ముందస్తు బడిబాట కార్యక్రమం
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలోని మైలారం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ముందస్తు బడిబాట కార్యక్రమం నిర్వహి స్తున్నారు. మంగళవారం హెడ్మాస్టర్ నాగ సుభాషిని ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఇంటింటా తిరిగారు. బడి ఈడు పిల్లల తల్లిదండ్రులను కలిసి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందు తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల లోనే చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ర్థులకు ఉచితంగా దుస్తులు, నోట్ పుస్తకాలతో పాటు మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయు లు సంధ్యారాణి, రమేష్, అరుణ్ కుమార్ పాల్గొన్నారు.