చిన్న దోమలు ప్రాణంతకమైనవి
మండల వైద్యాధికారి అమరేందర్ రావు
ముత్తారం నేటి ధాత్రి:
జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అన్న ప్రసన్న ఆదేశానుసారము మండల వైద్యాధికారి అమరేందర్ రావు తన యొక్క సిబ్బందితో కలిసి మండలంలో డెంగ్యూ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో భాగంగా సిబ్బంది ప్రజలకు వినిపించేలా దోమతెరలు వాడండి దోమ కాటు నుండి రక్షణ పొందండి చిన్న దోమ ప్రాణాంతకమైనది దోమలు ప్రజారోగ్యానికి ప్రాణాంతకమైనవి నిలువ నీళ్లు దోమలకు ఇల్లు వేపాకు పొగ దోమలకు సెగ ప్రతి శుక్రవారం మరియు మంగళవారము డ్రైడే పాటించాలని చెప్పుతూ స్లొగన్స్ ఇవ్వడంతోపాటు ర్యాలీ నిర్వహించారు వైద్యాధికారి అమరేందర్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలని తన ఇంటి చుట్టూ నీరు నిల్వలు ఉండకుండా చూసుకోవాలని జ్వరం వచ్చిన వెంటనే ఆరోగ్య కేంద్రం కు వచ్చి డాక్టర్ని సంప్రదించాలని తెలుపుతూ డెంగ్యూ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమం లో వైద్య సిబ్బంది పి ఎచ్ ఎన్ గ్రేసీ మను స్టాఫ్ నర్స్ రవళి ఝాన్సీ ఎల్ టీ అనిల్ పార్మాసిస్ట్ జగదీశ్ ఎ ఎన్ ఏమ్స్ స్రవంతి రమాదేవి దుర్గ కళావతి సునీత ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం ఇంచార్జి లు బొల్లం దీప్తి లావణ్య శ్రీను పాల్గొన్నారు