గ్రామాల్లో రోజూ పారిశుధ్య నిర్వాహణ చేయాలి

గ్రామాల్లో రోజూ పారిశుధ్య నిర్వాహణ చేయాలి

మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి

 

గ్రామాలల్లో ప్రతిరోజు పారిశుధ్య పనులు చేయించాలని పరకాల ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమై వర్షాలు కురిసి నీరు నిలిచి దోమలు వ్యాప్తి చెంది సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అందరు పంచాయతీ కార్యదర్శులు తమ గ్రామాలలో మురికి కాలువలు శుభ్రం చేయడం,దోమల నివారణ మందు పిచికారి చేయడం ఆయిల్ బాల్స్ తయారు చేసి నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో వేయడం లాంటి ముందస్తు చర్యలు తీసుకుని అంటు వ్యాధులు ప్రబలకుండా చూడాలని ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తే సహించబొమని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.అలాగే గ్రామాలలో ఎవరైనా జ్వరం తో బాద పడుతున్నట్లు గమనిస్తే వైద్య సిబ్బందికి వెంటనే తెలియ చేయాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!