పదోన్నతి పొందిన లక్ష్మణ్ సన్మానం
నర్సంపేట,నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపోలో సెక్యూరిటీ హెడ్ గార్డ్ గా పదోన్నతి పొంది బదిలీపై కరీంనగర్ వర్క్ షాప్ వెళ్తున్న భోజనపు లక్ష్మణ్ ను ఆర్టీసీ సిబ్బంది ఘన సన్మానం చేశారు.ఈ సందర్భంగా
డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీతో పాటు డిపో సెక్యూరిటీ హెడ్ వీరారెడ్డి, సెక్యూరిటీ టీం గోవర్ధన్,దేవేందర్ లక్ష్మణ్ ను శాలువాలు,పుష్ప గుచ్చo తో సన్మానం చేశారు.అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో డిపో ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ వెంకట్ రెడ్డి,గ్యారేజ్ సిబ్బంది,డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.