“నేటిధాత్రి”,మహబూబాబాద్.
మహాభూభాబాద్…… ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలుసుకొన్నాం చదువులమ్మ తల్లి నీడలో అంటూ…..33 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు ఒక్క దగ్గర కలుసుకొన్నారు 1992… సంవత్సరం లో 10 వ తరగతి… అరవింద విద్యాలయంలో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హల్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ పూర్వ విద్యార్థులు చిన్న నాటి స్కూల్ డ్రెస్ లతో 50 మంది పాల్గొని తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని, ఉత్సాహంగా నృత్యాలు చేసి ఉల్లాసంగా గడిపారు. ఉద్యోగ, వ్యాపారారీత్యా ఎక్కడెక్కడో స్థిరపడి ఇతరదేశాల నుంచి ఐర్లాండ్, లండన్,అమెరికా బహ్రెయిన్ నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు 33 ఏళ్ల తర్వాత ఒకే వేదిక పై కలుసుకొని ఒకరినొకరు గుర్తు చేసుకొని ఆలింగనం చేసుకొని తన్మయత్వంలో మునిగి తేలి భావోద్వేగబరితంగా గడిపీ తమ స్నేహాన్ని ఆత్మీయతను చాటుకున్నారు.
పూర్వ విద్యార్థులు ఆటపాటలు అందరిని అలరించాయి.
పాఠశాలలో విద్యాబోధన చేసిన ఆ నాటి ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సమ్మేళనంలో నాటి ఉపాధ్యాయులు…చంద్ర దేవ్,కుమార స్వామి, సలీం,కుమార్ నాగేశ్వర్ రావు శ్రీరామరావు ఫజల్ లక్ష్మి నారాయణ వీరాస్వామి ఇతర దేశాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు తో పాటు ఇతర ప్రాంతాలలో సెటిల్ అయినా.. ఓం ప్రకాష్, ప్రమోద్, కటికరెడ్డి ఆదిత్య, మీనా. దర్మేందర్..రాజు శివరాం.. శ్రీను. వేణు. స్వామి నిరంజన్ సౌజన్య లు పాల్గొన్నారు.