గుడ్ ఫ్రై డే సందర్బంగా పరకాలలో సిలువయాత్ర.

Good Friday Good Friday

గుడ్ ఫ్రై డే సందర్బంగా పరకాలలో సిలువయాత్ర

 

పరకాల నేటిధాత్రి

గుడ్ ఫ్రైడే (శుభశుక్రవారం) సందర్బంగా దివ్య కారుణ్య యేసు క్యాతలిక్ సంఘం ఫాదర్ బాలరాజు ఆధ్వర్యంలో ఉదయం బస్టాండ్ కూడలినుండి మొదలై పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట సిలువ యాత్రను చేపట్టారు.అనంతరం యూదుల రాజైన యేసుక్రీస్తు వారు ఈలోకంలో జీవించే జనాంగం కోసం సిలువలో ఎలా వేయబడ్డారని కళ్ళకు కట్టినట్టుగా యేసుక్రీస్తు వేశాధారణతో కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మడికొండ బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటి నాయకులు,మాజీ ఒకటో వార్డు కౌన్సిలర్ మడికొండ. సంపత్ కుమార్,డాక్టర్ మడికొండ శ్రీను,క్రైస్తవ సోదర సోదరీమణులు,సంఘ సభ్యులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!