ఏజెన్సీ న్యాయం కళాశాల న్యాయమైన డిమాండ్..
హక్కుల కోసం పోరాడితే కేసులు పెడతారా..
ప్రభుత్వం పై మండిపడ్డ పూనెం సాయి…
న్యాయకళాశాల ఏర్పాటు చేయకపోతే ఉద్యమిస్తాం..
గిరిజన ప్రజా ప్రతినిధుల పైన మండిపడ్డ ఆదివాసీ సంఘాలు..
మొక్కజొన్న ఆర్గనైజర్ల పైన క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్..
నూగూరు వెంకటాపురం (నేటి దాత్రి )
మార్చి ములుగు జిల్లా వెంకటాపురం మండలం

న్యాయ కళాశాల ఆదిమ తెగల న్యాయమైన డిమాండ్ అని ఆదివాసీ సంఘాల నాయకులు పేర్కొన్నారు. గోండ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం ఏజెన్సీ న్యాయ కళాశాల సాధన సదస్సు వెంకటాపురం మండలం లోని కాఫెడ్ గ్రౌండ్ లో జరిగింది. జి ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి గిరిజన ప్రజా ప్రతినిధుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిమ తెగలను విస్మరిస్తున్నాయని ముఖ్య అతిధులుగా పాల్గొన్న పాయం సత్యనారాయణ,కొర్స నర్సింహా మూర్తి, ఉయిక శంకర్, మైపతి అరుణ్ కుమార్ మండిపడ్డారు. జి ఎస్పీ ముందుకు తెచ్చిన న్యాయమైన డిమాండ్ న్యాయ కళాశాల అన్నారు. ఆదివాసీలను న్యాయ వ్యవస్థలు విస్మరిస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో అత్యంత అన్యాయానికి గురయ్యేది ఆదిమ తేగలని తెలిపారు. న్యాయ కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా ఆదివాసీలు న్యాయ విద్యను అభ్యసించే అవకాశం ఉంటుందని నాయకులు అన్నారు.ఏజెన్సీ నుండి రాజకీయ పార్టీలను తరిమి కొట్టాలని ఆదివాసీ సంఘాల నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివాసీల పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాడులు చేస్తూ ఉంటే ఎందుకు స్పందించడం లేడని నిలిదిశారు..బహుళజాతి విదేశీ విత్తన కంపెనీలను గిరిజనేతరులు ఏజెన్సీ లోకి తెచ్చి ఆదివాసీ రైతులను దగా చేస్తున్న వారిని వదిలి పెట్టేది లేదన్నారు. కాంగ్రెస్, భారాసా పార్టీలను అడ్డుపెట్టుకొని ఆదివాసీ రైతులను అప్పుల పాలు చేసి ఆత్మహత్యలు చేసుకునే విధంగా దారుణాలకు పాల్పడుతున్న కంపెనీ ఆర్గనైజర్ల పైన క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.