ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్కూల్ బ్యాగుల పంపిణీ
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సిరిసిల్లలో ఈ విద్యా సంవత్సరం 2025 – 2026 పాఠశాలలో చదివే 300 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం పాఠశాల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో వారి చేతులమీదుగా జరిగింది.
వీటితోపాటు, ప్రతి విద్యార్థికి టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ యూనిఫామ్స్ అందజేయడం జరిగింది.
పాఠశాల పూర్వ విద్యార్థులైన మదన్ కుమార్, మ్యాన శ్రీధర్, చేరాల నారాయణ, నాగుల అమరేందర్, సురేష్, మల్లేశం, ఈశ్వర్, రమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ చకినాల శ్రీనివాస్ ఉపాధ్యాయ బృందం అందరూ కలిసి 300 స్కూల్ బ్యాగులను స్పాన్సర్ చేశారు.
ఇట్టి కార్యక్రమానికి పాఠశాల పూర్వ విద్యార్థులు గెంటియాల శ్రీనివాస్ మనోహర స్వామి, గుజ్జే పురుషోత్తం, దశరథం, పాషా, దేవరాజు, సురేందర్, స్వామి, సురేష్, బాలకిషన్ తదితరులు ముఖ్య అతిథులుగా వచ్చారు.
అతిథులు విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారని ఇంత చక్కటి పాఠశాలలో చదువుతున్నందుకు సంతోషం వారి ముఖంలో కొట్ట వచ్చినట్లు కనిపిస్తుందని, పూర్వ విద్యార్థులు అందరూ కలిసి స్కూల్ బ్యాగ్ లు అందజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకొని చక్కగా చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని తెలిపారు.
మాజీ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అయిన డాక్టర్ చకినాల శ్రీనివాస్ నేతృత్వంలో పాఠశాల పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నదని తెలియజేశారు.
పాఠశాల అన్ని రంగాలలో సర్వతో ముఖాభివృద్ధి సాధిస్తుందని తెలిపారు.
అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ చకినాల శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాల పూర్వ విద్యార్థులు అన్ని రంగాలలో పాఠశాలను ముందుకు నడిపిస్తున్నందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ విద్యార్థులందరూ
ఈ పాఠశాలలోని సౌకర్యాలను కంప్యూటర్ ల్యాబ్ లైబ్రరీ సైన్స్ ల్యాబ్ వాటన్నింటినీ సక్రమంగా వినియోగించుకొని ఉన్నతులుగా ఎదగాలని కోరారు.
ప్రస్తుతం మన పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో వివిధ రకాల పోటీలలో గెలుపొందుతూ పాఠశాల పేరును రాష్ట్రవ్యాప్తం చేశారు వారందరికీ అభినందనలు.
ఈ కార్యక్రమంలో పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ చకినాల శ్రీనివాస్ గారు పాఠశాల ఉపాధ్యాయులు బైరి రవీందర్, టి తిరుపతి, వి రవీందర్, బి శకుంతల, రాజగోపాల్ రెడ్డి, డేవిడ్సన్, రమాదేవి రాజేశం ఉమాకర్ విజయలక్ష్మి ఇప్పప్పుల దేవేందర్ ఉపేందర్ అనిల్ రాజు విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.