బెల్టు జోరు… కుటుంబాలు బేజారు…

బెల్టు జోరు… కుటుంబాలు బేజారు

అడ్డగోలుగా మద్యం విక్ర యాలు

పట్టించుకొని ఎక్సైజ్ అధికారులు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో రాత్రింబవ ళ్ళు పొద్దున్న కొడుకుయక ముందే యథెచ్చగా మద్యం వ్యాపారం కొనసాగుతుంది. బెల్టు దుకాణాల్లో జరుగుతు న్న ఈ అక్రమ వ్యాపారానికి సంబంధించిన అధికారులు అండదండలతో అడ్డుఅదుపు లేకుండా ఈ మద్యం వ్యాపా రం దందా మండలంలో మూ డు పూలు ఆరు కాయలుగా విరజిల్లుతుంది. దీన్ని ఆసరా గా చేసుకున్న మద్యం వ్యాపా రులు ఈ దందాను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకొని కొనసాగిస్తున్నారు. మండ లంలో వివిధ గ్రామాలలో మద్యం ఏరులై పారుతున్నది. ప్రతి గ్రామం పల్లెలలో కిరాణా దుకాణాల కంటే ఎక్కువ మద్యం దుకాణాలే దర్శనమి స్తున్నాయి. మద్యానికి బాని సలై ఎంతో మంది పేద బతు కులు చింద్ర మౌతున్నాయి. అయినా ఎక్సైజ్ పోలీసులు యంత్రానికి చీమకుట్టినట్లు కూడా లేదు వాళ్లకు నెలకు మాములు ఇస్తే చాలు. నాలు గు నెలలకు ఒకసారి తూతూ మంత్రంగా చుట్టపు చూపుగా తనిఖీలు నిర్వహిస్తూ చూసి చూడనట్టు వ్యవహరిస్తు న్నారు. బెల్టు షాపుల యజ మానులు ఒక బీరు, ఒక క్వాటర్ నుండి రూ. 20 నుండి రూ. 40 రూపాయల వరకు మద్యంపై అధికంగా వసూలు చేస్తున్నారు. మండ లంలో బెల్టు షాపులు ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఎనీ టైం మద్యంను అరిక ట్టలేరా!

ప్రభుత్వ అనుమతి కలిగిన మద్యం దుకాణాల నిర్వహణ కు సమయపాలనలో నిబంధ న ఉంది. కానీ ఎనీ టైంమద్యం దొరికేది ఒక బెల్టు షాప్ దుకా ణాలోనే ఎనీ టైం మందును అరికట్టే వారే అధికారులు లేరా!

ఇబ్బంది పడుతున్న మహిళలు

గ్రామాల్లో అక్రమంగా వెలసిన బెల్టుషాపుల దుకాణాల వల్ల మహిళలు ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. మద్యం సేవిం చిన మత్తులో బెల్టు దుకాణా ల వైపు వెళ్తున్న మహిళలను ఇబ్బందులకు గురిచేసిన ఘ టనలు అనేకం చోటుచేసు కున్నాయి. ఈ బెల్టు దుకా ణాల వల్ల చెడు మార్గాలు పడుతున్నట్టు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చని సంసారాల్లో బెల్టు దుకాణాలు చిచ్చు పెడుతు న్నాయని మహిళలు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. బెల్టు దుకాణాలపై అధికారులు కొరడా జరిపించాలని పలు వురు మహిళలు కోరుకుం టున్నారు.

యువతపై త్రీవప్రభావం

BJP Celebrates Foundation Day in Narsampet

 

 

 

మండలంలోని అనేక గ్రామాల్లో బెల్టు దుకాణాలు విచ్చలవిడిగా మొదలయ్యా యి. అందుబాటులో మద్యం దొరుకుతుంది. దీనివల్ల యు వత మద్యానికి బానిసై భవి ష్యత్తును నాశనం చేసుకుం టున్నారు. అధికారులు చర్య లు తీసుకోకపోతే భవిష్యత్తు లో ఇంకా ఎన్నో అనార్థాలు జరిగే ప్రమాదం ఉందని పలు వురు మేధావులు అంటున్నారు.

పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు

బస్టాండ్, ఆటో స్టాండ్ ఆవ రణంలో రోడ్డు పక్కనే , కిరాణం దుకాణాల్లోచాలా మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు.మండల కేంద్రం నుండి గ్రామాల్లో గల్లీకోక్క మద్యం దుకాణం. దీనికి తోడు ఇక్కడ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంతో అనుక్షణం ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మద్యం షాపు పూర్తిగా రోడ్డుకు ఆనుకునే ఏర్పాటు చేశారు.ఈ దుకా ణంలో విచ్చలవిడిగా మద్యం కొనుగోలు చేసిన వారు దుకా ణం ముందురోడ్డుపైనే మద్యం తాగి అక్కడే పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బం దులు ఏర్పడుతున్నాయి. అదే విధంగా ఈ దుకాణం పక్కనే ఇళ్ళు ఉండడంతో మందుబాబుల ఆగడాలతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ దుకాణం ముందు పలుసార్లు ఇక్కడ ఎదురెదురుగా వస్తున్న వాహ నాలు ఢీకొన్న సంఘటనలు కూడా ఉన్న సంబంధిత అధికారులు ఏ మాత్రం పట్టిం చుకోవడం లేదని తీవ్ర ఆరోప ణలు వస్తున్నాయి. మామ్ము ళ్లకు అలవాటు పడిన సంబం ధిత ఎక్సైజ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకో లేదు.దీంతో ప్రజల సమస్యలు నిత్య కృత్యం అయ్యాయి. అంతేగాక పలు గ్రామాల్లో బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి విచ్చ లవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్న అధికారులు కిమ్మనక పోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుకాణం నుండి ఆటోలు ఇతర వాహనాల్లో అక్రమంగా మద్యంను గ్రామాల్లో కొనసా గుతున్న బెల్ట్ షాపులకు తరలించి అధిక ధరలకు అమ్మకాలు చేపడుతున్నా రు.దీంతో తాగుబోతుల జేబులకు చిల్లులు పడుతున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version