వనపర్తి లో అవసరం లేని చోట సిసి రోడ్ల నిర్మాణం పై అధికారులపై ఏ సీ బీ అధికారులకు ఫిర్యాదు
ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్
వనపర్తి నెటిదాత్రి :
వనపర్తి పట్టణంలో మున్సిపల్ టి యు ఎఫ్ యూ డి సి ప్రభుత్వ ని లతో చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణం అవసరం లేని చోట వేస్తున్నారని మంచిగా ఉన్న రోడ్లను తొలగించి ప్రభుత్వ నిధులతో సి సి రోడ్లు వేయించి అభివృద్ధిని పక్కదారి పక్కదారి పట్టిస్తున్నారని అదేవిధంగా సిసి రోడ్లు నాణ్యతగా వేయడం లేదని అధికారుల పర్యవేక్షణ కాంట్రాక్టర్ పర్యవేక్షణ లేదని వర్షంలో కూడా సిసి రోడ్డు వేయడం వల్ల నాణ్యత కోల్పోతుందని జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ సెల్ నెంబర్ 630 99 76 569 విలేకరులకు తెలిపారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో సిసి రోడ్ల నిర్మాణం నూతన కాలువ ల నిర్మాణం వాటిపై సందర్శించామని ఆయన పేర్కొన్నారు అధికారుల అవినీతి కాంట్రాక్టర్ చిన్న చోటా నాయకుల జోబులు నింప డానికి సీసీ రోడ్డు మురికి కాల్వలు ఓంకర టింకర నాసిరకంగా కట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వనపర్తి లో ప్రభుత్వ సొమ్ము అధికారుల జేబుల్లోకి చోటా నాయకుల జేబుల్లోకి వెళుతున్నాయని సాక్షాదా రా లతో అఖిలపక్ష ఐక్యవేదిక ప్రజల తరఫున హ్యూమన్ రైట్స్ చీఫ్ సెక్రటరీ ఏసీబీ సిఎండిఎస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ప్రజా భవన్ హైదరాబాద్ కు ఫిర్యాదు చేస్తామని చేస్తామని ఆయన తెలిపారు . ప్రజల సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తే కాంట్రాక్టర్ చోటా నాయకులకు జేబులు నింపుతూ వనపర్తి పట్టణ అభివృద్ధిని పక్కదారి పట్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సి సి రోడ్లను నూతనంగా నిర్మించే కాలువలను తనిఖీ చేసిన వారిలో జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు సతీష్ యాదవ్ గౌనికాడి యాదయ్య కొత్త గొల్ల శంకర్ బొడ్డుపల్లి సతీష్ రామస్వామి కురుమూర్తి రాము వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు