ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల పెంపుకు కృషి చేయాలి
సీకేఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించిన జెడి, ప్రొఫెసర్ డీఎస్ఆర్ రాజేందర్ సింగ్
నేటిధాత్రి, వరంగల్.
వరంగల్ దేశాయిపేటలోని చందాకాంతయ్య ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలను శనివారం నాడు, కళాశాల విద్య సంయుక్త సంచాలకులు (జేడీ), ప్రొఫెసర్ డీఎస్ఆర్ రాజేంద్ర సింగ్ సందర్శించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ ధర్మారెడ్డి, అధ్యాపక బృందం స్వాగతం పలికారు.
కళాశాల లోని గ్రంథాలయం, ప్రయోగశాలలు, లేడీస్ హాస్టల్ తదితర వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో జేడీ ప్రొఫెసర్ డీఎస్ఆర్ రాజేంద్రసింగ్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధిక సంఖ్యలో ప్రవేశాలు తీసుకునేలా విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు.

సీకేఎం డిగ్రీ కళాశాలలో నెట్, సెట్, పీహెచ్డీ వంటి అత్యున్నత విద్యార్హతలు, బోధన అనుభవం కలిగిన అధ్యాపకులు ఉన్నారని, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ విభాగాలు అందుబాటులో ఉన్నాయని విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎన్సిసి లో విద్యార్థులు శిక్షణ పొందినట్లయితే సాధారణ డిగ్రీతో పాటు మిలిటరీ డిగ్రీ కూడా వస్తుందని, అది విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని భవిష్యత్తులో ఆర్మీ, పోలీస్, పారా మిలిటరీ విభాగాలలో ఉన్నత ఉద్యోగాలకు ఎంపిక అవుతారని తెలియజేశారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంపిక చేసుకొని ముందుకు తగిన విధంగా శ్రమించాలని అధ్యాపకులు బోధన, పరిశోధన రంగాలలో మరింత నైపుణ్యాలను పెంపొందించుకొని కళాశాలను అభివృద్ధి చేయాలని సూచించారు.
సికేఎం కళాశాల అభివృద్ధి కోసం కళాశాల విద్య కమిషనర్ ఆదేశానుసారం ప్రభుత్వపరంగా సహాయ సహకారం అందించేందుకు తాము కృషి చేస్తామని తెలిపారు.

గెస్ట్ అధ్యాపకులు తమ సేవలను ఆటో రెన్యువల్ చేసి ప్రతి నెల కన్సాలిడేట్ పేమెంట్ ఇవ్వాలని, 12 నెలల వేతనం ఇవ్వాలని జేడీ కి వినతిపత్రం అందజేశారు.
అనంతరం జెడి ప్రొఫెసర్ డీఎస్ఆర్ రాజేంద్ర సింగ్ కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ ధర్మారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కే ఎల్ వి వరప్రసాదరావు, పూర్వ ప్రిన్సిపల్ డాక్టర్ జి శశిధర్ రావు, ఎన్సిసి ఆఫీసర్ కెప్టెన్ డాక్టర్ పి .సతీష్ కుమార్, లైబ్రేరియన్ ఎస్. అనిల్ కుమార్, సి సి ఈ సూపరిండెంట్లు కృష్ణారెడ్డి, ఖుర్షీద్, కళాశాల సూపరిండెంట్ జి.శ్రీనివాస్, జ్ఞానేశ్వర్, పాష,బోధన , బోధనేతర సిబ్బంది , విద్యార్థులు, ఎన్సిసి క్యాడేట్స్ తదితరులు పాల్గొన్నారు.