించింది. 

మోదీ ఇమేజ్‌

నరేంద్ర మోదీ పూర్తి శాఖాహారి. ఆల్కహాల్‌ వంటి పానీయాలకు దూరం. ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా, పూర్తి సమయం పనిలో నిమగ్నమయ్యే మనస్తత్వం కలిగిన నిబద్ధ నాయకుడు నరేంద్రమోదీ. 2012, ఆగస్టు 31న నరేంద్ర మోదీ మొట్టమొదటిసారి గూగుల్‌ హ్యాంగవుట్‌లో పౌరులతో లైవ్‌చాట్‌లో పాల్గన్నారు. ఈవిధంగా ఇందులో పాల్గన్న మొట్టమొదటి భారత రాజకీయ నాయకుడు నరేంద్రమోదీ. మోదీ ఆహార్యం కూడా ప్రత్యేకమే. ఆయన తనవస్త్రధారణ ద్వారా ప్రత్యేకంగా కనిపించడానికి యత్నిస్తుంటారు. యు.ఎస్‌. అధ్యక్షుడు బరాకఒబామాను కలిసినప్పుడు హాఫ్‌ స్లీవ్డ్‌ కుర్తా ధరించి తన ప్రత్యేక ఆహార్యంతో ప్రజలను, మీడియాను అమితంగా ఆకర్షించారు. చురుకైన, అసాధారణ, లెక్కచేయని మనస్తత్వ మరియు అత్యద్భుత ఛరిష్మా కలిగిన నాయకుడిగా, మేధావులు మోదీని పరిగణిస్తారు. సంక్లిష్ట నిర్ణయా లు తీసుకోగల సామర్థ్యం కలిగిన రాజనీతిజ్ఞుడిగా వర్తమాన భారత రాజకీయాల్లో మోదీ తనస్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఈ సామర్థ్యం కారణంగానే దేశాన్ని ఆర్థిక, రక్షణ రంగాల్లో మరింత పురోగామి దిశగా తీసుకెళ్లగలుగుతున్నారన్నది దేశ ప్రజల్లో అత్యధికుల అభిప్రాయం. ఇదే ఆయన తరగని ఛరిష్మాకు కారణం.

మోదీపై బయోపిక్‌లు

మోదీపై 2017లో ‘మోదీ కాకా కా గాన్‌’ పేరుతో తుషార్‌ అమృత్‌ గోయల్‌ తొలి బయోపిక్‌ నిర్మించారు. 2019లో ఒమంగ్‌ కుమార్‌ ‘ప్రధాని నరేంద్ర మోదీ’ పేరుతో హిందీ చిత్రాన్నినిర్మించారు. ‘మోదీ: ఎ జర్నీ ఆఫ్‌ కామన్‌ మ్యన్‌’ పేరుతో ఒక వెబ్‌సిరీస్‌ 2019 మే నెలలో విడుదలైంది. 2014లో 7 ఆర్‌సీఆర్‌ (7 రేస్‌కోర్స్‌ రోడ్‌) పేరుతో విడుదలైన ‘డాక్యు డ్రామా’లో ప్రముఖ భారతీయ రాజకీయవేత్తల గురించి వివరించారు. ఇందులో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యేవరకు ఆయన ప్రస్థానాన్ని చక్కగా చూపించారు. 

మోదీ ప్రధానిగా ఎన్నో విదేశీ అవార్డులను, అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు.ఇన్ని అవార్డులను, పురస్కారాలను మరే ఇతర భారత నేత అందుకోలేదంటే అతిశయోక్తి కాదు. 2008లో నరేంద్ర మోదీ ‘జ్యోతిపుంజ్‌’ పేరుతో గుజరాతీ భాషలో ఒక పుస్తకాన్ని ప్రచు రించారు. ఇందులో ప్రముఖ ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుల గురించిన వివరాలున్నాయి. ప్రధాని అయ్యాక ‘ఎగ్జామ్‌ వారియర్స్‌’ పేరుతో పుస్తకాన్ని రచించారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే పిల్లలకు ఇది మార్గదర్శకం.

‘‘నీతి ఇంటి పేరు’’.. ‘‘నిప్పు ఆమె పని తీరు’’.

`స్మిత సబర్వాల్‌ మీద చిల్లర వార్తలా!

`ఉద్యోగ నిర్వహణలో అవినీతి పదం లేని ఏకైక అధికారి

`అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనం

`చిత్తశుద్ధిలో కర్తవ్యం నింపుకున్న ఆదర్శం

`ఐఏఎస్‌గా ఇప్పటి వరకు అవినీతి మరక అంటని అధికారి

`వేల కోట్ల రూపాయల తెలంగాణ అభివృద్ధి పనులను నిర్వహించారు

`డైనమిక్‌ ఆఫీసర్‌గా గుర్తింపు

`కారు కిరాయల కోసం ఆలోచించేంత చిన్న అధికారా?

`తెలంగాణ అభివృద్ధి కోసం పాటు పడిన అధికారి

`పదేళ్ల తెలంగాణ పరుగులో ఆమె పాత్ర ఎంతో కీలకమైనది

`తెలంగాణ ఉద్యమ కుటుంబాల కోసం కన్నీరు కార్చిన తల్లి స్మిత

`తెలంగాణ ఉద్యమ కారుల కుటుంబాలకు సత్కారం చేసిన ఏకైక అధికారి స్మిత సబర్వాల్‌

`తెలంగాణ అంటే ఆమెకు అంత మక్కువ

`ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్‌కు రావడంలో ఆమె పాత్ర గొప్పది

`తెలంగాణ ఇంటింటికీ సురక్షిత మంచినీరు ఆమె పర్యవేక్షణలోనే

`మూడేళ్లలో మిషన్‌ భగీరథ పూర్తి చేసిన ఘనతలో ఆమెదే

`తెలంగాణ సురక్షితమైన మంచినీటిని తాగుతున్నారంటే ఆమె చలవే!

`మూడేళ్లలో మంచినీరు అందించాలని ఆదేశిస్తే నిజం చేసి చూపించిన అధికారి

`తెలంగాణ సాగు రంగం కళకళలాడేలా చేశారు

`మహిళా అధికారి అయినా సిఎంవోలో 14 శాఖలు పర్యవేక్షించేవారు

`తెలంగాణ అభివృద్ధి కోసం పదేళ్ల పాటు అహర్నిశలు పనిచేశారు

`ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క ఓటమి కూడా లేదు

`పని చేసిన ప్రతి శాఖకు వన్నె తెచ్చారు

`ప్రజలకు సేవలందించారు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

నీతిని దహించలేరు..ఈ పదాలు అక్షరాల రాష్ట్ర టూరిజమ్‌ శాఖ ప్రిన్సిపల్‌ కమీషనర్‌ స్మిత సబర్వాల్‌కు అన్వయించొచ్చు. తెలంగాణ రాష్ట్రం విషయంలో ఆమె ఒక బ్రాండ్‌. అవినీతి మరకలు ఇంత వరకు అంటని ఒక ఉన్నతాధికారి. పైగా తెలంగాణ అంటే ఎంతో మమకారం వున్న ఐఏఎస్‌ అదికారి. అంతటి ఆత్మను నింపుకున్న స్మిత సబర్వాల్‌ మీద ఎలాగైనా అవినీతి ముద్ర వేయాలని కొందరు అనుకోవచ్చు. కాని అది సాధ్యమయ్యే పని కాదు. కింది స్దాయి ఉద్యోగులే కొందరు పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతుంటే, ఇప్పటి వరకు ప్రభుత్వ సొమ్ము తిన్నట్లు ఒక్క ఆరోపణ కూడా ఆమె మీద లేదు. ఇకపై వుండకపోవచ్చు. అవినీతి అదికారుల మీద వార్తలు రాయడం ఎంత ముఖ్యమో! నీతి వంతంగా పనిచేసే స్మిత సబర్వాల్‌ లాంటి ఉన్నతాధికారి చేసే మంచిపనులను ప్రపంచానికి చెప్పడానికి వార్తలు రాయాలి. ఆమెను ఆదర్శంగా తీసుకొని వచ్చే తరాలు పనిచేసేలా వార్తలుండాలి. అంతే కాని లేనిపోని ఆరోపణలు సాగించే వార్తలు తెలంగాణ సమాజానికే మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడున్న ఉద్యోగ సమాజంలో నీతివంతంగా వుండడం కూడా ఇబ్బందికరమే అవుతోంది. అలాంటి వ్యవస్ధలో తనకంటూ ఒక ఇమేజ్‌ను సంపాదించుకున్న అధికారి స్మితా సబర్వాల్‌. అలాంటి అదికారి కేవలం కారు రెంటు కోసం కక్కుర్తి పడ్డట్టు ఆరోపణలు రావడం కూడా దురదృష్టకరం. నిజంగా ఇన్‌వెస్టిగేషన్‌ జర్నలిజం చేయాలనుకున్నప్పుడు ఆమె నిర్వహించిన శాఖల్లో ఏదైనా అవినీతి జరిగితే వెతికిపట్టుకోవాలి. అంతే కాని గాలి వార్తలు పట్టుకొని వార్తలు రాయడం వల్ల ఆమె ఇమేజ్‌ ఇసుమంతైనా తగ్గుతుందనుకోవడం పొరపాటు. గత ప్రభుత్వంలో పదేళ్ల కాలంలో ఆమె నిర్వహించిన పాత్ర ఎంతో గొప్పది. తెలంగాణ పదేళ్లలో పరుగులు పెడుతుందంటే పాలకుల పాత్ర ఎంత వుంటుందో..అదికారుల పాత్ర కూడా అంతే వుంటుంది. అదికారులు తమ పాత్ర నిర్వహణలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరవు. ఈ సంగతి కూడా జర్నలిస్టు సమాజానికి తెలిసి వుండాలి. ఆమె గత ఇరవై ఏళ్ల కాలంలో పోషించిన పాత్ర ఎంతో విలువైంది. ముఖ్యంగా గత పదేళ్లకాలంలో ఆమె సేవలు తెలంగాణ చరిత్ర వున్నంత కాలం వుంటాయి. వచ్చే ఉద్యోగ తరాలు పాఠాలుగా చెప్పుకుంటారు. నీతికి ఆమె ఎంత నిదర్శనంగా వున్నారో తెలుసుకుంటారు. అయినా ఆమె గత పదేళ్లకాలంలో సుమారు 14శాఖలను సమర్ధవంతగా నిర్వహించారు. సహజంగా ఒకటి రెండు శాఖల నిర్వహణే ఎంతో కష్టం. అలాంటిది ఆమె ఇన్ని శాఖలపై పట్టు సాధించడమంటే ఆశమాషీ కాదు. నేను ఉద్యోగం చేస్తున్నాను..అని మాత్రమే ఒక ఐఏఎస్‌ అధికారి అనుకుంటే ప్రభుత్వం ఏ పని చేయలేదు. అందువల్ల ఏ ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరాలన్నా ఐఏఎస్‌ అధికారుల పాత్ర ఎంతో కీలకం. ప్రభుత్వం ఇచ్చే హామీల అమలులో అధికారుల పాత్రపైనే వాటి అమలు ఆధారపడి వుంటుంది. మరీ ముఖ్యంగా స్మిత సబర్వాల్‌ లాంటి అధికారులు ప్రతి రాష్ట్ర ప్రభుత్వంలో ఓ పది మంది వుంటే చాలు. ఆ ప్రభుత్వం సాధించలేని లక్ష్యాలు అంటూ వుండవు. గత ప్రభుత్వంలో అందుకే ఆమెకు అంత ప్రాధాన్యత కల్పించింది. ముఖ్యంగా ఆమెలో తెలంగాణ వాసి కాదు. తెలంగాణ క్యాడర్‌కుచెందిన అధికారి కాదు. అయినా ఆమె తనలో తెలంగాణ ఆత్మను నింపుకున్నారు. ఆమె పనితీరుపై మెదక్‌ జిల్లాలో జరిగిన ఒక్క సంఘటన చాలు. తెలంగాణ వచ్చిన సమయంలో ఆమె మెదక్‌ జిల్లా కలెక్టర్‌గా వున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన తొలి స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆమె ఉద్యమ కారుల కుటుంబాలను సత్కరించిన తీరు అప్పటి ప్రభుత్వాన్ని కూడా కదలించింది. అమరుల కుటుంబాలకు చెందిన తల్లులను పిలిపించి వారికి చీర సారెలు పెట్టి, వారి కన్నీటిని తూడ్చింది. ఆ తల్లులు కలెక్టర్‌ అనే ఆలోచన లేకుండా ఆమెను పట్టుకొని ఏడుస్తుంటే, ఆమె కూడా కన్నీటి పర్యంతమైపోయిన సందర్భం తెలంగాణ వాదుల కళ్లల్లో ఎప్పటికీ చెరిగిపోదు. అంతగా ఆమె తెలంగాన ఉద్యమ గొప్పదనాన్ని కూడా ఆమె గుండెల్లో నింపుకున్నారు. అందుకే ఆమె తెలంగాణ అభివృద్ది కోసం పదేళ్లపాటు పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ఆ ఒక్క సంఘటన చూసి చలించిపోయిన అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆమెను వెంటనే సిఎంఓలో ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. పదేళ్ల కాలంలో ఆమె చేత అనేక అభివృ ద్దిపనుల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ ప్రతి ఇంటికి మంచినీటిని అందించే మిషన్‌ భగీరథ కార్యక్రమం మూడేళ్లలో పూర్తయ్యిందంటే అందుకు ప్రధాన కారణం స్మిత సబర్వాల్‌. ప్రభుత్వాలకు లక్ష్యాలుంటాయి. ఆ లక్ష్యాలను తీర్చడంలో అధికారుల పాత్ర కూడా ఎంతో కీలకం. ప్రభుత్వాలు ఎంత పట్టుబట్టి తమ లక్ష్యాల సాధనకోసం అధికారులను పరుగులుపెట్టించినా కాని పనులు అనేకం వున్నాయి. కాని ప్రభుత్వం ఇచ్చిన నిర్ణీత కాలంలో మిషన్‌భగీరధ పూర్తి చేసి, తెలంగాణలో ప్రతి ఇంటింటికీ సరుక్షితమైన మంచినీరు అందించడం జరిగింది. అంటే ఆమె కృషి ఎంత గొప్పదో, ఆమె ఎంత కష్టపడితే ఆ గడువులో ఆ పధకంపూర్తయ్యిందో అర్దం చేసుకోవచ్చు. ఆమె మీద వున్న నమ్మకంతోనే అప్పటి ప్రభుత్వ పెద్దలు ఇంటింటికీ మంచినీరు అందించకపోతే ఓట్లు అడగమంటూ ఛాలెంజ్‌ చేశారు. స్మిత సబర్వాల్‌ పనితీరుకు ఈ ఒక్క విజయం చెప్పడానికి చాలు. ఇలా ఆమె సాధించిన విజయాలు అనేకం వున్నాయి. అందుకే ఆమెకు అంతటి ప్రాధాన్యత దక్కింది. ఇక కారు కిరాయి గురించి మాట్లాడాల్సి వస్తే, తెలంగాణలో మండల స్ధాయి అధికారులకు కూడా ప్రభుత్వం కారు వినియోగం అనుమతిచ్చింది. ప్రభుత్వం అందరికీ వాహనాలను సమకూర్చలేకపోవడంతో, వారి సొంత కార్లను కూడా హైర్‌ చేసుకోవచ్చని చెప్పారు. లేదా ఇతర ప్రైవేటు వాహనాలను కూడా హైర్‌ చేసుకునే వీలు కల్పించింది. అందుకు ఎల్లో ప్లేట్‌ వాహనమే వుండాలన్న నిబంధనపై కూడా అనేక వాదనలున్నాయి. ఇక పోతే మండల స్ధాయి అధికారులకే నెల నెల అలవెన్సులు ఇస్తున్నారు. అలాంటిది ప్రభుత్వంలో కీలకభూమిక పోషించే ఐఏఎస్‌ అధికారులకు వెహికిల్‌ సదుపాయం వుంటుందన్న కనీస సోయి లేకుండా ఆమె మీద ఆరోపణలు రావడం విచారకరం. అయినా ఆమె కారు కిరాయిలు ఎలా ఇవ్వాలి? ఎందుకివ్వాలన్నది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయం. ఆమె తన కారును కిరాయికి పెట్టి ఆ చిన్న ఆదాయం కోసం ఆశపడే అవకాశం వుంటుందా? నిజంగా ఆమె అవినీతి చేయాలనుకుంటే ఇప్పటి వరకు కొన్ని వందల కోట్లు సంపాదించేవారు. కొన్నివేల కోట్ల రూపాయల పనులు ఆమె సంతాకాలతో సాగేవి. ఆమె పర్యవేక్షణలో జరిగినవి. ఆమె ఒక్క మాటంటే మిషన్‌ భగీరధ కాంట్రాక్టర్లే కోట్లు కుమ్మరించేవారు. కాని ఏ ఒక్క నాడు ఆమెపై ఒక్క విమర్శ కూడ రాలేదు. ఏ ఒక్క కాంట్రాక్టర్‌ ఆప్‌ ద రికార్డు కూడా ఒక్క మాట చెప్పింది లేదు. రాజకీయాల కోసం కొన్ని విమర్శలు చేశారు. కాని అవి నిజం కాదని వారికి కూడా తెలుసు. ఇక్కడ ఆమె పర్యవేక్షణలో జరిగిన అధ్భుతం కూడా చెప్పుకోవాలి. తెలంగాణకే కాదు, దేశానికే తలమానికమైన కాళేశ్వరం వంటి ప్రాజెక్టు పనులను ఆమె పర్యవేక్షించిన తీరు అందరి ప్రశంసలు అందుకున్నది. అయితే ఆమె కాళేశ్వరం పనుల నిర్వహణలో మాత్రమే పాలు పంచుకున్నారు. కాని ఇమె ఇరిగేషన్‌ శాఖ కార్యదర్శిగా పని చేయలేదు. ఆమె కేవలం కొన్ని రోజుల పాటు మాత్రమే అది కూడా గత రెండేళ్ల క్రితం మాత్రమే పనిచేశారు. స్మితా సబర్వాల్‌ మీద అవినీతి ఆరోపణలు చేయడానికి ఎక్కడా వీలు పడలేదు. ఆమెపై ఆరోపణలు చేయడానికి కుదరలేదు. అందువల్ల ఈ చిన్న విషయాన్ని పట్టుకొని ఆమెపై అవినీతి బుదరచల్లాలని చూస్తున్నారు. అంతే కాని ఆమె నిజాయితీ ఏమిటో మీడియాలో వున్న వారందకీ తెలుసు. అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక్క అన్నం మెతుకు చాలు. స్మిత సబర్వాల్‌ ఎంతటి గొప్ప అదికారో చెప్పడానికి మిషన్‌భగీరథ ఒక్కటి చాలు. అయితే ప్రసుతం ఆమె రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శిగా బాద్యతలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రపంచ సుందరి అందాల పోటీలు నిర్వంచనున్నారు. ఆ పోటీలు హైదరాబాద్‌కు తేవడంతో స్మితా సబర్వాల్‌ పాత్ర ఎక్కువ. అంటే ఆమె తెలంగాణ కోసం పడుతున్న శ్రమ, తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు కోసం చేస్తున్న కృషి తెలిస్తే చాలు. ఎలాంటి చిల్లర వార్తలు రాయడానికి ఇక ఇష్టపడరు.

ఏ భూమికైనా ఎన్వోసిలిచ్చే జమ్మికుంట ఎమ్మార్వో?

`లక్షలు కొట్టు..ఎన్‌వోసిలు పట్టు!

`విశ్వేశ్వర స్వామికే శఠగోపం!

`జమ్మికుంటలో దేవుని మాన్యానికే దిక్కులేదు.

`జమ్మికుంట ఎమ్మార్వో మాయ జాలం.

`కబ్జాదారులకు అండగా ఎమ్మార్వో నిర్వాకం

`ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన ఎమ్మార్వో!

`ఎమ్మార్వో వ్యవహారంపై సిసిఎల్‌లో పిర్యాదు.

`కోర్టు ఆదేశాలను దిక్కరిస్తూ ‘‘ఎన్‌వోసి’’ల జారీ వైనం.

`‘‘ఎన్‌వోసి’’ల అంశంపై సమాచారం లేదంటున్న ఆర్డీవో.

`వివరాలు పంపమంటూ నేటిధాత్రి తో ఆర్డీవో.

`అన్నీ తెలిసినా తెలియదంటున్న ఆర్డీవోపై జనం ఆగ్రహం.

`దేవాలయ భూములు ఆక్రమణ జరగడం లేదంటున్న ఆయల ఈవో.

`ఎన్‌వోసిల జారీ సమాచారం లేదంటూ దాటవేత.

`గుడి స్థలంలో నిర్మాణాలెలా సాగుతున్నాయంటే నీళ్లు నములుతున్న ఈవో.

`నాలుగు రోజులు కొలువు చేసుకొని వెళ్లే వాడినంటూ ఈవో నిట్టూర్పు.

`జమ్మికుంటలో హట్‌ కేకులాంటి భూములను కట్‌ చేసి పంచుకుంటున్నారు.

`రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు సహకరిస్తున్నారు.

`స్మశాన స్థలాలను కూడా వదలడం లేదు.

`ఎమ్మార్వో ఎన్వోసిలిచ్చాక మేమేం చేయాలంటున్న రిజిస్ట్రేషన్‌ అధికారులు.

`అందరూ కలిసి విశ్వేశ్వర స్వామికి నిలువ నీడ లేకుండా చేస్తున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

అక్రమాలు చేయాలనుకుంటే ఆధికారులకు అడ్డేముందనడానికి జమ్మికుంట దేవుని మాన్యం భూముల వ్యవహారమే నిదర్శనం. దేవాలయానికి చెందిన భూములలో పాగా వేసిన కొంతమందికి జమ్మికుంట ఎమ్మార్వో ఆశీస్సులు అందిస్తున్నారు. ఆ భూముల లోని స్థలాలపై కన్నేసిన వారికి ఎమ్మార్వో రమేశ్‌ దర్జాగా ఎన్వోసిలు రాసిచ్చేస్తున్నారు. ఇప్పటికే వందల మందికి అలా ఎన్వోసీలు జారీ చేశారు. లక్షలు కొట్టు..ఎన్‌వోసిలు పట్టు! అన్నట్లు దేవాలయ భూమిలో పాగా వేయాలనుకుంటున్న వారికి టోకు లెక్కన ఎమ్మార్వో ఎన్వోసిలు జారీ చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడి విచిత్రమని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అంతా గప్‌ చుప్‌గా ఎమ్మార్వో వ్యవహారం సాగిస్తున్నారు. జమ్మికుంట పట్టణంలో ఆ భూముల విలువ అమాంతం పెరిగిపోతుంది. లక్షలు ఎమ్మార్వో చేతిలో పెడితే చాలు కోట్ల రూపాయల విలువైన భూమి దక్కుతుందనే ఆశతో ఎన్వోసిలు తెచ్చుకుంటున్నారు. రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. నిర్మాణాలు యధేచ్చగా కొనసాగిస్తున్నారు. రాత్రికి రాత్రే నిర్మాణాలు జరిగిపోతూనే వున్నాయి. అయినా పట్టించుకునే వారు లేకుండా పోతున్నారు. సదరు భూములకు సంబంధించిన పిర్యాదులు కోర్టు పరిధిలో వున్నాయి. డబ్లుసి.నెం. 11178/12 కేసు కోర్టులో పెండిరగ్‌లో వుంది. అయినా ఎమ్మార్వో యదేచ్చగా కోర్టు దిక్కరణకు పాల్పడుతున్నాడు. ఇదే కాకుండా దేవాదాయ శాఖ జిల్లా కోర్టు సెక్షన్‌.22 %A% ప్రకారం ఆ భూముల క్రయ విక్రయాలకు ఆస్కారం లేదంటూ తీర్పు కూడా ఇచ్చింది. దోచుకోవడానికి దొడ్డి దారులెంచుకునే వారు వుంటారు. ఆ భూములను ఆనుకొని అవే సర్వే నెంబర్లలలో మరో 30 ఎకరాల ప్రభుత్వ స్థలం వుంది. దానిని రియల్‌ వ్యాపారులు ఎప్పుడో మింగేశారు. ప్లాట్లు చేసి అమ్మేసుకున్నారు. మూడు నాలుగు అంతస్తుల ఇండ్లు కూడా కట్టుకున్న వాళ్లున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు ఆదేశాలున్నాయి. వాటిని అమలు చేయని రెవెన్యూ అధికారులు మిగిలిన భూమిని కూడా కాజేస్తున్న వారికి సహకరిస్తున్నారు. ఆక్రమణ దారులతో కలిసి రెవెన్యూ అధికారులు పహానీలే మార్చినట్లు ఆధారాలు కూడా వున్నాయి. ఈ విషయంపై కొంతమంది పోరాటం చేస్తున్నా ప్రస్తుత ఎమ్మార్వో పట్టించుకోవడం లేదు. పైగా కబ్జాదారులకు సహరిస్తున్నారు. దాంతో ఎమ్మార్వో నిర్వాకంపై జమ్మికుంటకు చెందిన కొందరు సిసిఎల్‌ హైదరాబాదు లో పిర్యాదు చేశారు. జారీ చేసిన ఎన్వోసిలను సమర్పించారు. అంతే కాకుండా గతంలో వున్న పహాణీలను, ఇప్పుడు మార్చిన పహాణీలను సిసిఎల్‌కు సమర్పించారు. అంటే అధికారులు తలుచుకుంటే గ్రామ, పట్టణ నక్షలను కూడా ఎలా తారుమారు చేయగలరో తెలుసుకోవచ్చు. మొత్తానికి గుడి మాన్యాన్ని మింగే వారు విశ్వేశ్వర స్వామికే శఠగోపం! పెట్టేస్తున్నారు. జమ్మికుంటలో దేవుని మాన్యానికే దిక్కులేకుండా చేస్తున్నారు. ఈ భూముల గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలు ముందు చెప్పుకోవాలి. జమ్మికుంటలో వున్న సర్వేశ్వర స్వామి ఆలయానికి కొండూరి వంశస్థులు 1939లో సర్వే నెం. 661, 662, 663 లలో 3 ఎకరాల 3 గుంటలు మాణ్యం కింద ఇచ్చారు. అదే జమ్మికుంటలో దేవుని కోసం 420, 421, 422 సర్వే నెంబర్లలో 5 ఎకరాల 37 గుంటలిచ్చారు. అప్పటి నుంచి ఆ భూమి దేవుని మాన్యంగా వుంది. ఎప్పుడైతే భూముల ధరలు పెరగడం, జమ్మికుంట పట్టణం విస్తరించడం మొదలైందో అప్పటి నుంచి ఆ భూముల మీద కొంత మంది కన్ను పడిరది. అయితే పై సర్వే నెంబర్లలోనే మరో 30 ఎకరాల 12 గుంటల భూమి వుంది. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది నాయకుల కన్ను ఆ భూముల మీద పడిరది. అప్పటి నుంచి ఆక్రమణ పర్వం కొనసాగుతూనే వుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత ఎమ్మార్వో మాజా జాలంపై సర్వత్రా విమర్శల వెల్లువెత్తుతున్నాయి. కబ్జాదారులకు అండగా ఎమ్మార్వో సాగిస్తున్న నిర్వాకంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన కుర్చీలో కూర్చున్న ఎమ్మార్వో ఇలా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటున్న వారికి సహకరించడంపై పెద్ద ఎత్తున నిరసనలు కూడా జరుగుతున్నాయి. అయినా ఎమ్మార్వో వ్యవహారంలో మార్పు రావడం లేదు. దాంతో జమ్మికుంటకు చెందిన కొంత మంది ఎమ్మార్వో నిర్వాకంపై సిసిఎల్‌లో పిర్యాదు చేయడం జరిగింది. కోర్టు ఆదేశాలను యధేచ్చగా దిక్కరిస్తూ ఎన్‌వోసిలు ఎలా జారీ చేస్తున్నారో ఆధారాలు సమర్పించడం జరిగింది. ఎన్‌వోసిల అంశం పై స్థాయి అధికారులకు సమాచారం వున్నప్పటికీ వాళ్లు కూడా మౌనం వహిస్తున్నారు. ఏకంగా తమకు సమాచారం లేదంటున్నారు. జరుగుతున్న తంతు గురించి నేటిధాత్రి ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే వివరాలు పంపమంటూ నేటిధాత్రిని ఆర్డీవో కోరడం విచిత్రంగా వుంది. కానీ అన్నీ తెలిసినా తెలియదంటున్న ఆర్డీవోపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వివరాలు ఆర్డీవోకు తెలుసంటూ ప్రజలు చెబుతున్నారు. ఎవరి వాటా వాళ్లు పంచుకుంటూ తమకేమీ తెలియదన్నట్లు నటిస్తున్నట్లు అర్థమౌతోంది. ఇక ఇదిలా వుంటే సర్వేశ్వర స్వామి ఆలయ ఈవో మాటలు మరో విధంగా వున్నారు. పైగా ఆయన నోటి నుంచి నిట్టూర్పు మాటలు వినబడుతున్నాయి. అసలు దేవాలయ భూమి ఎలాంటి ఆక్రమణలకు గురి కాలేదంటున్నారు. మరో వైపు అక్కడ వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై సమాచారం లేదంటున్నారు. అసలు ఎన్‌వోసిల జారీ సమాచారం లేదంటూ సమాధానం దాటవేస్తున్నారు. గుడి స్థలంలో నిర్మాణాలెలా సాగుతున్నాయంటే సమాధానం చెప్పలేక దేవాలయ ఈవో నీళ్లు నములుతున్నాడు. పైగా ఈ గొడవ నాకెందుకన్నట్లు నాలుగు రోజులు కొలువు చేసుకొని వెళ్లే వాడినంటూ ఈవో వేదాంతం చెబుతున్నాడు. తన బాధ్యతను విస్మరించి తన చేతగాని తనం వ్యక్తం చేస్తున్నాడు. కానీ ఆయనకు తెలియకుండా ఏదీ జరగడం లేదని ప్రజలు అంటున్నారు. వాటాలు పంచుకోవడంలో అతని హస్తం కూడా వుంటుందంటున్నారు. మొత్తం మీద జమ్మికుంటలో హట్‌ కేకులాంటి భూములను కట్‌ చేసి పంచుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు సహకరిస్తున్నారు. ఇక్కడ మరో దుర్మార్గమైన విషయమేమిటంటే జమ్మికుంటలో వున్న శ్మశాన స్థలాలను కూడా కబ్జాదారులు వదలడం లేదు. వారికి సహరించకుండా రెవెన్యూ అధికారులు వుండడం లేదు. పూర్తిగా రెవెన్యూ అధికారుల అండదండలతోనే శ్మశాన స్థలాలు కూడా ఆక్రమణలకు గురౌతున్నాయి. మరోవైపు రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారుల సమాధానం మరో విచిత్రం. ప్రభుత్వ స్థలాలను ఎలా రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారని ప్రశ్నిస్తే , ఎమ్మార్వో ఎన్వోసిలిచ్చాక మేమేం చేయాలంటున్నారు. అందరూ కలిసి విశ్వేశ్వర స్వామికి నిలువ నీడ లేకుండా చేస్తున్నారు. దేవాలయ భూముల అప్పనంగా కొట్టేస్తున్నారు. లంచాలకు అలవాటు పడి అయినవి కానివి చేయడానికి రెవెన్యూ అధికారులు వెనుకాడడం లేదు. రెవెన్యూ అధికారులే సహకరిస్తున్నప్పుడు కబ్జాలకు ఎదురేముందని అక్రమదారులు పాగా వేస్తున్నారు. ఇక దేవాదాయ శాఖ ఇప్పటికైనా కళ్లు తెరుస్తుందో చూడాలి. ఇంతగా అవినీతికి తెగబడ్డ తహసీల్దారుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఎమ్మార్వో అక్రమ వ్యవహారాలు ఇంకా వున్నాయి. మరో కథనంలో మరిన్ని తెలుసుకుందాం. ప్రభుత్వం దృష్టికి తీసుకొద్దాం.

బెట్టింగ్‌ బేవార్స్‌ గాళ్లు?

 

`తుక్కు రేగ్గొడితేనే గాని దారికి రారు!

`ప్రమోషన్‌ పేరుతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు.

`11 మందిపై కేసు నమోదు?

`సినీ పెద్దలెంతో మంది ప్రమోటర్లుగా వున్నారు?

`వాళ్లకు నోటీసులతో సరిపెడతారా?

`వాళ్లను కూడా అరెస్టులు చేస్తారా?

`చిన్న చిన్న చేపల మీదనే ప్రతాపం చూపిస్తారా?

`కొందరు సినీ పెద్దల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

`హీరోలు రానా, విజయ్‌ దేవరకొండ, ప్రకాశ్‌ రాజ్‌ లాంటి వాళ్లున్నాంటున్నారు.

`టీవి ఛానళ్లలో పేరు పొందిన యాంకర్లు వున్నారు.

`మంచు లక్ష్మి లాంటి వాళ్లు కూడా ప్రమోట్‌ చేశారంటున్నారు.

`మరి వాళ్లందరికీ నోటీసులు ఎప్పుడు అందిస్తారు.

`అరెస్టు చేయబడిన వారు తమకేం పాపం తెలియదంటున్నారు.

`వర్షణి, శ్రీముఖిలపై కేసులు నమోదయ్యాయి.

`ఇప్పటి వరకు 25 మంది సినీ సెలబ్రిటీలపై ఆరోపణలు వున్నాయి.

`దేశ వ్యాప్తంగా ధోని లాంటి క్రికెటర్లు కూడా బెట్టింగ్‌ యాప్‌లు ప్రమోట్‌ చేశారు.

`దేశంలో కొన్ని వేల మంది బెట్టింగ్‌ యాప్‌ లను ప్రమోట్‌ చేశారు.

`కోట్లాది మంది నష్టపోయారు.

`కొన్ని రాష్ట్రాలలో బెట్టింగ్‌ యాప్‌లకు అనుమతులున్నాయి.

hyderabad,Netidhathri: 

 అడ్డదారిలో అక్రమార్జన సాగించాలని చూసే వారు సమాజంలో రోజు రోజుకూ పెరిగిపోతున్నారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలన్న ఆశలు వారికి తెలియకుండానే ఉచ్చులో ఇరుక్కుంటున్నారు. రూపాయి పెట్టుబడికి పది రూపాయల లాభం అనగానే ఆశపడుతున్నారు. సంపాదన సంగతి పక్కన పెడితే డబ్బులు పోగొట్టుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అప్పుల పాలౌతున్నారు. ఆస్థులు పొగొట్టుకుంటున్నారు. జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నాడు. బెట్టి ఆప్‌లు పెట్టిన వాడు బాగానే వుంటున్నాడు. ఆప్‌లను ప్రమోట్‌ చేస్తున్నవాడు సంతోషంగానే వుంటున్నాడు. ఆడిన వాడు తిరుక్షవరమైపోతున్నాడు. betting app లో పెట్టుబడి పెట్టి మోసపోయిన వాళ్లు తెలంగాణలోనే కొన్ని లక్షల మంది వున్నారు. ఇప్పుడు లబోదిబో మంటున్నారు. police స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది కేసులు ఎదుర్కొంటూ jail పాలౌతున్నారు. influencer గా మారి అమాయక జనాన్ని ముంచిన వాళ్లు తప్పించుకు తిరుగుతున్నారు. అయితే చట్టాల మీద అవగాహన లేక ప్రచారం చేసిన వాళ్లు కొంతమంది. కానీ సినీ రంగంలో ఉన్నత స్థానాలలో వున్న వారు కూడా బెట్టింగ్‌ యాప్‌లను ఎందుకు ప్రమోట్‌ చేశారన్నదే వెలుగులోకి రావాల్సి వుంది. చానల్‌ యాంకర్లు, చిన్న చిన్న పాత్రల ద్వారా నిత్యం ప్రేక్షకులను అలరించే వాళ్లు సంపాదన మీద మక్కువతో చేశారంటే అర్థం వుంది. కానీ నిత్యం నైతిక విలువల గురించి మాట్లాడే ప్రకాశ్‌ రాజ్‌ కు చట్టాలు తెలియవా? శిక్షలు పడతాయని తెలియదా? betting app ల ప్రమోషన్‌ నేరమని తెలియదా? వాటి వల్ల ప్రజలకు మేలుకన్నా నష్టమే ఎక్కువ అని తెలియనంత అమాకుడా? సినిమాలలో నటించేందుకు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌ తీసుకునే హీరోలు ఇదేం పాడు పని. హీరోలంటే ఆదర్శంగా వుండాలి. లక్షలాది మంది అభిమానులు వారిని ఆరాధిస్తుంటారు. సినిమాలలో మంచికి ప్రతి రూపంగా కనిపించే హీరోలు నిజ జీవితంలో విలన్‌లుగా మారాల్సిన అవసరం ఏమొచ్చింది. హీరోలుగా చేస్తే కోట్లు వస్తాయి. నిర్మాతలుగా కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు నిర్మిస్తారు. betting app ల ప్రమోషన్‌తో అంతకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారా? సామాన్యులకు లేని పోని మాటలు చెప్పి, ఊహల పల్లకి ఎక్కించి బెట్టింగ్‌ యాప్‌లలో డబ్బులు పోగొట్టుకునేలా చేయడం నేరం కాదా? పైగా telangana, ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రాలలో బెట్టింగ్‌ యాప్‌లు నిషేధం. వాటి promotion సాగించడం చట్టరిత్యా నేరం. అందుకు సెక్షన్లు …..నమోదు చేస్తారు. కేసులను ఎదుర్కొంటారు. జైలు పాలౌతారు. ఈ మాత్రం అవగాహన ఇతర యూ ట్యూబర్లకు అవగాహన లేదనుకుంటే అర్థం చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే కొన్ని వేల కుటుంబాలలో బెట్టింగ్‌ యాప్‌లు చిచ్చుపెట్టాయి. అందులో పెట్టుబడి పెట్టిన అనేక కుటుంబాలు వీధిన పడ్డాయి. nalgonda, warangal  జిల్లాలలో ఇప్పటికే అనేక మంది యువకులు అరెస్టయ్యారు. కేవలం ఈజీ మనికి అలవాటు పడడమే ఇందుకు కారణం. ఇక బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్‌ చేసిన వారికి పెద్ద మొత్తంలో అందుతున్నట్లు సమాచారం. తాజాగా పోలీసుల విచారణలో vishnupriya కీలక విషయాలు వెల్లడిరచించినట్లు సమాచారం. ఆమె ఇప్పటి వరకు సుమారు 25 app లను promote చేసినట్లు అంగీకరించారు. ఒక్కో యాప్‌ నుంచి సుమారు లక్ష వరకు లబ్ధి పొందినట్లు తెలుస్తోంది. దేశంలో ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో లాటరీలున్నాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో బాగ్యలక్ష్మి బంపర్‌ లాటరీ అని వుండేది. దేశంలో కేరళ లాటరీ ఫేమస్‌. ఈ మధ్య విడుదలైన lucky Bhaskar ‌ సినిమాలో కూడా లాటరీ గెలుపులో మతలబు ఏముంటుందనేది కళ్లకు కట్టినట్లు చూపించారు. అయినా ఇప్పటికీ మహారాష్ట్ర తో పాటు అనేక ఉత్తరాధి రాష్ట్రాలలో సింగిల్‌ నెంబర్‌ లాటరీలున్నాయి. కానీ మన తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడో బ్యాన్‌ చేశారు. ఆ తర్వాత మరో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. చైన్‌ సిస్టం మార్కెటింగ్‌ మోసం వల్ల లక్షల కుటుంబాలు నష్టపోయాయి. అయినా ఇప్పటికీ వాటి ఆనవాలు కనిపిస్తూనే వుంది. అయితే YouTube channel‌ వచ్చి బెట్టింగ్‌ యాప్‌ల ప్రచారానికి కేంద్రమైంది. పెద్ద ఎత్తున పుట్టుకొచ్చిన యూట్యూబర్లు, వెబ్‌ సిరీస్‌లు రూపొందించే వాళ్లు, నటీనటులు ఈ యాప్‌ల ప్రమోషన్‌ మొదలుపెట్టారు. యాప్‌ల ప్రమోషన్‌ కోసమే వెబ్‌ సిరీస్‌లు తీస్తున్న సంస్థలున్నాయి. నటీనటులున్నారు. వాళ్ల సంఖ్య తక్కువేం కాదు. మన తెలుగు రాష్టాలలోనే కొన్ని వేల మంది వున్నారు. మరి అంత మందికి నోటిసులు పంపే అవకాశం వుంటుందా? నాలుగు రోజులు హడావుడి చేసి కేసులను అటకెక్కిస్తారా? ఎందుకంటే గతంలో డ్రగ్స్‌ కేసుల విషయంలో ఇలాగే హడావుడి చేశారు. ఇప్పుడు ఆ కేసు ఏమైందో తెలియదు. దాని పురోగతి ఎంత వరకు వచ్చిందో సమాచారం వుండదు. అలాగే బెట్టింగ్‌ యాప్‌లను దేశ వ్యాప్తంగా నిషేదిస్తారో లేదో చూడాలి. వాటి ప్రమోషన్‌ ఆగిపోతుందో లేదో కొంత కాలం గడిస్తే గాని తెలియదు. పైగా ఈ కేసు కోర్టులలో నిలుస్తుందో లేదో కూడా న్యాయ నిపుణులు చెప్పాలి.

betting app case in telangana many actors names in FIR

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version