కాసుల కొరకే కోటి విద్యలు.
రోజుకు 4.8 నుండి 6. 60 లక్షల అక్రమ వసూళ్లు
అక్రమ వసూళ్లలో సత్తా చాటుతున్న క్వారీలు.
వసూళ్ల కె కాంటాల వద్ద టీఎస్ఎండిసి “పోసుడు” తీసుడు”.
అక్రమ ఇసుక రవాణా ఎక్కడ ఆగింది,క్వారీల్లో కూడా ఝాట్కా బకెట్.
దర్జాగా సొమ్ము తీసుకొని, అదుపు ఇసుక రవాణా.
మరో 6 కొత్త క్వారీలు ప్రారంభం, 20 తేదీ నుండి లోడింగ్ కు గ్రీన్ సిగ్నల్.
మహాదేవపూర్ -నేటి ధాత్రి:
అదనపు ఇసుక అక్రమ అక్రమ రవాణా అదనపు బకెట్ల వ్యవహారం పై ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేయడంతో, తిన్న పానం ఎలా ఆగుతుంది, ఏదో ఒక ఉపాయం చేయాల్సిందే కదా దానికి పరిష్కారం ఎవరిస్తారు అంటే కేరాఫ్ టీఎస్ఎండిసి అధికారులే, పొట్టకూటి కొరకు కోటి విద్యలు అన్న సామెత ఉంది, కానీ అక్రమ సొమ్ము దూచుకొనుటకు “ఇసుక క్వారీల్లో కాసుల కొరకు కోటి విద్యలు” అనే కొత్త సామెత జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని మహాదేవపూర్ పుసుపల్లి వన్ తో పాటు కాలేశ్వరం పరిధిలోని, పలుగుల ఎనిమిది, పలుగుల తొమ్మిది, పుసుపల్లి పలువుల ఆరు, పుసుపల్లి ఒకటో నెంబర్ ఇసుక క్వారీల కాంట్రాక్టర్ టిఎస్ఎండిసి అధికారులు కలిసి “కాసుల కొరకు కోటి విద్యలు” అన్న సామెతను నిజం చేస్తున్నారు. టిఎస్ఎండిసి అధికారులు సిబ్బంది బాధ్యత రహితంగా చేయాల్సిన పనులను, కాంట్రాక్టర్ లకు కీలుబొమ్మలుగా మారి, సీరియల్ నంబర్, లోడింగ్, ఫోక్ లైన్ డీజిల్, కాంటాల వద్ద పోస్టులు తీసుడు, పాసింగ్ పై మరో 300 కిలోలు అదనపు ఇసుక పేర్లతో వసూళ్లు చేస్తూ,ఇసుక క్వారీల్లో కాంట్రాక్టర్ సిబ్బంది, టీఎస్ఎండిసి బాధ్యులు, అక్రమంగా దోచుకొని పంచుకుంటున్నారు.
కాసుల కొరకే కోటి విద్యలు.
మండలంలోని మహాదేవపూర్ పుసుపల్లి 1, పలుగుల 8 ,9, పుసుపల్లి పలుగుల ఆరు, పుసుపల్లి 1, ఈ ఇసుక క్వారీల్లో, అదనపు బకెట్ల వ్యవహారం కొనసాగకపోవడంతో, కాసుల కొరకు కోటి విద్యలు అనే విధంగా, లోడింగ్ చార్జి పేరుతో 900 నుండి 1200 వరకు, వీటిలో సీరియల్ నంబర్ పేరుతో మరో నాలుగు వందలు, లోడింగ్ వద్ద 100 నుండి 200, మరోవైపు కాంత వద్ద పోసుడు తీసుడు వ్యవహారం, టీఎస్ ఎంబీసీ సిబ్బంది కూర్చుని, 600 కిలోలకు తక్కువగా 300 కిలోల వరకు పాసింగ్ పై అదునపు ఇసుక వేయడం, అలాగే ఎక్కువ గా వచ్చిన ఇసుకను తీసి 300 కిలోల వరకు లారీలో ఉంచడం కొరకు మరో 200 రూపాలు అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఎక్ స్త్ర బకెట్ వ్యవహారం ఆగిన పర్వలేదు, 300 కిలోల ఇసుక జట్కాబకెట్ పేరుతో కొనసాగడం, మిగతా సీరియల్ ,లోడింగ్ ,డిజిల్, లాంటి పేర్ల ట్ అక్రమ వసూళ్ల విధానాలు పకడ్బందీగా అమలు చేస్తూ దర్జాగా దోచుకోవడం జరుగుతుంది.
రోజుకు 4.8 నుండి 6. 60 లక్షల అక్రమ వసూళ్లు

ప్రస్తుతం మండలంలో అక్రమ వసూళ్ల పేరుతో పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్న మహదేవ్పూర్ కాలేశ్వరం పరిధిలోని ఐదు క్వారీల్లో ప్రతిరోజు 400 నుండి 550 లారీలు ఇసుక రవాణా కొరకు ఆయా క్వారీల కు రావడం జరుగుతుంది. ఈ ఐదు క్వారీలు తమ ఒప్పందం ప్రకారం 900 నుండి 1400 రూపాయల తో సుమారు ఒక్కసారి రోజుకు లక్ష 20,000 నుండి 1,60,000 వరకు, అక్రమ వసూళ్లు చేస్తున్నారు.
ప్రతిరోజు ఒక్కొక్క క్వారీకి యావరేజ్ గా 90 నుండి 110 లారీలు ఇసుక రవాణా కోసం రాగా, ఈ ఐదు ఇసుక క్వారీలో మొత్తం ఒక్క రోజుకు, నాలుగు లక్షల 80 వేల నుండి ఆరు లక్షల 60 వేల వరకు, అక్రమ వసూళ్లు చేసి, కాంట్రాక్టర్ మరియు టిఎస్ఎండిసి పంచుకోవడం జరుగుతుంది. దీనికి సాక్ష్యం టిఎస్ఎండిసి సిబ్బంది ఈ ఐదు క్వారీలో లారీల వద్ద అలాగే కాంటాల వద్ద కూర్చొని వసూళ్లు చేయడమే దీనికి సాక్ష్యం. అక్రమ వసూళ్లలో ఈ ఐదు క్వారీలు రారాజులుగా దర్జాగా తమ వసూళ్ల వ్యవహారాలను కాంట్రాక్టర్ మరియు టిఎస్ఎండిసి సిబ్బంది కలిసి దోచుకోవడం జరుగుతుంది.
వసూళ్ల కె కాంటాల వద్ద టీఎస్ఎండిసి “పోస
పుసుడు తీసుడు వ్యవహారం అక్రమ వసూళ్లకు ప్రధాన సూత్రధారి పాత్రధారి కూడా, అని చెప్పడంలో సందేహం లేదు, అనేక సాక్షాలు కాంటాల వద్ద టీఎస్ఎండిసి సిబ్బంది, బోసుడు తీసుడు పేరును అక్రమ వసూళ్లకు మారుపేరుగా మార్చేసి సొమ్ము చేసుకుంటున్నారు. లోడింగ్ వద్ద ఉండి, లారీ యొక్క కెపాసిటీ పెద్ద చిన్న బకెట్ల లెక్కలు చూసి లారీలో లోడ్ చేయించి బాధ్యత ఉన్నప్పటికీ, టీఎస్ఎండిసి సిబ్బంది కాంట్రాక్టర్ గుడిసెలకు పరిమితమై, వేబిల్ వద్ద వసూళ్లతో పాటు, కాంట వద్ద ఏసుడు తీసుడు వద్ద తమ విధుల్లో ప్రాధాన్యత మైనటువంటి పాత్రగా భావిస్తూ, 200 నుండి 400 రూపాయలు, 300 కిలోల ఇసుక పాసింగ్ పై అదనంగా వేస్తూ సొమ్ము చేసుకోవడం జరుగుతుంది.
అక్రమ ఇసుక రవాణా ఎక్కడ ఆగింది,క్వారీల్లో కూడా ఝాట్కా బకెట్.
అక్రమ ఇసుక రవాణా ఎక్కడ ఆగింది, పాసింగ్ పై 300 కిలోలు ఒక్క లారీకి, అలాగే మరికొన్ని లారీలకు 500 కిలోల వరకు అదనపు ఇసుక వేస్తూ, 200 నుండి 500 రూపాయల వరకు వసూలు చేయడం జరుగుతుంటే అదనపు ఇసుక రవాణా ఏ విధంగా ఆగినట్లు, ఒక్కసారిలో సుమారు రోజుకు 120 లారీల లోడింగ్ ఇసుకను యావరేజ్ గా లోడ్ అయిన క్రమంలో, 60 లారీల్లో 300 కిలోల చొప్పున 18 వేల కిలోల మరో 60 లారీలకు 500 చొప్పున లెక్కచేస్తే 30 వేల కిలోల ఇసుక అంటే మొత్తం ఒకరోజు ఒక క్వారీలో పాసింగ్కు పై 48 వేల కిలోల ఇసుక అక్రమంగా రవాణా జరుగుతున్నట్లు కాదా దీన్ని ఏమంటారు, టీఎస్ఎండిసి ఉన్నత అధికారులు ఒక్క ఇసుక క్వారీలో ఒకరోజు 48 వేల కిలోల ఇసుక అంటే ఐదు ఇసుక క్వారీలకు కలుపుకొని రెండు లక్షల 40 వేల కిలోల ఇసుక ప్రతిరోజు అక్రమంగా రవాణా జరుగుతుంది అన్నట్లు కదా దీన్ని ఏమంటారో ఉన్నత అధికారులే సమాధానం చెప్పాలి మరి.
మరో నాలుగు కొత్త క్వారీలు, 20 తేదీ నుండి లోడింగ్ కు గ్రీన్ సిగ్నల్.
ఇక మండలంలో టిఎస్ఎండిసి మైనింగ్ శాఖ వ్యవహారం ఎవరికి అర్థం కాని పరిస్థితిగా మారింది, దర్జాగా అక్రమాలు లక్షల రూపాయలు సొమ్ము చేసుకోవడం జరుగుతుందని సాక్షాలు తెరపైకి తెచ్చిన, నిద్ర మత్తు వీడని అధికారులు, మరో నాలుగు నూతన క్వారీల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తోపాటు 20వ తేదీ ఆదివారం నుండి నాలుగు క్వారీల్లో లారీల లోడింగ్ ప్రారంభమవుతుందని తెలపడం జరిగింది,మహాదేవపూర్,1,4,బోమ్మాపూర్,2,3,4, ,ఎల్కేశ్వరం,1 పేరుతో 6 రీచుల నుండి ఇసుక రవాణా చేయడం జరుగుతుంది టి ఎస్ ఎం డి సి శాఖ తన వెబ్ సైట్ లో పేర్కొంది. కొత్త ఇసుక క్వారీలు ప్రారంభం ఇసుక రవాణా తో ప్రభుత్వం తో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపాధి కొరకు మేలు జరుగుతుంది అనే ఇది వాస్తవమే కానీ, అక్రమ వసూళ్లు అక్రమ ఇసుక రవాణా అరికట్టడం టిఎస్ఎండిసి బాధ్యత కాదా, కొత్త క్వారీలు ప్రారంభించక ముందు అక్రమాలు చేపడుతున్న క్వారీలపై చర్యలు తీసుకుంటే నూతనంగా ప్రారంభం కాబడుతున్న క్వారీలు కూడా అక్రమ వ్యవహారాలకు దూరంగా ఉండి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టకుండా ఉండడం జరుగుతుంది. శాఖ ఉన్నత అధికారులు అక్రమాలు చేస్తున్న క్వారీల పై గత 15 రోజులుగా వరుస కథనాలు సాక్షాలు వస్తున్న, చర్యలు తీసుకోకుండా కొత్త క్వారీల నుండి ఇసుక రవాణా కొరకు గ్రీన్ సీక్రెట్ ఇవ్వడం, అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఇసుక రవాణా తో ప్రభుత్వ ఖజానాకు మేలు జరుగుతుంది అన్నది వాస్తవమే, కానీ అక్రమ ఇసుక క్వారీలపై చర్యలు మరింత ప్రాధాన్యం అని కూడా ఉన్నత అధికారులు భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.