గీత కార్మికుడు మృతి.
నాగర్ కర్నూల్/ నేటిదాత్రి :
నాగర్ కర్నూలు జిల్లాలోని తాడూరు మండలంలో సిర్సవాడ గ్రామంలో తాడిచెట్టు పైనుండి కిందపడి గీత కార్మికుడు మల్లేష్ (40) మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం తాటి కల్లు దింపడానికి పైకి వెళ్లి కళ్ళు దింపే ప్రయత్నంలో.. మొకు తాడు తెగి.. భూమిపైకి జారిపడి అక్కడి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతిడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.