డిపెండెంట్లకు నియామక పత్రాల పంపిణీ
మందమర్రి నేటి ధాత్రి
మందమర్రిలో 14 మంది డిపెండెంట్లకు నియామక పత్రాల పంపిణీ – సింగరేణి భవిష్యత్తు కోసం కృషి చేస్తానన్న మంత్రి డా. వివేక్ వెంకటస్వామి గారు
ఈరోజు మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా జీఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మైనింగ్ మరియు కార్మిక శాఖ మంత్రి గౌరవ డా. వివేక్ వెంకటస్వామి గారు, 14 మంది బొగ్గుగని కార్మికుల డిపెండెంట్లకు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు
ఈ కార్యక్రమంలో మందమర్రి ఏరియా జీఎం శ్రీ దేవేందర్ , ఏఐటీయూసీ అధ్యక్షుడు శ్రీ వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ:

“బొగ్గుగని కార్మికులంటే మా కాకా డా. వెంకటస్వామి కి అమితమైన ప్రేమ ఉండేది. ఆయన కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్న సమయంలో, నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థ మూసివేయకుండా అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు తో చర్చించి, ఎన్టీపీసీ నుంచి రూ.400 కోట్లు రుణం ఇప్పించి సంస్థను ఆదుకున్నారు. లక్షలాది కార్మిక కుటుంబాలకు బాసటగా నిలిచారు.”

“ఈరోజు సింగరేణి సంస్థ లాభాల బాటలోకి రావడానికి, కార్మికుల క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం ప్రధాన కారణం. తెలంగాణలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిని కాపాడుకోవడం మనందరి బాధ్యత.”
“గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో, సంస్థ అభివృద్ధికి తగిన ప్రయత్నం జరగలేదు. కేవలం నిధుల వాడకానికే పరిమితమైంది. ఇకపై కొత్త గనులు, కొత్త ఉద్యోగ అవకాశాలు తీసుకురావడంపై దృష్టి పెడతాం. కేంద్ర ప్రభుత్వం చేపట్టే టెండర్లలో సింగరేణి సంస్థ నేరుగా పాల్గొనగలిగే విధంగా చర్యలు తీసుకుంటాం.”

ఈ కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న కుటుంబాలు మంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగావకాశం వారి జీవితాలకు మేలు చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.