గ్రామ శాఖ ఎన్నిక….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి:
తంగళ్ళపల్లి మండలంలోని కేటీఆర్ సేన గ్రామ శాఖ అధ్యక్షుడిగా బాల సాని వెంకటేష్ గౌడ్ ను నియమించారు. ఈ సందర్భంగా కేటీఆర్ సేన మండల అధ్యక్షులు భాస్కర్ గారు మాట్లాడుతూ గ్రామ గ్రామాన కేటీఆర్ సేన ను బలోపేతం చేస్తూ యువతలో చైతన్యాన్ని నింపే విధంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని నూతనంగా ఎన్నికైన కేటీఆర్ సేన గ్రామ శాఖ అధ్యక్షులు బాలసాని వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ అధికార పార్టీ చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టి గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయివరకు. B.R.S. పార్టీ చేసిన అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరోసారి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు నిరంతరం పనిచేస్తామన్నారు. అలాగే ఉపాధ్యక్షుడిగా బోనీ ఘన మహిపాల్ యాదవ్. ప్రధాన కార్యదర్శిగా చిట్యాల రాజశేఖర్. సోషల్ మీడియా ఇన్ఛార్జి బడ్క్.అజయ్ యాదవ్. కార్యదర్శిగా మిడిదొడ్డి శ్రీకాంత్. కోశాధికారిగా రేగుల నరేందర్ రెడ్డిని. నియమించడం జరిగిందని. ఇట్టి కార్యక్రమంలో B.R.S. గ్రామ శాఖ అధ్యక్షులు తుమ్మల కనకయ్య. సీనియర్ నాయకులు. కురుమ రాజయ్య. మాజీ సర్పంచ్ అట్లగట్ట భాస్కర్. తాజా మాజీ ఎంపీటీసీ కరికవేని . కుంటయ్య. సీనియర్ నాయకులు సవన పెళ్లి బాలయ్య. ఎం శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు