anndanam mahadanam, అన్నదానం మహాదానం

అన్నదానం మహాదానం

అన్నదానం మహాదానమని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దేవేందర్‌ అన్నారు. శుక్రవారం జాతీయ సగర సేవా, ఉద్యోగుల సంఘం జాతీయ కన్వీనర్‌ నాగవేళ్ళి నరేంద్ర కుమారుడు నాగవేళ్ళి సాయి శ్రీశాంత్‌ వర్థంతిని ఎన్‌ఎస్‌ఎస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. సాయి ప్రశాంత్‌ వర్థంతి సందర్భంగా వరంగల్‌లోని లూయిస్‌ అంధవిధ్యార్థుల పాఠశాలలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాడ దేవేందర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతరులకు సేవ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం పౌండేషన్‌ తరపున సభ్యులు, యూత్‌ సభ్యులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ నాగవేళ్ళి సరిత నరేంధర్‌, కట్టా రాఘవేందర్‌, కుమారస్వామి, ఉపాధ్యక్షుడు కందికోండ వేంకటేశ్‌, ప్రధాన కార్యదర్శి అనిశేట్టి వేంకటేశ్‌, శ్రీనివాస్‌, గుజ్జారి శ్రీధర్‌ సినీ గాయకుడు రాజేందర్‌, స్వరూప, వీనీల, చేతనకుమార్‌, సాయి సిధ్ధాంత్‌, యూత్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *